Political News

‘నిన్నే తెలియదని చెప్పా.. మళ్లీ అడుగుతారెందుకు’

వైసీపీ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని వరుసగా రెండో రోజూ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విజయవాడలో విచారించారు. రాజమండ్రి జైలులో ఉన్న మిథున్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. నిజానికి శుక్రవారం కూడా మిథున్ రెడ్డిని విచారించారు. రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న అధికారులు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన పలు అంశాలపై ఆరాతీశారు. ప్రధానంగా డిస్టిలరీలకు నిధుల టార్గెట్ పెట్టడం, కమిషన్లను రాబట్టుకోవడం, వేర్వేరు బ్యాంకు ఖాతాల ద్వారా నిధులు దారిమళ్లించడం, అదేవిధంగా ఏ-1గా ఉన్న రాజ్‌కసిరెడ్డితో ఉన్న సంబంధం వంటి కీలక విషయాలపై కూపీ లాగే ప్రయత్నం చేశారు.

అయితే శుక్రవారం తొలి రోజు విచారణలో అడిగిన 50 ప్రశ్నలనేమరుసటి రోజు శనివారం కూడా అడిగారు. దీనికితోడు మరో నాలుగు ప్రశ్నలను జోడించారు. అయితే ఆ ప్రశ్నలకు మిథున్ రెడ్డి ఆసక్తికర సమాధానం చెప్పినట్టు తెలిసింది. “నిన్నే తెలియదని చెప్పా.. మళ్లీ అవే అడుగుతారెందుకు సార్. నాకు టైం వేస్టు.. మీకు కూడా టైం వేస్టు” అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. అంతేకాదు ఇది రాజకీయ కుట్ర పూరిత కేసు అని, తాము కడిగిన ముత్యంగా బయటకు వస్తామనే ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే కీలకమైన రూ.5 కోట్ల వ్యవహారంపై రెండో రోజు కూడా తనకు తెలియదనే సమాధానం చెప్పడంతో అధికారులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

దీంతో మిథున్‌రెడ్డి తరఫున విచారణకు వచ్చిన ఆయన లాయర్ సిట్ అధికారులతో వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని, కోర్టు సంయమనంగా ప్రశ్నించాలనే సూచించిందని చెప్పడంతో సిట్ అధికారులు శాంతించారు. ఇక ఆ ఐదు కోట్ల రూపాయలు తమకు చెందిన పిఎల్‌ఆర్ ప్రాజెక్టులోకి వచ్చిన మాట వాస్తవమేనని, అయితే అవి ఎలా వచ్చాయో తెలియదని, వాటిని వెంటనే వెనక్కి కూడా పంపేశామని ఎంపీ మిథున్ రెడ్డి శుక్రవారం చెప్పిన సమాధానాన్నే శనివారం కూడా రిపీట్ చేశారని దర్యాప్తు అధికారి ఒకరు చూచాయగా మీడియాలో వెల్లడించారు. “నిన్న చెప్పిందే చెప్పారు. అంతా సేమ్ టు సేమ్” అని ఆయన వ్యాఖ్యానించారు.

రాజమండ్రికే!

రెండు రోజుల విచారణ పూర్తికావడంతో ఎంపీ మిథున్ రెడ్డిని తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు అధికారులు తరలించారు. ఇదేసమయంలో సోమవారం ఆయనను మరో రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదేసమయంలో మిథున్ రెడ్డి తరఫున న్యాయవాది కూడా తాము కూడా కస్టడీకి వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తామని, అనవసరంగా మిథున్‌రెడ్డిని వేధిస్తున్నారని, లేని కేసును ఉన్నట్టుగా చూపించి వేధిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎంపీకి రాష్ట్ర విధానాలతో సంబంధం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఇది కచ్చితంగా కుట్ర పూరిత కేసుగానే చూస్తున్నామని తెలిపారు.

This post was last modified on September 20, 2025 10:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

5 minutes ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

41 minutes ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

1 hour ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

5 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

6 hours ago