Political News

తెలంగాణ వరద బాధితులను ఆదుకోండి: పవన్

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో తెలంగాణలో మరింత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఇప్పటికే శుక్రవారం కురిసిన భారీ వర్షానికి మూసీ నది పొంగిపొరలుతోంది. ఫలితంగా మూసీ పరిసర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వరద బాధితుల సహాయార్థం జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులను రంగంలోకి దించేశారు.

భారీ వర్షం కారణంగా మూసీ పరిమితికి మించి పొంగి పొరలుతోందని, ఈ కారణంగా ఎంజీబీఎస్ పరిసరాలు దారుణంగా మారాయని తనకు తెలిసిందని పవన్ పేర్కొన్నారు. ఈ ప్రవాహంతో మూసీ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అధికార యంత్రాంగం ఇప్పటికే సహాయక చర్యలను మొదలుపెట్టాయని ఆయన తెలిపారు. అదికారులు ఇచ్చే సలహాలు, సూచనలను బాధితులు తప్పనిసరిగా పాటించాలని పవన్ కోరారు. 

వరద బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అవసరమైన ఆహారం, ఔషధాలు ఇతరత్రా అత్యవసర వస్తువులను అందించే కార్యక్రమాన్ని తెలంగాణ జనసేన శాఖ చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ తలంగాణ శాఖ నేతలు, కార్యకర్తలు ఈ సహాయక చర్యల్లో చురుగ్గా పాలుపంచుకోవాలని కూడా పవన్ సూచించారు. వరద బాధితులకు వీలయినంత మేర సాయాన్ని అందించాలని కోరారు. ఎక్కడ కూడా ఆహారం అందలేదని బాధితులు చెప్పకుండా ఉండేలా పకడ్బందీగా సహాయక చర్యలు కొనసాగించాలని పవన్ తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

This post was last modified on September 27, 2025 11:42 am

Share
Show comments
Published by
Kumar
Tags: Pawan Kalyan

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago