Political News

‘రాజ‌కీయాల్లో తొక్కుకుంటూ ఎద‌గాల్సిందే’

బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల్లో ఎద‌గాలంటే ఎవ‌రిపైనో ఆధారపడాల్సిన అవసరం లేదని, ఆధారపడినా ఎవ‌రూ ప్రోత్సాహం ఇవ్వరని చెప్పారు. రాజ‌కీయాల్లో పైకి రావాలంటే పరిస్థితులను తట్టుకుని కాదు, వాటిని తోసుకుంటూ, అవరోధాలను తొక్కకుంటూ పైకి రావాలన్నారు.

అయితే, ఆమె ఎవ‌రిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేశారన్న విష‌యంపై క్లారిటీ లేదు. కానీ బీఆర్‌ఎస్‌తో ఉన్న విభేదాల నేప‌థ్యంలోనే ఈ వ్యాఖ్య‌లు వచ్చినట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది.

తాజాగా హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన క‌విత, సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్య‌లపై కూడా స్పందించారు. ఇంటి ఆడ‌బిడ్డ‌పై నలుగురు కలిసి దాడి చేశారు. క‌వితది కుటుంబ, ఆస్తి వివాదమే, కానీ.. రాజ‌కీయాల గురిం చి కాదు అని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఈ వ్యాఖ్య‌లపై నేరుగా స్పందించిన క‌విత, తన గురించి తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారో ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హైప్రొఫైల్ నాయ‌కుడు అని, ఆయన మాట్లాడేముందు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. త‌ప్పు, దాడి ఏమీ చేయలేదని స్ప‌ష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విష‌యంలో మాత్రమే స్పందించానని ఆమె చెప్పారు. ఇంతకుమించి ఏమీ అనలేదని చెప్పారు. హరిష్‌రావు పట్ల గౌర‌వం ఉందని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ తప్పు చేశారని చెప్పినప్పుడు బాధ కలిగిందని అన్నారు. దీనిని రాజ‌కీయం చేయడం సరికాదని స్ప‌ష్టం చేశారు.

కాళేశ్వరం మరియు ఇతర ప్రాజెక్టులపై దిగువ స్థాయి అధికారులు ఫైల్స్‌ను పరిశీలించకుండానే నేరుగా అప్పటి ముఖ్యమంత్రికి పంపించారని తెలిపారు. ఈ విష‌యాన్ని అప్పట్లోనే విభేదించానని, అప్పటి మంత్రి కేటీఆర్‌కు కూడా చెప్పానని చెప్పారు.

మ‌హారాష్ట్ర ప్రభుత్వం ఆల్ మట్టి రిజర్వాయర్ ఎత్తును పెంచుతోందని క‌విత తెలిపారు. దీనిని అడ్డుకోవాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. నిజానికి ఆల్ మట్టి ఎత్తు పెంపుపై కోర్టు ఆదేశాలు, స్టే ఉన్నాయి. అయినప్పటికీ మ‌హారాష్ట్ర ప్రభుత్వం సైలెంట్‌గా ఎత్తు పెంచుతోందని అన్నారు. దీనిని అడ్డుకోకపోతే, జాగృతి తరపున తామే తెలంగాణ ప్రజల కోసం కృషి చేస్తామన్నారు.

తీన్మార్ మల్లన్న ఏర్పాటు చేసిన కొత్త పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్రంలో ఎంత మంది అయినా పార్టీలు పెట్టుకోవచ్చని, ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిదని, ప్రజల సమస్యలపై స్పందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఆమె తాము ఏం చేస్తారన్న విషయంలో స్పందించలేదు.

మరోవైపు, ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, అయినా ఆమోదించబడలేదని చెప్పారు.

This post was last modified on September 20, 2025 2:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మృణాల్ పాటించాల్సిన సలహానే ఇది

సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…

2 hours ago

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

3 hours ago

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

5 hours ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

6 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

7 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

8 hours ago