Political News

బ‌తికి ఉన్న‌వారిని చూడండి.. చ‌నిపోయిన వారి విగ్ర‌హాలు త‌ర్వాత: సుప్రీం

బ‌హిరంగ ప్ర‌దేశాల్లో నేత‌ల విగ్ర‌హాలు ఏర్పాటు చేయ‌డం అనేది కామ‌నే. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఈ విష‌యంపై ప్ర‌జ‌ల నుంచి ఆగ్ర‌హం వ్య‌క్త‌మవుతోంది. విగ్ర‌హాల‌కు ప్ర‌భుత్వాలు నిధులు మంజూరు చేయ‌డంప‌ట్ల‌.. చాలా మంది అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదేస‌మ‌యంలో పేద‌ల‌కు అన్నం.. అందించ‌డంలో ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని సామాజిక ఉద్య‌మ‌కారులు కూడా ఆక్షేపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

“బ‌తికి ఉన్న‌వారిని ప‌ట్టించుకుని.. ముందు వారి ఆక‌లి తీర్చండి. చ‌నిపోయిన వారికి త‌ర్వాత విగ్ర‌హాలు పెట్ట‌వ‌చ్చు. వారిని సంతృప్తి ప‌ర‌వ‌చ్చు.“ అని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. నేత‌ల‌ను కీర్తించేందుకు.. ఓటు బ్యాంకులు పెంచుకునేందుకు ప్ర‌జాధ‌నాన్ని ఎలా వినియోగిస్తార‌ని కూడా ప్ర‌శ్నించింది. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు ఆలోచ‌న చేయ‌క‌పోతే.. తామే నిర్ణ‌యం వెలువ‌రించాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సంద‌ర్భంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గ‌తంలో ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన మాయావ‌తి ఏనుగు విగ్ర‌హాల ఏర్పాటును కోర్టు గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం.

విష‌యం ఏంటి?

త‌మిళ‌నాడు అంటేనే నేత‌ల విగ్ర‌హాల‌కు.. ప్ర‌చారానికి ప్ర‌ధాన ప్రాధాన్యం ఇస్తారు. గ‌తంలో అధికారంలో ఉన్న జ‌య‌ల‌లిత‌.. వీధికో విగ్ర‌హం పెట్టే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు హైకోర్టు అడ్డుకుంది. ఆ త‌ర్వాత‌.. వ‌చ్చిన అన్నాడీఎంకే ప్ర‌భుత్వం ప్ర‌ధాన కూడ‌ళ్ల‌పై `అమ్మ‌` విగ్ర‌హాలు ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా డీఎంకే ప్ర‌భుత్వం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ సీఎం క‌రుణానిధి విగ్ర‌హాల‌ను కూడా ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. అయితే.. ఇది కొన్నాళ్లుగా వివాదంగా మారింది.

ముఖ్యంగా తిరునెల్వేలి జిల్లాలోని వల్లియూర్ వెజిటేబుల్ మార్కెట్ ప్రవేశద్వారం వద్ద కరుణానిధి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌య‌త్నించ‌డం.. తీవ్ర విమ‌ర్శ‌ల‌కు, వివాదానికి కూడా దారితీసింది. దీనిపై కొంద‌రు హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో కొన్నాళ్ల కింద‌ట కోర్టు అడ్డుకుంది. విగ్ర‌హాలు ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వాలు జీవోలు జారీ చేయ‌డాన్ని కూడా త‌ప్పుబ‌ట్టింది. దీనిని సీఎం స్టాలిన్ స‌ర్కారు సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. తాజాగా మంగ‌ళ‌వారం ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చిన‌ప్పుడు.. కోర్టు పైవిధంగా వ్యాఖ్య‌లు చేసింది. మ‌ద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌మ‌ర్థించింది. ఏదైనా ఉంటే అక్క‌డే తేల్చుకోవాల‌ని సూచించింది.

This post was last modified on September 23, 2025 3:37 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

7 minutes ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

43 minutes ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

1 hour ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

5 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

6 hours ago