Political News

మండ‌లిలో మంట‌లు: బొత్స వ‌ర్సెస్ లోకేష్!

ఏపీ శాస‌న మండ‌లిలో మాట‌ల మంట‌లు రేగాయి. అధికార‌, విపక్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. వాస్త‌వానికి అసెంబ్లీకి రాక‌పోయినా.. వైసీపీ త‌న బ‌లం ఎక్కువ‌గా ఉన్న మండ‌లికి మాత్రం వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మంగ‌ళ‌వారం మండ‌లిలో విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు.. మంత్రి నారా లోకేష్‌కు మ‌ధ్య మాట‌ల మంట‌లు రేగాయి. ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంటుపై కొన్నాళ్లుగా ప్ర‌శ్న‌లు సంధిస్తున్న వైసీపీ తాజాగా మండ‌లిని దీనికి వేదిక చేసుకుంది.

తొలుత బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు చేయాల్సిన ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వానికి చీమ కుట్టిన‌ట్టు అయినా.. లేద‌ని బొత్స వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు సొమ్ముల‌ను కూడా ఇత‌ర ప‌థ‌కాల‌కు మ‌ళ్లిస్తున్నార‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్‌తో బొత్స వాగ్వాదానికి దిగారు. బడ్జ‌ట్‌లో నిధులు కేటాయించ‌లేద‌న్న బొత్స వ్యాఖ్య‌ల‌ను ప‌య్యావుల ఖండించారు.

అనంత‌రం.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. బొత్స చేసిన విమ‌ర్శ‌లను వెన‌క్కి తీసుకోవాల‌ని, లేదా రికార్డుల నుంచి తొల‌గించాల‌ని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎప్పుడు కావాలంటే అప్పుడు చ‌ర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు. ఏ విష‌యంపైనా చ‌ర్చించేందుకు తాము రెడీ అంటూ.. వైసీపీ స‌భ్యుల‌కు స‌వాల్ రువ్వారు. వైసీపీ హ‌యాంలోనే విద్యార్థుల‌కు స‌రిగా ఫీజు రీయింబ ర్స్‌మెంటు చేయ‌లేద‌ని లోకేష్ వ్యాఖ్యానించారు.

“మీరు త‌ప్పులు చేసి.. మాపై నింద‌లు మోపుతున్నారా?“ అంటూ నారా లోకేష్ ప్ర‌శ్నించారు. వైసీపీ హ‌యాంలో ఎవ‌రెవ‌రికి ఎంత మేర‌కు బ‌కాయి పెట్టారో అంద‌రికీ తెలుసున‌ని..అవ‌స‌రం అయితే గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామ‌ని తెలిపారు. సభలో తాను పరుషంగా మాట్లాడాన‌ని చెబుతున్న బొత్స చెబుతున్నా.. దీనికి ఆధారాల‌ను చూపించాల‌ని అన్నారు. తాను ఎప్పుడూ ఎవ‌రినీ దూషించ‌లేద‌ని నారా లోకేష్ తెలిపారు. బొత్స సీనియ‌ర్ నాయ‌కుడ‌ని, తాను ఎప్పుడూ గౌర‌విస్తాన‌ని మంత్రి చెప్పారు.

Kumar

Recent Posts

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

23 minutes ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

2 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

3 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

3 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

4 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

4 hours ago