Political News

అయ్య‌న్న‌కు కోప‌మొచ్చిన వేళ‌.. ఏపీ అసెంబ్లీలో చిత్రం!

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి మరోసారి కోపం వచ్చింది. గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలి ప్రాధాన్య అంశంగా ప్రశ్నోత్తరాలు సమయానికి సమయం కేటాయిస్తారు. ఇది నిబంధనల ప్రకారం జరిగే కార్యక్రమం. ఈ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సభ్యులు ఏ ప్రశ్నలు అడిగారు.. మంత్రులు ఎలాంటి సమాధానం చెప్పారు.. అనే విషయాలను అసెంబ్లీ అధికారులు నమోదు చేసుకోవాలి. వాటిని రికార్డు చేయాలి.

ఎప్పుడు అవసరమైతే అప్పుడు అందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ విషయంలో అసెంబ్లీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో మంత్రులు కూడా సభ్యులు అడుగుతున్న ప్రశ్నల పై కాకుండా వేరే అంశాలపై తమ పక్కన కూర్చున్న సభ్యులతో చర్చించడం పట్ల కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ఇట్లాంటివి జరుగుతుండటం దురదృష్టకరమ‌ని, ఇకనుంచి ఇలాంటివి ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదన్నారు. అవసరమైతే సస్పెండ్ చేస్తానని అధికారులను హెచ్చరించారు.

మంత్రులకు కూడా సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. మంత్రులుగా ఉన్నవారు బాధ్యతగా ఉండాలని సభ్యులు అడుగుతున్న ప్రశ్నల పట్ల అవగాహన లేకపోతే సమాధానం ఏం చెబుతారని ఆయన విమర్శించారు. అదే సమయంలో మంత్రులు సదరు ప్రశ్నలకు సమాధానం చెప్పి ఊరుకోడమే కాదని, తర్వాత జరుగుతున్న అంశాలను మరుసటి రోజు సభలో చెప్పాలని కూడా ఆయన సూచించడం విశేషం. ఇక గత సభలో కూడా అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేల వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొందరు ఎమ్మెల్యేలు సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారని కనీసం వారు సమాచారం కూడా సభకు ఇవ్వడం లేదని అయ్య‌న్న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సభలో మొహం కూడా చూపించకుండా వెళ్ళిపోతుండడం ఏంటని గత సభలో ఆయన ప్రశ్నించారు. ఇట్లాంటి వాటిని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదన్నారు. చిత్రం ఏంటంటే ఇలా సభకు రాకుండా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలలో కేవలం వైసీపీ మాత్రమే కాదు టిడిపి, బిజెపి సభ్యులు కూడా ఉన్నారని అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ చెప్పడం విశేషం.

ఇప్పుడు మరోసారి అధికారులు మంత్రులవైఖరిపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు రాకుండా అటు సభ్యులు ఇటు మంత్రులు అధికారులు కూడా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. సభను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న ప్రజలు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను సీరియస్గా భావించడంతోపాటు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారంలోకి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

Satya

Recent Posts

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

2 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

2 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

3 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

3 hours ago

పాజిటివ్ టాక్ ఉన్నా పనవ్వడం లేదా

బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…

3 hours ago

బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

3 hours ago