Political News

తగ్గేదేలే!… రేవంత్ దీ డబుల్ బొనాంజే!

శరన్నవరాత్రులను పురస్కరించుకుని తొలి రోజు నుంచే సవరించిన నెక్ట్స్ జనరేషన్ జీఎస్టీ 2.0ను ప్రకటించిన మోదీ… ఈ పన్ను విధానం పేదలు, మధ్య తరగతికి డబుల్ బొనాంజేనని ఆయన ఆదివారం ప్రకటించారు. మోదీ కంటే తానేమీ తక్కువ అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా శరన్నవరాత్రుల తొలిరోజు అయిన సోమవారం ఓ రెండు కీలక ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలు చూసిన వారంతా తెలంగాణ ప్రజలకు రేవంత్ డబుల్ బొనాంజా ఇచ్చేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

రేవంత్ ప్రకటించిన ఈ డబుల్ బొనాంజాలో మొదటిది సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటన. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సాధించిన లాభాల్లో ఏకంగా 34 శాతాన్ని బోనస్ గా అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందులో 41 వేల శాశ్వత కార్మికులు ఉండగా, 25 వేలకు పైగా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వీరందరికీ ఈ బోనస్ అందనుంది. పర్మనెంట్ ఎంప్లాయీస్ కు ఒక్కోక్కరికి ఏకంగా రూ.1,95,610 అందనుంది. ఇదిలా ఉంటే… కాంట్రాక్ట్ కార్మికులకు వీరి కంటే తక్కువే బోనస్ వస్తున్నా… దేశ చరిత్రలో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ అందిస్తున్న సంస్థ సింగరేణేనని సీఎం తెలిపారు. దీపావళికి మరోమారు బోనస్ ప్రకటిస్తామని రేవంత్ ప్రకటించారు.

ఇక రేవంత్ సర్కారు నుంచి జారీ అయిన ఓ నోట్ ప్రకారం… విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు కొత్తగా అవసరమయ్యే పోస్టులను కలిపి మొత్తంగా 3 వేల దాకా పోస్టులను భర్తీ చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులోనూ విద్యుత్ సంస్థలకు చెందిన అన్ని పోస్టులను కలిపి ఒకే నోటిఫికేషన్ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారట. ఇది నిరుద్యోగులకే కాకుండా నియామక సంస్థలకు కూడా సులువుగా ఉంటుందన్న భావన అయితే వ్యక్తమవుతోంది. మొత్తంగా మోదీ మాదిరే రేవంత్ కూడా దసరా వేడుకల ప్రారంభం రోజున రాష్ట్ర ప్రజలకు డబుల్ బొనాంజా ప్రకటించారు.

This post was last modified on September 22, 2025 7:46 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago