Political News

‘వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే నా ఫ్రెండ్ ప్రాణాలు తీశారు’

ఏసీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తే సింపుల్‌గా ఒక్క విషయం అర్థమవుతుంది. ప్రతి సందర్భంలోనూ గత ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలోని వైఫల్యాలను హైలైట్ చేయటంతో పాటు జగన్ పాలన జరిగిన ఐదేళ్లలో చోటుచేసుకున్న పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు. తాజాగా అలాంటి గతాన్ని సభ ముందుకు తీసుకొచ్చారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.

గత ప్రభుత్వంలో వేధింపులు ఎంత తీవ్రంగా ఉంటాయన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసిన ఆయన, చిన్న విషయాలను సైతం సీరియస్‌గా తీసుకుని కఠిన చర్యలు చేపట్టేవారని వివరించారు. తన స్నేహితుడు ఒకరు వాట్సాప్‌లో తనకు వచ్చిన మెసేజ్‌ను ఫార్వర్డ్ చేసినందుకు ఆయన ప్రాణాలు పోయేలా చేశారని భావోద్వేగానికి గురయ్యారు.

అప్పట్లో నిబంధనలను పక్కన పెట్టి వ్యవహరించిన అంశాలను ప్రస్తావించారు. కరోనా కాలంలో అమెరికా నుంచి ఫార్వర్డ్ అయిన వాట్సాప్ మెసేజ్ ఒకటి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడైన తన మిత్రుడు నలంద కిశోర్‌కు వచ్చిందని ఆయన చెప్పారు. ‘‘ఫార్వర్డ్ మెసేజ్ కావడంతో ఇతరులకు ఫార్వర్డ్ చేశారు. అయితే ఆ మెసేజ్ ఉత్తరాంధ్ర వైసీపీ ఇంఛార్జిని అవమానించేలా ఉందని సీఐడీ కేసు నమోదు చేసి నా మిత్రుడిని అదుపులోకి తీసుకున్నారు’’ అని పేర్కొన్నారు.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ‘‘కరోనా తీవ్రతను పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం విజయనగరంలో విచారణ చేయొచ్చు. కానీ అలా చేయకుండా విశాఖలో అరెస్టు చేసి కావాలనే ఇరుకైన కారులో కరోనా నిబంధనలను అతిక్రమించి కర్నూలుకు తరలించారు. దీంతో ఆయన కరోనా బారిన పడి మరణించారు’’ అంటూ తన ఆవేదనను పంచుకున్నారు.

This post was last modified on September 26, 2025 9:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

14 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago