పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఆయుధంతోనే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మిన సాయుధ పోరు చరమాంకానికి చేరుకుంటోంది. అన్నలకు తొలిసారి వెన్నులో వణుకు పుట్టించేలా కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్ కగార్”ను ఈ నెల 25 నుంచి మరింత విస్తరించనుంది. మరింత పటిష్టం చేయనుంది. మరింత వేగంగా కూడా చేపట్టనుంది.
అంతేకాదు, మావోయిస్టులు గతానికి భిన్నంగా చర్చలకు వస్తామని చెబుతున్నా కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. “మాటల్లేవ్… తూటాలే!” అంటూ తేల్చి చెబుతోంది.
దీంతో మావోయిస్టు ఉద్యమం “మణుటయా… మరణించుటయా!” అన్నట్టుగా మారిపోయింది. కనిపించని ప్రాంతాలు అంటూ ఒకప్పుడు ఉండేవి. శత్రు దర్బేద్యంగా కూడా ఉండేవి. దీంతో గత ఆరు దశాబ్దాలుగా మావోయిస్టులు తమ కార్యక్రమాలను కొనసాగించారు. ఒక రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితి ఏర్పడితే మరో రాష్ట్రానికి పారిపోయి తలదాచుకున్నారు.
అయితే ఇప్పుడు పరిస్థితి అలాకాదు. శాటిలైట్ వ్యవస్థ సహా అధునాతన డ్రోన్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. చిమ్మ చీకటిలోనూ మావోయిస్టుల కదలికలను పసిగట్టగల ఎనిమీ డ్రోన్లు రంగంలోకి వచ్చాయి.
ఇప్పటికే డ్రోన్లు జల్లెడ పడుతున్నాయి. దట్టమైన అడవుల్లోనూ, కొండ ప్రాంతాల్లోనూ, లోయలు, సొరంగాల్లోనూ డ్రోన్లు వెదజల్లుతున్నాయి. అన్నల ప్రాణాలను తీస్తున్నాయి. ఇక నుంచి అంటే ఈ నెల 25 నుంచి ఎనిమీ డ్రోన్లను కూబింగ్కు వినియోగించేలా కేంద్రం అనుమతి ఇచ్చింది.
వాస్తవానికి ఎనిమీ డ్రోన్ వ్యవస్థను కేవలం శత్రుదేశాలపై మాత్రమే వినియోగిస్తారు. సరిహద్దుల్లో భద్రత పర్యవేక్షణకు వాడతారు. కానీ తొలిసారి మావోయిస్టుల ఏరివేతకు వాడేలా అనుమతి ఇచ్చారు. ఫలితంగా మావోయిస్టులు ఎక్కడ తలదాచుకున్నా దొరికిపోవడం ఖాయం.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఎట్టి పరిస్థితిలోనూ మావోయిస్టులను ఏరేస్తామని చెబుతోంది. దేశంలోని 28 రాష్ట్రాల్లో 11 రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం ఉంది. వీటిలో 8 రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా ఉంది. వీటిలో 4 రాష్ట్రాల్లో అత్యంత తీవ్రంగా ఉంది.
ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లోనే కూబింగ్ ఎక్కువగా జరుగుతోంది. వీటిలో జార్ఖండ్, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, తెలంగాణ ఉన్నాయి.
ఈ క్రమంలో చర్చలకు అన్నలు రెడీగా ఉన్నా కేంద్రం మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోంది. “లొంగిపోవడమా లేక తుపాకీ తూటాలకు బలికావడమా?” అనే ఏకైక ఆప్షన్ మాత్రమే ఇచ్చింది.
అందువల్ల మావోయిస్టులు లొంగిపోతారా? లేక తుపాకీలకు బలవుతారా? అనేది చూడాలి. ఇప్పటికే మెజారిటీ నాయకత్వం బలమైన
This post was last modified on September 24, 2025 1:31 pm
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…
స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మారడం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావడం అరుదు. ఐతే సినీ…
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…