Political News

మండ‌లిలో మంట‌లు: బొత్స వ‌ర్సెస్ లోకేష్!

ఏపీ శాస‌న మండ‌లిలో మాట‌ల మంట‌లు రేగాయి. అధికార‌, విపక్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. వాస్త‌వానికి అసెంబ్లీకి రాక‌పోయినా.. వైసీపీ త‌న బ‌లం ఎక్కువ‌గా ఉన్న మండ‌లికి మాత్రం వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మంగ‌ళ‌వారం మండ‌లిలో విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు.. మంత్రి నారా లోకేష్‌కు మ‌ధ్య మాట‌ల మంట‌లు రేగాయి. ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంటుపై కొన్నాళ్లుగా ప్ర‌శ్న‌లు సంధిస్తున్న వైసీపీ తాజాగా మండ‌లిని దీనికి వేదిక చేసుకుంది.

తొలుత బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు చేయాల్సిన ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వానికి చీమ కుట్టిన‌ట్టు అయినా.. లేద‌ని బొత్స వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు సొమ్ముల‌ను కూడా ఇత‌ర ప‌థ‌కాల‌కు మ‌ళ్లిస్తున్నార‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్‌తో బొత్స వాగ్వాదానికి దిగారు. బడ్జ‌ట్‌లో నిధులు కేటాయించ‌లేద‌న్న బొత్స వ్యాఖ్య‌ల‌ను ప‌య్యావుల ఖండించారు.

అనంత‌రం.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. బొత్స చేసిన విమ‌ర్శ‌లను వెన‌క్కి తీసుకోవాల‌ని, లేదా రికార్డుల నుంచి తొల‌గించాల‌ని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎప్పుడు కావాలంటే అప్పుడు చ‌ర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు. ఏ విష‌యంపైనా చ‌ర్చించేందుకు తాము రెడీ అంటూ.. వైసీపీ స‌భ్యుల‌కు స‌వాల్ రువ్వారు. వైసీపీ హ‌యాంలోనే విద్యార్థుల‌కు స‌రిగా ఫీజు రీయింబ ర్స్‌మెంటు చేయ‌లేద‌ని లోకేష్ వ్యాఖ్యానించారు.

“మీరు త‌ప్పులు చేసి.. మాపై నింద‌లు మోపుతున్నారా?“ అంటూ నారా లోకేష్ ప్ర‌శ్నించారు. వైసీపీ హ‌యాంలో ఎవ‌రెవ‌రికి ఎంత మేర‌కు బ‌కాయి పెట్టారో అంద‌రికీ తెలుసున‌ని..అవ‌స‌రం అయితే గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామ‌ని తెలిపారు. సభలో తాను పరుషంగా మాట్లాడాన‌ని చెబుతున్న బొత్స చెబుతున్నా.. దీనికి ఆధారాల‌ను చూపించాల‌ని అన్నారు. తాను ఎప్పుడూ ఎవ‌రినీ దూషించ‌లేద‌ని నారా లోకేష్ తెలిపారు. బొత్స సీనియ‌ర్ నాయ‌కుడ‌ని, తాను ఎప్పుడూ గౌర‌విస్తాన‌ని మంత్రి చెప్పారు.

This post was last modified on September 23, 2025 3:34 pm

Share
Show comments
Published by
Kumar
Tags: BotsaLokesh

Recent Posts

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

2 hours ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

3 hours ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

3 hours ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

4 hours ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

4 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

5 hours ago