Political News

జీఎస్టీ రిఫార్మ్‌… ఏపీకీ గేమ్ ఛేంజ‌ర్‌: సీఎం చంద్ర‌బాబు

జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు రాష్ట్రానికి గేమ్ ఛేంజ్‌గా మార‌నున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అసెంబ్లీలో సుదీర్ఘ ఉపన్యాసం చేసిన ఆయ‌న‌.. జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల‌పై మాట్లాడారు. ప‌న్నుల త‌గ్గింపుతో పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని తెలిపారు. గ‌తంలో ప‌న్నుల‌ను స‌ర‌ళీక‌రించ‌డం ద్వారా ప్ర‌స్తుతం 2 ర‌కాల శ్లాబుల‌కు మాత్రమే ప‌రిమితం చేశార‌న్నారు. తద్వారా కొనుగోలు శ‌క్తి పెరుగుతుంద‌న్నారు. ధ‌ర‌లు త‌గ్గ‌డంతో ఆయా వ‌స్తువుల కొను గోలు పెరిగి.. అదేస‌మ‌యంలో రాష్ట్రానికి కూడా ఆదాయం చేకూరుతుంద‌ని సీఎం వివ‌రించారు.

రాష్ట్రానికి సంప‌ద పెంచేందుకు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. సంప‌ద సృష్టి జ‌రిగితేనే సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌గ‌ల‌మ‌ని తెలిపారు. “సంప‌ద సృష్టి చేయ‌ని వాళ్ల‌కు సంక్షేమం ఇచ్చే అర్హత లేదు“ అంటూ.. ప‌రోక్షంగా వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. సంప‌ద సృష్టించేందుకు అన్ని విధాలా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలిపారు. తాను సంస్క‌ర‌ణ‌ల‌ను అందిపుచ్చుకుంటానని తెలిపారు. ఈ విష‌యంలో చాలా ముందుంటాన‌ని కూడా సీఎం చంద్ర‌బాబు చెప్పారు. జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల‌ను స్వాగ‌తిస్తున్న‌ట్టు తెలిపారు.

రాష్ట్రంలో అభివృద్ధి జ‌రిగితే సంప‌ద వ‌స్తుంద‌న్న ఆయ‌న‌.. దానిని పేద‌ల‌కు సంక్షేమం రూపంలో తిరిగి పంచుతా మ‌న్నారు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం సరికాదన్నారు. రాష్ట్రం అనేక‌ ఆర్థిక ఇబ్బందులు ప‌డుతున్నా..  సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. ప్ర‌స్తుతం పరోక్ష ప‌న్నులు క‌ట్టేవారి సంఖ్య కూడా పెరుగుతుంద‌ని.. దీంతో రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంద‌ని చెప్పారు. జీఎస్టీ ద్వారా 2018లో రూ.7.19 లక్షల కోట్ల ఆదాయం వస్తే.. ప్రస్తుతం 22.08 లక్షల కోట్ల ఆదాయం దేశానికి స‌మ‌కూరింద‌న్నారు.

వ‌న్ నేష‌న్ – వన్ విజన్‌!

దేశంలో ఇప్పుడు సంస్క‌ర‌ణ‌లు అమ‌లు అవుతున్నాయ‌న్న చంద్ర‌బాబు..  ఒకే దేశం- ఒకే విజ‌న్ నినాదంతో మరింత‌ ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజ‌న్ స‌ర్కారు గ్రోత్ సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌నకు ఉంద‌న్నారు. అనంత‌రం.. జీఎస్టీ  సంస్క‌ర‌ణ‌ల‌ను స్వాగ‌తిస్తూ.. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దీనికి ఏక‌గ్రీవంగా స‌భ్యులు సంత‌కాలు చేశారు.

Kumar

Recent Posts

శ్రీనగర్.. ఈ ఏడాది సమ్మర్ విన్నర్.. ఎంత భారీగా ఫ్లైట్ జర్నీలంటే?

ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…

49 minutes ago

సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…

3 hours ago

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

7 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

8 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

10 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

10 hours ago