Political News

పెద్దిరెడ్డి ఫ్యామిలీని జగన్ నిజంగానే దూరం పెడుతున్నాడా?

ఏపీలో 2019 నుంచి 2024 వరకు అధికారం చెలాయించిన వైసీపీ… 2024 ఎన్నికల్లో ఒక్కసారిగా 151 సీట్ట నుంచి 11 సీట్లకు పడిపోయింది. ఫలితంగా అప్పటిదాకా బలీయంగా కనిపించిన వైసీపీ.. అత్యంత బలహీన పార్టీగా గోచరించడం మొదలైంది. ఈ పరిస్థితి నుంచి పార్టీని కాపాడుకునేందుకు జగన్ నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగా ఆయన ఏ ఒక్కరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే… పార్టీలో బలమైన కుటుంబంగా కనిపిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఏకంగా పార్టీ నుంచి గెంటేసేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

వైసీపీ విపక్షంలోకి రాగానే… ఆ పార్టీ అధికారంలో ఉండగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నేతలు వరుసబెట్టి అరెస్టు అవుతున్నారు. అలాంటి వారిలో మాజీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలను కలిసేందుకు జగన్ నేరుగా వారు ఉంటున్న జైళ్లకు వెళ్లారు. ఈ మేరకు ఆయన నిబంధనల మేరకు ములాఖత్ లకు దరఖాస్తు చేసుకుని అనుమతులు సాదించుకుని మరీ కలిశారు. మరి 72 రోజుల పాటు పెద్దిరెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని మాత్రం కలవలేదు. అసలు జగన్ అటువైపు చూడలేదంటే అతిశయోక్తి కాదేమో. 

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వంశీ రిలీజ్ అయిన వెంటనే ఆయన తన ఫ్యామిలీని వెంటేసుకుని మరీ జగన్ ను కలిశారు. జగన్ ఆయనకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే మిథున్ జైలు నుంచి విడుదలై ఏకంగా నాలుగు రోజులు అవుతున్నా… జగన్ ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చినట్టే కనిపించట్లేదు. రహస్యంగా వారిద్దరూ కలిసి మాట్లాడుకున్నారో, ఏమో తెలియదు గానీ పబ్లిక్ గా అయితే వారిద్దరూ కలిసినట్లు ఓ చిన్న ఫొటో గానీ, ఓ వార్త ముక్క గానీ కనిపించలేదు. అయితే అటు మిథున్ తో పాటు ఆయన తండ్రి కూడా తమకు ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ ను వదిలేది లేదని, వైసీపీని వీడేది లేదని, తమ రాజకీయ ప్రయాణం మొత్తం జగన్ తోనే అని అడిగిన వారికి అడగని వారికీ చెప్పుకుంటూ తిరుగుతున్నారు.

ప్రస్తుతం లోక్ సభలో పార్టీ నేతగా కొనసాగుతున్న మిథున్ రాజంపేట నుంచి హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. ఇక పుంగనూరు నుంచి రామచంద్రారెడ్డికి తిరుగే లేదు. 2019 తన సోదరుడు ద్వారకానాథ రెడ్డిని రంగంలోకి దించిన రామచంద్రారెడ్డి వరుసగా రెండో సారీ తంబళ్లపల్లె నుంచి గెలిపించుకున్నారు. మొత్తంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేతిలో ఓ ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఈ లెక్కన పెద్దిరెడ్డి ఫ్యామిలీ లాంటి కుటుంబాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వదులుకోదు. అయితే జగన్ మిథున్ ను ఎందుకు దూరం పెడుతున్నారన్నది అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. పరిస్థితి చూస్తుంటే… మిథున్ ఎదుగుదలను చూసి జగన్ పెద్దిరెడ్డి ఫ్యామిలీని పార్టీ నుంచి గెంటేయాలని భావిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on October 3, 2025 12:27 am

Share

Recent Posts

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

25 minutes ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

37 minutes ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

54 minutes ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

1 hour ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

1 hour ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

1 hour ago