ఏపీ శాసన మండలిలో మంగళవారం ఆసక్తికర సంభాషణ, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. జీఎస్టీ 2.0 సంస్కరణలకు ఏపీ అసెంబ్లీ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై తీర్మానం కూడా చేశారు. తాజాగా దీనిని మండలిలో మంగళవారం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా అధికార పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే దీనిపై వైసీపీ సభ్యులు మాట్లాడే సమయంలో వారు తీర్మానాన్ని ఆమోదిస్తున్నారో లేదో చెప్పాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
ఈ సమయంలో జోక్యం చేసుకున్న వైసీపీ మండలి పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ సూటిగా సమాధానం చెప్పకుండా జీఎస్టీ దేశమంతా అమలవుతోందని, ఒక్క ఏపీలోనే కాదని అన్నారు. కానీ ఎక్కడా లేని విధంగా ఇక్కడే దీనిపై తీర్మానం చేశారని వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనూ పయ్యావుల బొత్సను మరోసారి మీరు ఈ తీర్మానాన్ని సూటిగా ఆమోదిస్తున్నారా అని ప్రశ్నించారు. అప్పుడు కూడా బొత్స సమాధానం దాట వేసి తనదైన ధోరణిలోనే ప్రసంగం కొనసాగించారు.
మరోసారి జోక్యం చేసుకున్న పయ్యావుల మాట్లాడుతూ.. మీరు ఈ తీర్మానాన్ని (జీఎస్టీ) ఆమోదిస్తారు. ఎందుకంటే మీరు దీనిని ఆమోదించకపోతే మీకు, మీ నాయకుడికి ఎక్కడ నుంచి (ఢిల్లీ పెద్దల) ఫోన్ వస్తుందో నాకు తెలుసు. ఇక్కడ తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలోనే మీ నాయకుడు జీఎస్టీని ఆకాశానికి ఎత్తేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనంతరం దీనిని సభ ఆమోదించినట్టుగా చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
అయితే ఈ సమయంలోనూ పయ్యావుల కేశవ్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు తమ అభిప్రాయాన్ని సంపూర్ణంగా చెప్పకుండానే తీర్మానం ఆమోదం పొందిందని ఎలా ప్రకటిస్తారని చైర్మన్ను నిలదీశారు. మీరు వైసీపీ సభ్యులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే చైర్మన్ మాత్రం మౌనంగా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు ప్రకటించి సభకు లంచ్ బ్రేక్ ప్రకటించారు.
This post was last modified on September 24, 2025 7:36 am
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…