Political News

‘రాజ‌కీయాల్లో తొక్కుకుంటూ ఎద‌గాల్సిందే’

బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల్లో ఎద‌గాలంటే ఎవ‌రిపైనో ఆధారపడాల్సిన అవసరం లేదని, ఆధారపడినా ఎవ‌రూ ప్రోత్సాహం ఇవ్వరని చెప్పారు. రాజ‌కీయాల్లో పైకి రావాలంటే పరిస్థితులను తట్టుకుని కాదు, వాటిని తోసుకుంటూ, అవరోధాలను తొక్కకుంటూ పైకి రావాలన్నారు.

అయితే, ఆమె ఎవ‌రిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేశారన్న విష‌యంపై క్లారిటీ లేదు. కానీ బీఆర్‌ఎస్‌తో ఉన్న విభేదాల నేప‌థ్యంలోనే ఈ వ్యాఖ్య‌లు వచ్చినట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది.

తాజాగా హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన క‌విత, సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్య‌లపై కూడా స్పందించారు. ఇంటి ఆడ‌బిడ్డ‌పై నలుగురు కలిసి దాడి చేశారు. క‌వితది కుటుంబ, ఆస్తి వివాదమే, కానీ.. రాజ‌కీయాల గురిం చి కాదు అని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఈ వ్యాఖ్య‌లపై నేరుగా స్పందించిన క‌విత, తన గురించి తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారో ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హైప్రొఫైల్ నాయ‌కుడు అని, ఆయన మాట్లాడేముందు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. త‌ప్పు, దాడి ఏమీ చేయలేదని స్ప‌ష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విష‌యంలో మాత్రమే స్పందించానని ఆమె చెప్పారు. ఇంతకుమించి ఏమీ అనలేదని చెప్పారు. హరిష్‌రావు పట్ల గౌర‌వం ఉందని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ తప్పు చేశారని చెప్పినప్పుడు బాధ కలిగిందని అన్నారు. దీనిని రాజ‌కీయం చేయడం సరికాదని స్ప‌ష్టం చేశారు.

కాళేశ్వరం మరియు ఇతర ప్రాజెక్టులపై దిగువ స్థాయి అధికారులు ఫైల్స్‌ను పరిశీలించకుండానే నేరుగా అప్పటి ముఖ్యమంత్రికి పంపించారని తెలిపారు. ఈ విష‌యాన్ని అప్పట్లోనే విభేదించానని, అప్పటి మంత్రి కేటీఆర్‌కు కూడా చెప్పానని చెప్పారు.

మ‌హారాష్ట్ర ప్రభుత్వం ఆల్ మట్టి రిజర్వాయర్ ఎత్తును పెంచుతోందని క‌విత తెలిపారు. దీనిని అడ్డుకోవాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. నిజానికి ఆల్ మట్టి ఎత్తు పెంపుపై కోర్టు ఆదేశాలు, స్టే ఉన్నాయి. అయినప్పటికీ మ‌హారాష్ట్ర ప్రభుత్వం సైలెంట్‌గా ఎత్తు పెంచుతోందని అన్నారు. దీనిని అడ్డుకోకపోతే, జాగృతి తరపున తామే తెలంగాణ ప్రజల కోసం కృషి చేస్తామన్నారు.

తీన్మార్ మల్లన్న ఏర్పాటు చేసిన కొత్త పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్రంలో ఎంత మంది అయినా పార్టీలు పెట్టుకోవచ్చని, ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిదని, ప్రజల సమస్యలపై స్పందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఆమె తాము ఏం చేస్తారన్న విషయంలో స్పందించలేదు.

మరోవైపు, ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, అయినా ఆమోదించబడలేదని చెప్పారు.

Satya

Recent Posts

ఏజెంట్ నిర్మాతతో ఏకీభ‌వించిన అఖిల్

అక్కినేని అఖిల్‌ను పెద్ద‌ స్టార్‌ను చేసేస్తుంద‌ని అభిమానులు ఆశించిన సినిమా.. ఏజెంట్. నిర్మాత అనిల్ సుంక‌ర సైతం రిలీజ్‌కు ముందు…

1 hour ago

తమన్ సంగీతానికి తమనే పోటీ

తమన్ మ్యూజిక్కుకి తమనే కాంపిటీషన్ కావడం ఏమిటనుకుంటున్నారా. ఇది గతంలో జరిగిందే అయినా ఈసారి మాత్రం కొంచెం స్పెషల్ గా…

3 hours ago

బాబాయ్ సెంటిమెంట్ అబ్బాయికి కలిసి వస్తుందా

ముందు లీకైనట్టే ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం వాయిదా పడింది. జూలై 30 విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు…

5 hours ago

టాలెంట్ వేట ఇలా కూడా చేయొచ్చు

టాలెంట్ ఉండి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలంటే ఎవరో ఒకరి దగ్గర శిష్యుడిగా చేరాలి. లేదా ఎవరైనా రిఫరెన్స్ తీసుకుని ప్రముఖ…

6 hours ago

లోకేష్‌నే వైసీపీ టార్గెట్ చేసిందా?

ఏపీలో విపక్షం వైసీపీ ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రదాన…

6 hours ago

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఏంటి పరిస్థితి

టాలీవుడ్ లో జూన్ నెలలో పెద్ది, మా ఇంటి బంగారం తమ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చాయి. తెలుగు రాష్ట్రాల…

6 hours ago