Political News

‘రాజ‌కీయాల్లో తొక్కుకుంటూ ఎద‌గాల్సిందే’

బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల్లో ఎద‌గాలంటే ఎవ‌రిపైనో ఆధారపడాల్సిన అవసరం లేదని, ఆధారపడినా ఎవ‌రూ ప్రోత్సాహం ఇవ్వరని చెప్పారు. రాజ‌కీయాల్లో పైకి రావాలంటే పరిస్థితులను తట్టుకుని కాదు, వాటిని తోసుకుంటూ, అవరోధాలను తొక్కకుంటూ పైకి రావాలన్నారు.

అయితే, ఆమె ఎవ‌రిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేశారన్న విష‌యంపై క్లారిటీ లేదు. కానీ బీఆర్‌ఎస్‌తో ఉన్న విభేదాల నేప‌థ్యంలోనే ఈ వ్యాఖ్య‌లు వచ్చినట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది.

తాజాగా హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన క‌విత, సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్య‌లపై కూడా స్పందించారు. ఇంటి ఆడ‌బిడ్డ‌పై నలుగురు కలిసి దాడి చేశారు. క‌వితది కుటుంబ, ఆస్తి వివాదమే, కానీ.. రాజ‌కీయాల గురిం చి కాదు అని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఈ వ్యాఖ్య‌లపై నేరుగా స్పందించిన క‌విత, తన గురించి తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారో ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హైప్రొఫైల్ నాయ‌కుడు అని, ఆయన మాట్లాడేముందు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. త‌ప్పు, దాడి ఏమీ చేయలేదని స్ప‌ష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విష‌యంలో మాత్రమే స్పందించానని ఆమె చెప్పారు. ఇంతకుమించి ఏమీ అనలేదని చెప్పారు. హరిష్‌రావు పట్ల గౌర‌వం ఉందని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ తప్పు చేశారని చెప్పినప్పుడు బాధ కలిగిందని అన్నారు. దీనిని రాజ‌కీయం చేయడం సరికాదని స్ప‌ష్టం చేశారు.

కాళేశ్వరం మరియు ఇతర ప్రాజెక్టులపై దిగువ స్థాయి అధికారులు ఫైల్స్‌ను పరిశీలించకుండానే నేరుగా అప్పటి ముఖ్యమంత్రికి పంపించారని తెలిపారు. ఈ విష‌యాన్ని అప్పట్లోనే విభేదించానని, అప్పటి మంత్రి కేటీఆర్‌కు కూడా చెప్పానని చెప్పారు.

మ‌హారాష్ట్ర ప్రభుత్వం ఆల్ మట్టి రిజర్వాయర్ ఎత్తును పెంచుతోందని క‌విత తెలిపారు. దీనిని అడ్డుకోవాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. నిజానికి ఆల్ మట్టి ఎత్తు పెంపుపై కోర్టు ఆదేశాలు, స్టే ఉన్నాయి. అయినప్పటికీ మ‌హారాష్ట్ర ప్రభుత్వం సైలెంట్‌గా ఎత్తు పెంచుతోందని అన్నారు. దీనిని అడ్డుకోకపోతే, జాగృతి తరపున తామే తెలంగాణ ప్రజల కోసం కృషి చేస్తామన్నారు.

తీన్మార్ మల్లన్న ఏర్పాటు చేసిన కొత్త పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్రంలో ఎంత మంది అయినా పార్టీలు పెట్టుకోవచ్చని, ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిదని, ప్రజల సమస్యలపై స్పందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఆమె తాము ఏం చేస్తారన్న విషయంలో స్పందించలేదు.

మరోవైపు, ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, అయినా ఆమోదించబడలేదని చెప్పారు.

Satya

Recent Posts

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

18 minutes ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

3 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

3 hours ago

‘అన్న లేని లోటును నా పవనన్న తీర్చాడు’

తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…

3 hours ago

బౌల‌ర్స్ మారినా.. బ్యాట్స్‌మెన్ ఓన్లీ సీబీఎన్‌: లోకేష్‌!

రాష్ట్రంలో బౌల‌ర్స్‌(ప్ర‌త్య‌ర్థులు) మారినా బ్యాట్స్‌మెన్ మాత్రం చంద్ర‌బాబు నాయుడేన‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుప‌తిలో జ‌రిగిన ప్ర‌భుత్వ వియోజ‌త్స‌వ…

3 hours ago