Political News

ట్రాక్టర్ పై మెడలో ఉల్లి దండతో వైఎస్ షర్మిల

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం వినూత్న నిరసనకు దిగారు. అన్నదాతలకు అండగా, దిగజారుతున్న కనీస మద్ధతు దరలపై దండెత్తేందుకు బయలుదేరిన షర్మిల అందరినీ ఆకట్టుకున్నారు. విజయవాడలొని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ నుంచి బయలుదేరిన ఆమె ఏకంగా ట్రాక్టర్ పై ఎక్కారు. ఆపై తన మెడలో రైతును కన్నీరు పెట్టిస్తున్న ఉల్లిని ఆమె తన మెడలో వేసుకుని సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటికి బయలుదేరారు.

అయితే అప్పటికే మేలుకున్న పోలీసులు ఆంధ్ర రత్న భవన్ బయటే షర్మిలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తనను చంద్రబాబును కలిపించేదాకా వెనుదిరిగేది లేదని తేల్చి చెప్పిన షర్మిల అక్కడే రోడ్డుపై బైఠాయించారు. అయినా పోలీసులు ఆమెకు విడుదల కల్పించలేదు. అప్పటికి ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

అయినా పోలీసులు షర్మిలను ముందుకు కదలనీయకపోవడంతో ఆమె కోపోద్రిక్తులయ్యారు. పోలీసులను హెచ్చరికలు జారీ చేస్తూ కనిపించారు. అయినప్పటికీ పోలీసులు వెనక్కు తగ్గకపోవడంతో షర్మిలే వెనకడుగు వేయక తప్పలేదు. అసలే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ నిరసనలు ఎందుకు అంటూ పోలీసులు షర్మిలను నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు రాజకీయ పార్టీలు ఉన్నాయన్న షర్మిల…నేతల హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె ఆంధ్ర రత్న భవన్ లోే ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

This post was last modified on September 27, 2025 7:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

33 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago