Political News

10 కోట్ల ఖ‌ర్చు: ల‌క్ష్యాలు నెర‌వేరేనా బాబూ!?

అమ‌రావ‌తిలో రెండు రోజుల పాటు ఘ‌నంగా నిర్వ‌హించిన క‌లెక్ట‌ర్లు, ఎస్పీల స‌ద‌స్సుకు దాదాపు రూ.10 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చ‌యిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. క‌లెక్ట‌ర్ల‌కు బ‌స‌, భోజ‌నాలు, వాహ‌నాల ఖ‌ర్చు, రాక‌పోకల చార్జీలు, అల వెన్సులు, వారి దిగువ‌స్థాయి అధికారులు, డ్రైవ‌ర్ల‌కు కూడా సేమ్ టు సేమ్ ఖ‌ర్చులు.. వెర‌సి.. 10 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌యిన‌ట్టు ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు. అయితే.. ఇంత ఖ‌ర్చు చేసినా.. సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యాలు నెర‌వేరుతాయా? అనేది ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. సీఎం చంద్ర‌బాబు ఈ క‌లెక్ట‌ర్లు, ఎస్పీల స‌ద‌స్సులో.. కీల‌క‌మైన 10 అంశాల‌ను వారికి ల‌క్ష్యాలుగా నిర్దేశించారు. రాష్ట్రంలో వృద్ధి సాధ‌న‌తోపాటు.. డిజిట‌లీక‌ర‌ణ‌, మ‌హిళా సాధికార‌త‌, శాంతి భ‌ద్ర‌త‌లు, పీ-4, పెట్టుబ‌డులు.. ఉద్యోగాలు, ఉపాధి క‌ల్ప‌న‌, ప్ర‌తి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక‌వేత్త‌, టెక్నాలజీ వినియోగం, ప్రభుత్వ ఆఫీసుల‌పై సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటు, గ్రీన్‌ ఎనర్జీ, ఇలా.. అనేక విష‌యాల‌పై చంద్ర‌బాబు క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు ల‌క్ష్యాలు నిర్దేశించారు. మంచిదే.. ఒక ప్ర‌భుత్వం ల‌క్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించ‌డాన్ని అంద‌రూ స్వాగ‌తించాల్సిందే.

అయితే.. ఇది ఏక‌ప‌క్షంగా సాధ్య‌మ‌వుతుందా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఈ ల‌క్ష్యాల సాధ‌న మొత్తాన్నీ కూడా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల భుజాల‌పైనే చంద్ర‌బాబు మోపేశారు. ప్ర‌తి మూడు మాసాల‌కు ఒక‌సారి రివ్యూ చేస్తాన‌ని కూడా చెప్పారు. అయితే.. వాస్త‌వానికి క‌లెక్ట‌ర్లు కానీ, ఎస్పీలు కానీ.. జిల్లాల స్థాయిలో స్వేచ్ఛ‌గా ప‌నిచేసుకునేందుకు అవ‌కాశం ఉందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే .. అడుగ‌డుగునా పెరిగిపోయిన‌.. రాజ‌కీయ జోక్యం, నేత‌ల ఉత్సాహం.. ఆధిప‌త్య ధోర‌ణి వంటివి పార‌ద‌ర్శ‌కంగా ప‌నిచేసుకునే అధికారుల‌కు కూడా త‌ల‌నొప్పులు తెస్తున్నాయ‌న్న‌ది వాస్త‌వం.

ఈ విష‌యాన్ని క‌నీసం ప్ర‌స్తావ‌న కూడా చేయ‌కుండానే సీఎం చంద్ర‌బాబు.. ల‌క్ష్యాలు పెట్టార‌ని, మెజారిటీ క‌లెక్ట‌ర్లు.. వాపోయారు. పైకి వారు అన‌క‌పోయినా.. లంచ్ బ్రేక్‌, టీ బ్రేక్‌ల‌లో క‌లెక్ట‌ర్లు చేసుకున్న చ‌ర్చ‌ల్లో ఇదే విష‌యం ప్ర‌ధానంగా వినిపించింది. ఫ్రీహ్యాండ్ లేన‌ప్పుడు.. తాము మాత్రం ఏం చేస్తామ‌ని ఇద్ద‌రు క‌లెక్ట‌ర్లు.. మీడియాతో సైతం వ్యాఖ్యానించారు. అంటే.. పైకి చెబుతున్న‌ట్టుగా .. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి లేద‌న్న‌ది వారు చెబుతున్న‌మాట‌. ఇది ముమ్మాటికీ వాస్త‌వం. సీఎం అండ‌ర్లో కంటే కూడా.. క్షేత్ర‌స్థాయి ఎమ్మెల్యే ఎంపీ అండ‌ర్‌లోకి వెళ్లిపోయిన క‌లెక్ట‌ర్లు చాలా మంది ఉన్నారు. ఈ వ్య‌వ‌స్థ‌ను స‌రిచేయ‌కుండా.. ఎన్ని ల‌క్ష్యాలు పెట్టినా.. కేవ‌లం కంఠ‌శోష త‌ప్ప‌.. ఏమీ మిగ‌ల‌ద‌ని అంటున్నారు.

This post was last modified on September 17, 2025 3:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

2 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

2 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

2 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

3 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

3 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

4 hours ago