ఏపీ శాసన మండలిలో మంగళవారం ఆసక్తికర సంభాషణ, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. జీఎస్టీ 2.0 సంస్కరణలకు ఏపీ అసెంబ్లీ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై తీర్మానం కూడా చేశారు. తాజాగా దీనిని మండలిలో మంగళవారం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా అధికార పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే దీనిపై వైసీపీ సభ్యులు మాట్లాడే సమయంలో వారు తీర్మానాన్ని ఆమోదిస్తున్నారో లేదో చెప్పాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
ఈ సమయంలో జోక్యం చేసుకున్న వైసీపీ మండలి పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ సూటిగా సమాధానం చెప్పకుండా జీఎస్టీ దేశమంతా అమలవుతోందని, ఒక్క ఏపీలోనే కాదని అన్నారు. కానీ ఎక్కడా లేని విధంగా ఇక్కడే దీనిపై తీర్మానం చేశారని వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనూ పయ్యావుల బొత్సను మరోసారి మీరు ఈ తీర్మానాన్ని సూటిగా ఆమోదిస్తున్నారా అని ప్రశ్నించారు. అప్పుడు కూడా బొత్స సమాధానం దాట వేసి తనదైన ధోరణిలోనే ప్రసంగం కొనసాగించారు.
మరోసారి జోక్యం చేసుకున్న పయ్యావుల మాట్లాడుతూ.. మీరు ఈ తీర్మానాన్ని (జీఎస్టీ) ఆమోదిస్తారు. ఎందుకంటే మీరు దీనిని ఆమోదించకపోతే మీకు, మీ నాయకుడికి ఎక్కడ నుంచి (ఢిల్లీ పెద్దల) ఫోన్ వస్తుందో నాకు తెలుసు. ఇక్కడ తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలోనే మీ నాయకుడు జీఎస్టీని ఆకాశానికి ఎత్తేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనంతరం దీనిని సభ ఆమోదించినట్టుగా చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
అయితే ఈ సమయంలోనూ పయ్యావుల కేశవ్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు తమ అభిప్రాయాన్ని సంపూర్ణంగా చెప్పకుండానే తీర్మానం ఆమోదం పొందిందని ఎలా ప్రకటిస్తారని చైర్మన్ను నిలదీశారు. మీరు వైసీపీ సభ్యులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే చైర్మన్ మాత్రం మౌనంగా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు ప్రకటించి సభకు లంచ్ బ్రేక్ ప్రకటించారు.
This post was last modified on September 24, 2025 7:36 am
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…