ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం చింతలపూడి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో సొంగా రోషన్ కుమార్ టీడీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. కీలకమైన ఈ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా తొలిసారి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేలు చాలా మంది పై వివాదాలు, విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. ఇలానే సొంగా రోషన్ కుమార్పైనా చిన్నపాటి వివాదాలు ఉన్నాయి. కానీ అవేవీ ఆయనను తీవ్రస్థాయిలో కుదపేసేవి కావు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేవి కూడాకాదు.
సో.. తొలిసారి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేలలో రోషన్ కుమార్ ఫర్వాలేదనే పరిస్థితిలోనే వ్యవహరిస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా ఆయన చింతలపూడిలో కొన్నాళ్లుగా ఉన్న కీలక సమస్యను పరిష్కరించారు. దీంతో ఇప్పుడు స్థానికులు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
చింతలపూడిలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. దీనికి గిరిజన హోదా కల్పించాలని ఎప్పటినుంచో ఇక్కడివారు కోరుతున్నారు. ఇదే జరిగితే కేంద్రం నుంచి నేరుగా నిధులు వస్తాయని, ఫలితంగా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
దీనికి సంబంధించి గతంలోనే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎక్కడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా సొంగా రోషన్ కుమార్ ఈ విషయంపై పట్టుబట్టారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు గిరిజన ఆసుపత్రి హోదా వచ్చేలా చేశారు. ఈ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు.
చింతలపూడి వైద్యశాలను గిరిజన వైద్యశాలగా గుర్తిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. తద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతో పాటు వైద్యులు కూడా పెరుగుతారు. దీంతో స్థానికులు ఏ అవసరం వచ్చినా ఇక్కడే వైద్యం చేయించుకునే వెసులుబాటు ఉంటుంది.
ప్రధానంగా చింతలపూడిలో దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొంటున్న రోగులు పొరుగున ఉన్న జిల్లాలకు లేదా ప్రధాన నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వ్యయప్రయాసలతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా చింతలపూడి ఆసుపత్రికే గిరిజన ఆసుపత్రి హోదా దక్కడంతో కేంద్రం నుంచి నిధులు రావడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో కీలక రోగాలకు ఇక్కడే చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని పడకలు కూడా వృద్ధి అవుతాయి.
ఈ వ్యవహారంలో విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేకు స్థానికంగా ప్రశంసలు దక్కుతున్నాయి.
This post was last modified on September 23, 2025 8:16 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…