అమరావతిలో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సుకు దాదాపు రూ.10 కోట్ల వరకు ఖర్చయినట్టు అధికారులు చెబుతున్నారు. కలెక్టర్లకు బస, భోజనాలు, వాహనాల ఖర్చు, రాకపోకల చార్జీలు, అల వెన్సులు, వారి దిగువస్థాయి అధికారులు, డ్రైవర్లకు కూడా సేమ్ టు సేమ్ ఖర్చులు.. వెరసి.. 10 కోట్ల రూపాయల వరకు ఖర్చయినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే.. ఇంత ఖర్చు చేసినా.. సీఎం చంద్రబాబు లక్ష్యాలు నెరవేరుతాయా? అనేది ప్రశ్న.
ఎందుకంటే.. సీఎం చంద్రబాబు ఈ కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో.. కీలకమైన 10 అంశాలను వారికి లక్ష్యాలుగా నిర్దేశించారు. రాష్ట్రంలో వృద్ధి సాధనతోపాటు.. డిజిటలీకరణ, మహిళా సాధికారత, శాంతి భద్రతలు, పీ-4, పెట్టుబడులు.. ఉద్యోగాలు, ఉపాధి కల్పన, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త, టెక్నాలజీ వినియోగం, ప్రభుత్వ ఆఫీసులపై సోలార్ ప్యానళ్ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, ఇలా.. అనేక విషయాలపై చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలకు లక్ష్యాలు నిర్దేశించారు. మంచిదే.. ఒక ప్రభుత్వం లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించడాన్ని అందరూ స్వాగతించాల్సిందే.
అయితే.. ఇది ఏకపక్షంగా సాధ్యమవుతుందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ఈ లక్ష్యాల సాధన మొత్తాన్నీ కూడా కలెక్టర్లు, ఎస్పీల భుజాలపైనే చంద్రబాబు మోపేశారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి రివ్యూ చేస్తానని కూడా చెప్పారు. అయితే.. వాస్తవానికి కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ.. జిల్లాల స్థాయిలో స్వేచ్ఛగా పనిచేసుకునేందుకు అవకాశం ఉందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే .. అడుగడుగునా పెరిగిపోయిన.. రాజకీయ జోక్యం, నేతల ఉత్సాహం.. ఆధిపత్య ధోరణి వంటివి పారదర్శకంగా పనిచేసుకునే అధికారులకు కూడా తలనొప్పులు తెస్తున్నాయన్నది వాస్తవం.
ఈ విషయాన్ని కనీసం ప్రస్తావన కూడా చేయకుండానే సీఎం చంద్రబాబు.. లక్ష్యాలు పెట్టారని, మెజారిటీ కలెక్టర్లు.. వాపోయారు. పైకి వారు అనకపోయినా.. లంచ్ బ్రేక్, టీ బ్రేక్లలో కలెక్టర్లు చేసుకున్న చర్చల్లో ఇదే విషయం ప్రధానంగా వినిపించింది. ఫ్రీహ్యాండ్ లేనప్పుడు.. తాము మాత్రం ఏం చేస్తామని ఇద్దరు కలెక్టర్లు.. మీడియాతో సైతం వ్యాఖ్యానించారు. అంటే.. పైకి చెబుతున్నట్టుగా .. క్షేత్రస్థాయిలో పరిస్థితి లేదన్నది వారు చెబుతున్నమాట. ఇది ముమ్మాటికీ వాస్తవం. సీఎం అండర్లో కంటే కూడా.. క్షేత్రస్థాయి ఎమ్మెల్యే ఎంపీ అండర్లోకి వెళ్లిపోయిన కలెక్టర్లు చాలా మంది ఉన్నారు. ఈ వ్యవస్థను సరిచేయకుండా.. ఎన్ని లక్ష్యాలు పెట్టినా.. కేవలం కంఠశోష తప్ప.. ఏమీ మిగలదని అంటున్నారు.
This post was last modified on September 17, 2025 3:55 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…