తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నూతన పోలీసు బాసు (డీజీపీ)ని నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డిని ఆ పదవి వరించింది. అక్టోబరు 1న శివధర్ రెడ్డి రాష్ట్ర డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శివధర్ రెడ్డి… చాలా కాలం పాటు ఇంటెలిజెన్స్ విభాగంలోనే పని చేశారు. ప్రస్తుతం కూడా ఆయన ఇంటెలిజెన్స్ శాఖ చీఫ్ గా కొనసాగుతున్నారు. తాజాగా శుక్రవారం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా ఆయన ఇంటెలిజెన్స్ నుంచి నేరుగా డీజీపీగా పదవి చేపట్టనున్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాదు శివారు ప్రాంతం ఇబ్రహీంపట్నం పరిధిలోని పెద్దతుండ్లలో జన్మించిన రెడ్డి… తన ప్రాథమిక, హైస్కూల్ విద్యను హైదరాబాద్ లోనే పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా వర్సిటీలో ఎల్ ఎల్ బీ చేసిన రెడ్డి… ఐపీఎస్ కు ఎంపికయ్యారు. నాడు తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో విశాఖ, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఆయన అడిషనల్ ఎస్పీగానూ, అసిస్టెంట్ ఎస్పీగానూ పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణలోనూ పలు జిల్లాల్లో పనిచేసిన రెడ్డి… ఐజీ హోదా దక్కాక నేరుగా ఇంటెలిజెన్స్ విభాగంలోకి చేరిపోయారు. చాలా కాలం పాటు ఆయన నిఘా విభాగంలోనే పనిచేశారు. ఫలితంగా నిఘా విభాగంలో రెడ్డిని మించిన అధికారి లేరంటే అతిశయోక్తి కాదు.
సాధారణంగా బీఆర్ఎస్ హయాంలోనే శివధర్ రెడ్డికి డీజీపీగా అవకాశం రావాల్సి ఉంది. అయితే వేర్వేరు కారణాల వల్ల ప్రతిసారీ ఆ అవకాశాలు మిస్ అవుతూనే వస్తున్నాయి. ఒకానొకసారి ఇక రెడ్డి డిజీపీగా నియమింపబోతున్నారంటూ, ఉత్తర్వులు వెలువడుతున్నాయని కూడా ప్రచారం జరిగింది. అయితే అవేవీ ఫలించలేదు. చివరకు రేవంత్ రెడ్డి సర్కారులో రెడ్డికి న్యాయం జరిగిందని చెప్పక తప్పదు. నిఘా విభాగంలో రాణించినట్లుగా డీజీపీగా రెడ్డి ఎలా నెట్టుకువస్తారన్న దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది.
This post was last modified on September 26, 2025 9:44 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…