తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నూతన పోలీసు బాసు (డీజీపీ)ని నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డిని ఆ పదవి వరించింది. అక్టోబరు 1న శివధర్ రెడ్డి రాష్ట్ర డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శివధర్ రెడ్డి… చాలా కాలం పాటు ఇంటెలిజెన్స్ విభాగంలోనే పని చేశారు. ప్రస్తుతం కూడా ఆయన ఇంటెలిజెన్స్ శాఖ చీఫ్ గా కొనసాగుతున్నారు. తాజాగా శుక్రవారం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా ఆయన ఇంటెలిజెన్స్ నుంచి నేరుగా డీజీపీగా పదవి చేపట్టనున్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాదు శివారు ప్రాంతం ఇబ్రహీంపట్నం పరిధిలోని పెద్దతుండ్లలో జన్మించిన రెడ్డి… తన ప్రాథమిక, హైస్కూల్ విద్యను హైదరాబాద్ లోనే పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా వర్సిటీలో ఎల్ ఎల్ బీ చేసిన రెడ్డి… ఐపీఎస్ కు ఎంపికయ్యారు. నాడు తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో విశాఖ, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఆయన అడిషనల్ ఎస్పీగానూ, అసిస్టెంట్ ఎస్పీగానూ పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణలోనూ పలు జిల్లాల్లో పనిచేసిన రెడ్డి… ఐజీ హోదా దక్కాక నేరుగా ఇంటెలిజెన్స్ విభాగంలోకి చేరిపోయారు. చాలా కాలం పాటు ఆయన నిఘా విభాగంలోనే పనిచేశారు. ఫలితంగా నిఘా విభాగంలో రెడ్డిని మించిన అధికారి లేరంటే అతిశయోక్తి కాదు.
సాధారణంగా బీఆర్ఎస్ హయాంలోనే శివధర్ రెడ్డికి డీజీపీగా అవకాశం రావాల్సి ఉంది. అయితే వేర్వేరు కారణాల వల్ల ప్రతిసారీ ఆ అవకాశాలు మిస్ అవుతూనే వస్తున్నాయి. ఒకానొకసారి ఇక రెడ్డి డిజీపీగా నియమింపబోతున్నారంటూ, ఉత్తర్వులు వెలువడుతున్నాయని కూడా ప్రచారం జరిగింది. అయితే అవేవీ ఫలించలేదు. చివరకు రేవంత్ రెడ్డి సర్కారులో రెడ్డికి న్యాయం జరిగిందని చెప్పక తప్పదు. నిఘా విభాగంలో రాణించినట్లుగా డీజీపీగా రెడ్డి ఎలా నెట్టుకువస్తారన్న దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది.
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…