Political News

మోడీ సేఫ్ : వారు-వీరు తేడా లేదు!

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రి చిత్ర‌మైన ఘ‌ట‌న తెర‌మీద‌కి వ‌చ్చింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ప‌నిగ‌ట్టుకుని ఆకాశానికి ఎత్తుతున్న కూట‌మి పాల‌కులు ఒక‌వైపు అయితే.. నిన్న మొన్న‌టి దాకా.. తెర‌చాటు మాత్ర‌మే మ‌ద్ద‌తు ప‌లికిన వైసీపీ ఇప్పుడు బ‌హిరంగ వేదిక‌ల‌పై కూడా.. మోడీ నామ‌స్మ‌ర‌ణ స్వ‌రాన్ని పెంచింది. వాస్త‌వానికి టీడీపీ.. బ‌హిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కాబ‌ట్టి.. మోడీనికి పొగ‌డ్డం, కేంద్రం బాగా ప‌నిచేస్తోంద‌ని కీర్తించ‌డం స‌హ‌జ‌మే. కానీ, ఎంత అభిమానం ఉన్నా.. వైసీపీ మాత్రం ఇలా బ‌య‌ట ప‌డ‌డం ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది.

మొత్తంగా కూట‌మి పార్టీల‌తో పాటు వైసీపీ నాయ‌కులు కూడా మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వారు-వీరు అనే తేడా లేకుండా.. మోడీని పొగుడుతున్న తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. తాజాగా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో తిరుప‌తి వైసీపీ పార్ల‌మెంటు స‌భ్యుడు.. డాక్ట‌ర్ గురుమూర్తి.. ప్ర‌ధానిని ఆకాశానికి ఎత్తేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో కేంద్రప్రభుత్వ 2,313 కోట్ల రూపాయల నిధులతో చేప‌ట్టిన‌ రెండవ దశ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తిరుపతి ఎంపి మద్దెల గురుమూర్తి.. మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం విద్యాభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ఐఐటిలో రెండవ దశ పనులు పూర్తయితే మరింత మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలు కలుగుతుందన్నారు. అంతేకాదు.. ప్ర‌ధాని మోడీ దార్శ‌నిక నేతృత్వంలో దేశం పురోభివృద్ధి సాధించ‌డం ఖాయ‌మ‌ని తెలిపారు. ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ మ‌రికొన్నాళ్లు పాల‌న సాగించాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని చెప్పారు. భార‌త్ విశ్వ‌ఖ్యాతి సాధించడానికి ప్ర‌ధాని మోడీనే కార‌ణ‌మ‌ని తెలిపారు.

ఇక‌, విజ‌య‌వాడ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు కూడా ప్ర‌ధాని మోడీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఆయ‌న నాయ‌క‌త్వం అద్భుతంగా ఉంద‌న్నారు. దేశం సంస్క‌ర‌ణ‌ల ప‌థంలో ముందుకు సాగ‌డానికి మోడీనే కార‌ణ మ‌ని తెలిపారు. ప్ర‌ధాని మోడీ ఉన్న‌న్నాళ్లు దేశానికి ఎలాంటి ఇబ్బంది లేద‌న్న ఆయ‌న‌.. మోడీ పేరును 32 సార్లు ప‌లికారు. ఆయ‌న‌ను 18 సార్లు పొగిడారు. ఆయ‌న నాయ‌క‌త్వాన్ని 22 సార్లు మెచ్చుకున్నారు. ఇలా.. వారు వీరు అనే తేడా లేకుండా ప్ర‌ధానిని ఇలా పొగ‌డడం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 27, 2025 3:38 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

1 hour ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago