జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంత ఈజీగా నవ్వరు. ఏదైనా పెద్ద సందర్భం వస్తే తప్ప.. ఆయన పెద్దగా స్పందించరు. ప్రజల సమస్యలపైనా.. వాటి పరిష్కారంపైనా మాత్రమే దృష్టిపెడతారు. ఇక, ఏదైనా కార్య క్రమంలో పాల్గొన్నా.. కూడా ఆయన మౌనంగానే ఉంటారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన నిర్దిష్ట అంశాలపై మాట్లాడి వెళ్లిపోతారు. తాజాగా అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెండో రోజు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వాస్తవానికి తొలి రోజే ఆయన పాల్గొనాల్సి ఉంది. కానీ, ఇతర కార్యక్రమాలతో ఆయన హాజరు కాలేకపోయారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఉన్న అటవీ, పంచాయతీరాజ్, శాస్త్రసాంకేతిక శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు రెండో రోజు సమయం కేటాయించారు. రెండో రోజు పవన్ కల్యాణ్ ఈ సదస్సుకు హాజరయ్యారు. అయితే.. సమావేశంలో తొలి అర్ధబాగం ఆయన సీరియస్గానే ఉన్నారు. సీఎం చంద్రబాబు చెబుతున్న విషయాలు.. వాటిపై కలెక్టర్లు ఇచ్చిన వివరణలను కూడా ఆయన ఆసక్తిగా పరిశీలించారు. కానీ, అనూహ్యంగా పంచాయతీ రాజ్ విషయాన్ని చర్చించే సమయంలో పవన్ చిరునవ్వులు చిందించారు.
తానే కాదు.. తన పార్టీ నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్కు ల్యాప్టాప్లో పంచాయతీ రాజ్ ప్రగతిని చూపి స్తూ.. ఆయన చిరునవ్వులు చిందించారు. వైసీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఇలా ఉండేవని.. ఇప్పుడు ఇలా మారాయని.. సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పిన సమయంలో తన ల్యాప్టాప్లో ఆయా అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రగతిని చిత్రాల రూపంలో చూస్తూ.. తన తోటి మంత్రి నాదెండ్లకు కూడా చూపిస్తూ.. పవన్ కల్యాణ్ నవ్వులు విరబూశారు. అంతేకాదు.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో ప్రజలు పవన్ కల్యాణ్కు బ్రహ్మరథం పడుతున్నారని సీఎం చంద్రబాబు చెప్పినప్పుడు మరింత మురిసిపోయారు. ఈ చిరునవ్వుల భావం ఇదే!
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…