ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు తీసుకువచ్చామని, 4.7 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించామని సీఎం చంద్రబాబు, మంత్రులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో పొరుగు ఉన్న కర్ణాటక నుంచి ఏపీపై రాజకీయ దాడులు జరుగుతున్నాయి. తమ కంపెనీలను.. తమ రాష్ట్రంలోని వ్యాపారాలను.. ఏపీ లాక్కునే ప్రయత్నం చేస్తోందని కర్ణాటకలోని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీని పారాసైట్(పరాన్నజీవి-ఇతరులపై ఆధారపడి జీవించే జీవి) అని వ్యాఖ్యానించారు. “దెబ్బతిన్న ప్రాణులు..(రాష్ట్ర విభజన కారణంగా) బలమైన వాటిపై(కర్ణాటక) ఆధారపడి బతుకుతాయి.“ అని ఖర్గే వ్యాఖ్యానించారు. “ఇది సహజం. బలహీనంగా వ్యవస్థలు.. బలమైన వాటి నుంచి తీసుకుని బతుకుతాయి.(అంటే కర్ణాటక సంస్థలను ఏపీ తీసుకుంటుందని) ఇది తప్పుకాదు. కానీ.. ఇలా ఒకరిపై ఆధారపడి జీవించే వారు ఎంత తాము బలపడ్డామని(ఏపీకి సంస్థలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు) చెప్పుకొన్నా.. వాస్తవ బలం ముందు బలహీనులుగానే ఉంటారు.“ అని మంత్రి ఖర్గే వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే బెంగళూరు జీడీపీ.. 8.5 శాతంగా ఉందని.. 2035 నాటికి ప్రపంచ స్థాయిలో రాష్ట్రం డెవలప్ అవుతుందని కూడా చెప్పారు. అయితే.. ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్.. తీవ్రంగా స్పందించారు. “దేశంలో సన్రైజ్ స్టేట్గా మేం ఎదుగుతున్నాం. పరిశ్రమలు వచ్చేందుకు, ఉద్యోగాల సృష్టికి ప్రతి అవకాశాన్నీ వెతుకుతున్నాం. సద్వినియోగం చేసుకుంటున్నాం. రాష్ట్రాలు పెట్టుబడులు, ఉద్యోగాల కోసం పోటీపడితే, భారత్ సమృద్ధి చెందుతుందని నా నిజమైన నమ్మకం. అహంకారం సరి కాదు.“ అని ఇచ్చి పడేశారు. అంతేకాదు.. పెట్టుబడులు.. ఉద్యోగాల కల్పన వంటి విషయాల్లో పోటీ పడాలని సూచించారు.
This post was last modified on October 4, 2025 8:21 pm
ప్రభాస్ ఫౌజీ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనక్కర్లేదు. రాజా సాబ్ డిజాస్టర్ తర్వాత ఈ ఏడాది ఆ…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కాకినాడ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయనకు తీవ్ర…
తమిళనాడు సీఎం విజయ్, సినీ నటి త్రిషల మధ్య రిలేషన్ షిప్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి…
బాలీవుడ్ ఖాన్ల ప్రభంజనంలో తనకంటూ ఒక ఉనికిని దక్కించుకున్న హీరో ఇమ్రాన్ హష్మీ. ఒకప్పుడు మంచి హిట్లతో ముద్దుల వీరుడిగా…
గుంటూరులోని తూర్పు, పడమర నియోజకవర్గాల్లో వైసీపీ తన ప్రభావం, ప్రాభవం కూడా కోల్పోయింది. రెండున్నరేళ్ల కాలంలో పార్టీ ఘోరంగా దెబ్బతిందన్న…
ఏపీలోని నిర్దేశిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోన్న…