బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో తెలంగాణలో మరింత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఇప్పటికే శుక్రవారం కురిసిన భారీ వర్షానికి మూసీ నది పొంగిపొరలుతోంది. ఫలితంగా మూసీ పరిసర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వరద బాధితుల సహాయార్థం జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులను రంగంలోకి దించేశారు.
భారీ వర్షం కారణంగా మూసీ పరిమితికి మించి పొంగి పొరలుతోందని, ఈ కారణంగా ఎంజీబీఎస్ పరిసరాలు దారుణంగా మారాయని తనకు తెలిసిందని పవన్ పేర్కొన్నారు. ఈ ప్రవాహంతో మూసీ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అధికార యంత్రాంగం ఇప్పటికే సహాయక చర్యలను మొదలుపెట్టాయని ఆయన తెలిపారు. అదికారులు ఇచ్చే సలహాలు, సూచనలను బాధితులు తప్పనిసరిగా పాటించాలని పవన్ కోరారు.
వరద బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అవసరమైన ఆహారం, ఔషధాలు ఇతరత్రా అత్యవసర వస్తువులను అందించే కార్యక్రమాన్ని తెలంగాణ జనసేన శాఖ చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ తలంగాణ శాఖ నేతలు, కార్యకర్తలు ఈ సహాయక చర్యల్లో చురుగ్గా పాలుపంచుకోవాలని కూడా పవన్ సూచించారు. వరద బాధితులకు వీలయినంత మేర సాయాన్ని అందించాలని కోరారు. ఎక్కడ కూడా ఆహారం అందలేదని బాధితులు చెప్పకుండా ఉండేలా పకడ్బందీగా సహాయక చర్యలు కొనసాగించాలని పవన్ తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
This post was last modified on September 27, 2025 11:42 am
తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…
ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…
బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వడం…
జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ…
డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ యూత్ ఫుల్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.…