‘బాహుబలి’ ప్రభంజనం తర్వాత ఇండియన్ సినిమాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల జోరు ఎంతగా పెరిగిందో తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్-2లు అనౌన్స్ చేసేస్తున్నారు. కానీ వాటిలో ఎక్కువ శాతం వర్కవుట్ కాలేదు. ప్రేక్షకుల్లో కూడా అన్ని సీక్వెల్స్ మీదా ఆసక్తి కనిపించడం లేదు. కానీ కొన్ని సినిమాలకు సీక్వెల్ అనగానే ఎగ్జైట్మెంట్ కలుగుతుంది. ఇప్పుడు అలాంటి కబురే వినిపించాడు అఖిల్ అక్కినేని.
అతను చిన్న పిల్లాడిగా ఉండగా చేసిన ‘సిసింద్రీ’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఈ చిత్రంతో అఖిల్ ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజల్ని అమితంగా ఆకట్టుకుని చిన్నతనంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించాడు. ఆ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉన్నట్లు అఖిల్ తాజాగా ఒక పాడ్ కాస్ట్లో వెల్లడించడం విశేషం.
తనకు గనుక కొడుకు పుడితే సిసింద్రీ-2 చేయాలని అనుకుంటున్నట్లు అఖిల్ తెలిపాడు. ఈ విషయాన్ని తన భార్య జైనాబ్కు కూడా చెప్పినట్లు అఖిల్ వెల్లడించాడు. తనకు కొడుకు పుడతాడా, కూతురు పుడుతుందా అన్నది దేవుడి చేతుల్లో ఉందని.. ఒకవేళ కొడుకు పుడితే మాత్రం తనను పెట్టి ‘సిసింద్రీ-2’ తీయాలన్నది తన ఆలోచన అని అఖిల్ తెలిపాడు.
తనకు అమ్మాయి పుడితే మాత్రం తండ్రిగా చాలా ప్రొటెక్టివ్గా ఉంటానని అతనన్నాడు. ‘సిసింద్రీ’ హాలీవుడ్ మూవీ ‘బేబీస్ డే ఔట్’ ఆధారంగా తెరకెక్కింది. ‘మనీ’ దర్శకుడు శివ నాగేశ్వరరావు రూపొందించిన ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మించడమే కాక ఇందులో ఒక కీలక పాత్ర చేశాడు.
ఒక పెద్ద కుటుంబానికి చెందిన ఒక చిన్న పిల్లాడిని.. డబ్బుల కోసం తన బాబాయే కిడ్నాప్ చేయిస్తాడు. ఆ కిిడ్నాప్లో భాగమైన ముగ్గురు దొంగల్ని ఆ చిన్నపిల్లాడు ఎలా ముప్పుతిప్పలు పెట్టాడు.. అనూహ్య మలుపుల తర్వాత అతను తిరిగి తన తల్లిదండ్రుల్ని ఎలా చేరుకున్నాడు అన్నది ఈ చిత్ర కథ. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో ఎంతో ముద్దుగా కనిపిస్తూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన అఖిల్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడు. మరి అఖిల్కు కొడుకు పుట్టి అతను నవతరం సిసింద్రీ ప్రేక్షకులను తండ్రిలాగే మెప్పిస్తాడేమో చూడాలి.
This post was last modified on July 25, 2026 2:20 pm
కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…
ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక గూస్ బంప్స్ ఎమోషన్. కమర్షియల్ సినిమాలను తన నేపధ్య…
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాల వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో వారంలో ఏపీకి రానున్నారు. ఆగస్టు 1వ తేదీన ఆయన విజయనగరం జిల్లా భోగాపురానికి…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన అర్థరాత్రి సెల్ఫీ…
తాజాగా విడుదలైన చెన్నై లవ్ స్టోరీకి ఆశించిన ఓపెనింగ్ దక్కింది. టాక్ పరంగా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఒకసారి…