తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నూతన పోలీసు బాసు (డీజీపీ)ని నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డిని ఆ పదవి వరించింది. అక్టోబరు 1న శివధర్ రెడ్డి రాష్ట్ర డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శివధర్ రెడ్డి… చాలా కాలం పాటు ఇంటెలిజెన్స్ విభాగంలోనే పని చేశారు. ప్రస్తుతం కూడా ఆయన ఇంటెలిజెన్స్ శాఖ చీఫ్ గా కొనసాగుతున్నారు. తాజాగా శుక్రవారం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా ఆయన ఇంటెలిజెన్స్ నుంచి నేరుగా డీజీపీగా పదవి చేపట్టనున్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాదు శివారు ప్రాంతం ఇబ్రహీంపట్నం పరిధిలోని పెద్దతుండ్లలో జన్మించిన రెడ్డి… తన ప్రాథమిక, హైస్కూల్ విద్యను హైదరాబాద్ లోనే పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా వర్సిటీలో ఎల్ ఎల్ బీ చేసిన రెడ్డి… ఐపీఎస్ కు ఎంపికయ్యారు. నాడు తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో విశాఖ, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఆయన అడిషనల్ ఎస్పీగానూ, అసిస్టెంట్ ఎస్పీగానూ పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణలోనూ పలు జిల్లాల్లో పనిచేసిన రెడ్డి… ఐజీ హోదా దక్కాక నేరుగా ఇంటెలిజెన్స్ విభాగంలోకి చేరిపోయారు. చాలా కాలం పాటు ఆయన నిఘా విభాగంలోనే పనిచేశారు. ఫలితంగా నిఘా విభాగంలో రెడ్డిని మించిన అధికారి లేరంటే అతిశయోక్తి కాదు.
సాధారణంగా బీఆర్ఎస్ హయాంలోనే శివధర్ రెడ్డికి డీజీపీగా అవకాశం రావాల్సి ఉంది. అయితే వేర్వేరు కారణాల వల్ల ప్రతిసారీ ఆ అవకాశాలు మిస్ అవుతూనే వస్తున్నాయి. ఒకానొకసారి ఇక రెడ్డి డిజీపీగా నియమింపబోతున్నారంటూ, ఉత్తర్వులు వెలువడుతున్నాయని కూడా ప్రచారం జరిగింది. అయితే అవేవీ ఫలించలేదు. చివరకు రేవంత్ రెడ్డి సర్కారులో రెడ్డికి న్యాయం జరిగిందని చెప్పక తప్పదు. నిఘా విభాగంలో రాణించినట్లుగా డీజీపీగా రెడ్డి ఎలా నెట్టుకువస్తారన్న దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది.
This post was last modified on September 26, 2025 9:44 pm
థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…
బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…
న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…
ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…