ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం చింతలపూడి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో సొంగా రోషన్ కుమార్ టీడీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. కీలకమైన ఈ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా తొలిసారి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేలు చాలా మంది పై వివాదాలు, విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. ఇలానే సొంగా రోషన్ కుమార్పైనా చిన్నపాటి వివాదాలు ఉన్నాయి. కానీ అవేవీ ఆయనను తీవ్రస్థాయిలో కుదపేసేవి కావు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేవి కూడాకాదు.
సో.. తొలిసారి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేలలో రోషన్ కుమార్ ఫర్వాలేదనే పరిస్థితిలోనే వ్యవహరిస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా ఆయన చింతలపూడిలో కొన్నాళ్లుగా ఉన్న కీలక సమస్యను పరిష్కరించారు. దీంతో ఇప్పుడు స్థానికులు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
చింతలపూడిలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. దీనికి గిరిజన హోదా కల్పించాలని ఎప్పటినుంచో ఇక్కడివారు కోరుతున్నారు. ఇదే జరిగితే కేంద్రం నుంచి నేరుగా నిధులు వస్తాయని, ఫలితంగా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
దీనికి సంబంధించి గతంలోనే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎక్కడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా సొంగా రోషన్ కుమార్ ఈ విషయంపై పట్టుబట్టారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు గిరిజన ఆసుపత్రి హోదా వచ్చేలా చేశారు. ఈ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు.
చింతలపూడి వైద్యశాలను గిరిజన వైద్యశాలగా గుర్తిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. తద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతో పాటు వైద్యులు కూడా పెరుగుతారు. దీంతో స్థానికులు ఏ అవసరం వచ్చినా ఇక్కడే వైద్యం చేయించుకునే వెసులుబాటు ఉంటుంది.
ప్రధానంగా చింతలపూడిలో దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొంటున్న రోగులు పొరుగున ఉన్న జిల్లాలకు లేదా ప్రధాన నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వ్యయప్రయాసలతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా చింతలపూడి ఆసుపత్రికే గిరిజన ఆసుపత్రి హోదా దక్కడంతో కేంద్రం నుంచి నిధులు రావడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో కీలక రోగాలకు ఇక్కడే చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని పడకలు కూడా వృద్ధి అవుతాయి.
ఈ వ్యవహారంలో విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేకు స్థానికంగా ప్రశంసలు దక్కుతున్నాయి.
This post was last modified on September 23, 2025 8:16 am
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…