జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంత ఈజీగా నవ్వరు. ఏదైనా పెద్ద సందర్భం వస్తే తప్ప.. ఆయన పెద్దగా స్పందించరు. ప్రజల సమస్యలపైనా.. వాటి పరిష్కారంపైనా మాత్రమే దృష్టిపెడతారు. ఇక, ఏదైనా కార్య క్రమంలో పాల్గొన్నా.. కూడా ఆయన మౌనంగానే ఉంటారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన నిర్దిష్ట అంశాలపై మాట్లాడి వెళ్లిపోతారు. తాజాగా అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెండో రోజు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వాస్తవానికి తొలి రోజే ఆయన పాల్గొనాల్సి ఉంది. కానీ, ఇతర కార్యక్రమాలతో ఆయన హాజరు కాలేకపోయారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఉన్న అటవీ, పంచాయతీరాజ్, శాస్త్రసాంకేతిక శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు రెండో రోజు సమయం కేటాయించారు. రెండో రోజు పవన్ కల్యాణ్ ఈ సదస్సుకు హాజరయ్యారు. అయితే.. సమావేశంలో తొలి అర్ధబాగం ఆయన సీరియస్గానే ఉన్నారు. సీఎం చంద్రబాబు చెబుతున్న విషయాలు.. వాటిపై కలెక్టర్లు ఇచ్చిన వివరణలను కూడా ఆయన ఆసక్తిగా పరిశీలించారు. కానీ, అనూహ్యంగా పంచాయతీ రాజ్ విషయాన్ని చర్చించే సమయంలో పవన్ చిరునవ్వులు చిందించారు.
తానే కాదు.. తన పార్టీ నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్కు ల్యాప్టాప్లో పంచాయతీ రాజ్ ప్రగతిని చూపి స్తూ.. ఆయన చిరునవ్వులు చిందించారు. వైసీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఇలా ఉండేవని.. ఇప్పుడు ఇలా మారాయని.. సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పిన సమయంలో తన ల్యాప్టాప్లో ఆయా అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రగతిని చిత్రాల రూపంలో చూస్తూ.. తన తోటి మంత్రి నాదెండ్లకు కూడా చూపిస్తూ.. పవన్ కల్యాణ్ నవ్వులు విరబూశారు. అంతేకాదు.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో ప్రజలు పవన్ కల్యాణ్కు బ్రహ్మరథం పడుతున్నారని సీఎం చంద్రబాబు చెప్పినప్పుడు మరింత మురిసిపోయారు. ఈ చిరునవ్వుల భావం ఇదే!
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…