Political News

‘మీరు ఆమోదించ‌కపోతే.. ఢిల్లీ నుంచి ఫోన్ వ‌స్తుంది’

ఏపీ శాస‌న మండ‌లిలో మంగ‌ళ‌వారం ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. జీఎస్టీ 2.0 సంస్క‌ర‌ణ‌ల‌కు ఏపీ అసెంబ్లీ ఇటీవ‌ల ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. దీనిపై తీర్మానం కూడా చేశారు. తాజాగా దీనిని మండ‌లిలో మంగ‌ళ‌వారం ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్భంగా అధికార పార్టీ స‌భ్యులు ఏక‌గ్రీవంగా ఆమోదించారు. అయితే దీనిపై వైసీపీ స‌భ్యులు మాట్లాడే స‌మయంలో వారు తీర్మానాన్ని ఆమోదిస్తున్నారో లేదో చెప్పాల‌ని ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌శ్నించారు.

ఈ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న వైసీపీ మండ‌లి ప‌క్ష నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ సూటిగా స‌మాధానం చెప్ప‌కుండా జీఎస్టీ దేశ‌మంతా అమ‌ల‌వుతోంద‌ని, ఒక్క ఏపీలోనే కాద‌ని అన్నారు. కానీ ఎక్క‌డా లేని విధంగా ఇక్కడే దీనిపై తీర్మానం చేశార‌ని వ్యాఖ్యానించారు. ఈ స‌మ‌యంలోనూ ప‌య్యావుల బొత్స‌ను మ‌రోసారి మీరు ఈ తీర్మానాన్ని సూటిగా ఆమోదిస్తున్నారా అని ప్ర‌శ్నించారు. అప్పుడు కూడా బొత్స స‌మాధానం దాట వేసి త‌న‌దైన ధోర‌ణిలోనే ప్ర‌సంగం కొన‌సాగించారు.

మ‌రోసారి జోక్యం చేసుకున్న ప‌య్యావుల‌ మాట్లాడుతూ.. మీరు ఈ తీర్మానాన్ని (జీఎస్టీ) ఆమోదిస్తారు. ఎందుకంటే మీరు దీనిని ఆమోదించ‌కపోతే మీకు, మీ నాయ‌కుడికి ఎక్క‌డ నుంచి (ఢిల్లీ పెద్ద‌ల‌) ఫోన్ వ‌స్తుందో నాకు తెలుసు. ఇక్కడ తీర్మానంపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే మీ నాయ‌కుడు జీఎస్టీని ఆకాశానికి ఎత్తేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనంత‌రం దీనిని స‌భ ఆమోదించిన‌ట్టుగా చైర్మ‌న్ మోషేన్ రాజు ప్ర‌క‌టించారు.

అయితే ఈ స‌మ‌యంలోనూ ప‌య్యావుల కేశ‌వ్ ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. వైసీపీ స‌భ్యులు త‌మ అభిప్రాయాన్ని సంపూర్ణంగా చెప్ప‌కుండానే తీర్మానం ఆమోదం పొందింద‌ని ఎలా ప్ర‌క‌టిస్తార‌ని చైర్మ‌న్‌ను నిల‌దీశారు. మీరు వైసీపీ స‌భ్యుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. అయితే చైర్మ‌న్ మాత్రం మౌనంగా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి స‌భ‌కు లంచ్ బ్రేక్ ప్ర‌క‌టించారు.

This post was last modified on September 24, 2025 7:36 am

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

3 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

5 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

5 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

6 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

7 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

7 hours ago