Political News

తెలంగాణ వరద బాధితులను ఆదుకోండి: పవన్

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో తెలంగాణలో మరింత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఇప్పటికే శుక్రవారం కురిసిన భారీ వర్షానికి మూసీ నది పొంగిపొరలుతోంది. ఫలితంగా మూసీ పరిసర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వరద బాధితుల సహాయార్థం జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులను రంగంలోకి దించేశారు.

భారీ వర్షం కారణంగా మూసీ పరిమితికి మించి పొంగి పొరలుతోందని, ఈ కారణంగా ఎంజీబీఎస్ పరిసరాలు దారుణంగా మారాయని తనకు తెలిసిందని పవన్ పేర్కొన్నారు. ఈ ప్రవాహంతో మూసీ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అధికార యంత్రాంగం ఇప్పటికే సహాయక చర్యలను మొదలుపెట్టాయని ఆయన తెలిపారు. అదికారులు ఇచ్చే సలహాలు, సూచనలను బాధితులు తప్పనిసరిగా పాటించాలని పవన్ కోరారు. 

వరద బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అవసరమైన ఆహారం, ఔషధాలు ఇతరత్రా అత్యవసర వస్తువులను అందించే కార్యక్రమాన్ని తెలంగాణ జనసేన శాఖ చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ తలంగాణ శాఖ నేతలు, కార్యకర్తలు ఈ సహాయక చర్యల్లో చురుగ్గా పాలుపంచుకోవాలని కూడా పవన్ సూచించారు. వరద బాధితులకు వీలయినంత మేర సాయాన్ని అందించాలని కోరారు. ఎక్కడ కూడా ఆహారం అందలేదని బాధితులు చెప్పకుండా ఉండేలా పకడ్బందీగా సహాయక చర్యలు కొనసాగించాలని పవన్ తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

This post was last modified on September 27, 2025 11:42 am

Share

Recent Posts

మెలోడీ బ్రహ్మ మళ్ళీ రేసులోకి వచ్చినట్టే

ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక గూస్ బంప్స్ ఎమోషన్. కమర్షియల్ సినిమాలను తన నేపధ్య…

30 minutes ago

సంచలనం: కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామా!

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాల వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి…

38 minutes ago

అఖిల్ కొడుకుతో సిసింద్రీ-2

‘బాహుబలి’ ప్రభంజనం తర్వాత ఇండియన్ సినిమాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల జోరు ఎంతగా పెరిగిందో తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్-2లు…

57 minutes ago

మోడీకి క‌ళ్లు చెదిరేలా స్వాగ‌త ఏర్పాట్లు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మ‌రో వారంలో ఏపీకి రానున్నారు. ఆగ‌స్టు 1వ తేదీన ఆయ‌న విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురానికి…

1 hour ago

రాళ్లను మెట్లుగా మార్చి.. అదే మోదీ ప్రత్యేకత..!

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన అర్థరాత్రి సెల్ఫీ…

3 hours ago

స్టీవెన్ శంకర్ ప్రేమ బాగానే కనెక్టయ్యింది

తాజాగా విడుదలైన చెన్నై లవ్ స్టోరీకి ఆశించిన ఓపెనింగ్ దక్కింది. టాక్ పరంగా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఒకసారి…

3 hours ago