Political News

10 కోట్ల ఖ‌ర్చు: ల‌క్ష్యాలు నెర‌వేరేనా బాబూ!?

అమ‌రావ‌తిలో రెండు రోజుల పాటు ఘ‌నంగా నిర్వ‌హించిన క‌లెక్ట‌ర్లు, ఎస్పీల స‌ద‌స్సుకు దాదాపు రూ.10 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చ‌యిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. క‌లెక్ట‌ర్ల‌కు బ‌స‌, భోజ‌నాలు, వాహ‌నాల ఖ‌ర్చు, రాక‌పోకల చార్జీలు, అల వెన్సులు, వారి దిగువ‌స్థాయి అధికారులు, డ్రైవ‌ర్ల‌కు కూడా సేమ్ టు సేమ్ ఖ‌ర్చులు.. వెర‌సి.. 10 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌యిన‌ట్టు ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు. అయితే.. ఇంత ఖ‌ర్చు చేసినా.. సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యాలు నెర‌వేరుతాయా? అనేది ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. సీఎం చంద్ర‌బాబు ఈ క‌లెక్ట‌ర్లు, ఎస్పీల స‌ద‌స్సులో.. కీల‌క‌మైన 10 అంశాల‌ను వారికి ల‌క్ష్యాలుగా నిర్దేశించారు. రాష్ట్రంలో వృద్ధి సాధ‌న‌తోపాటు.. డిజిట‌లీక‌ర‌ణ‌, మ‌హిళా సాధికార‌త‌, శాంతి భ‌ద్ర‌త‌లు, పీ-4, పెట్టుబ‌డులు.. ఉద్యోగాలు, ఉపాధి క‌ల్ప‌న‌, ప్ర‌తి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక‌వేత్త‌, టెక్నాలజీ వినియోగం, ప్రభుత్వ ఆఫీసుల‌పై సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటు, గ్రీన్‌ ఎనర్జీ, ఇలా.. అనేక విష‌యాల‌పై చంద్ర‌బాబు క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు ల‌క్ష్యాలు నిర్దేశించారు. మంచిదే.. ఒక ప్ర‌భుత్వం ల‌క్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించ‌డాన్ని అంద‌రూ స్వాగ‌తించాల్సిందే.

అయితే.. ఇది ఏక‌ప‌క్షంగా సాధ్య‌మ‌వుతుందా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఈ ల‌క్ష్యాల సాధ‌న మొత్తాన్నీ కూడా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల భుజాల‌పైనే చంద్ర‌బాబు మోపేశారు. ప్ర‌తి మూడు మాసాల‌కు ఒక‌సారి రివ్యూ చేస్తాన‌ని కూడా చెప్పారు. అయితే.. వాస్త‌వానికి క‌లెక్ట‌ర్లు కానీ, ఎస్పీలు కానీ.. జిల్లాల స్థాయిలో స్వేచ్ఛ‌గా ప‌నిచేసుకునేందుకు అవ‌కాశం ఉందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే .. అడుగ‌డుగునా పెరిగిపోయిన‌.. రాజ‌కీయ జోక్యం, నేత‌ల ఉత్సాహం.. ఆధిప‌త్య ధోర‌ణి వంటివి పార‌ద‌ర్శ‌కంగా ప‌నిచేసుకునే అధికారుల‌కు కూడా త‌ల‌నొప్పులు తెస్తున్నాయ‌న్న‌ది వాస్త‌వం.

ఈ విష‌యాన్ని క‌నీసం ప్ర‌స్తావ‌న కూడా చేయ‌కుండానే సీఎం చంద్ర‌బాబు.. ల‌క్ష్యాలు పెట్టార‌ని, మెజారిటీ క‌లెక్ట‌ర్లు.. వాపోయారు. పైకి వారు అన‌క‌పోయినా.. లంచ్ బ్రేక్‌, టీ బ్రేక్‌ల‌లో క‌లెక్ట‌ర్లు చేసుకున్న చ‌ర్చ‌ల్లో ఇదే విష‌యం ప్ర‌ధానంగా వినిపించింది. ఫ్రీహ్యాండ్ లేన‌ప్పుడు.. తాము మాత్రం ఏం చేస్తామ‌ని ఇద్ద‌రు క‌లెక్ట‌ర్లు.. మీడియాతో సైతం వ్యాఖ్యానించారు. అంటే.. పైకి చెబుతున్న‌ట్టుగా .. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి లేద‌న్న‌ది వారు చెబుతున్న‌మాట‌. ఇది ముమ్మాటికీ వాస్త‌వం. సీఎం అండ‌ర్లో కంటే కూడా.. క్షేత్ర‌స్థాయి ఎమ్మెల్యే ఎంపీ అండ‌ర్‌లోకి వెళ్లిపోయిన క‌లెక్ట‌ర్లు చాలా మంది ఉన్నారు. ఈ వ్య‌వ‌స్థ‌ను స‌రిచేయ‌కుండా.. ఎన్ని ల‌క్ష్యాలు పెట్టినా.. కేవ‌లం కంఠ‌శోష త‌ప్ప‌.. ఏమీ మిగ‌ల‌ద‌ని అంటున్నారు.

Satya

Recent Posts

శ్రీనగర్.. ఈ ఏడాది సమ్మర్ విన్నర్.. ఎంత భారీగా ఫ్లైట్ జర్నీలంటే?

ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…

2 hours ago

సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…

4 hours ago

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

8 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

9 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

11 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

11 hours ago