ఏపీలో అధికార, విపక్షాల మధ్య నలుగుతున్న మెడికల్ కాలేజీల వ్యవహారం అంతకంతకూ ముదురుతోంది. రెండు వైపుల నుంచి ఘాటు వ్యాఖ్యలు దూసుకువస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం మీడియా ముందుకు వచ్చిన వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి తీరుపై మండిపడ్డారు. హోం మంత్రి అనిత మెడికల్ కాలేజీలపై చేసిన ప్రజెంటేషన్ ఆధారంగా రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు మీరు హోం మంత్రా? లేదంటే యాంకర్ వా? ఆంటూ అనితపై రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చి పిచ్చి వీడియోలను తీసుకుని వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.
అసలు జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలుసుకోవాలంటే కూటమి నేతలు తన వెంట రావాలని…అలా తన వెంట వచ్చే దమ్ము ఆ మూడు పార్టీల నేతలకు ఉండా? అని కూడా రోజా ప్రశ్నించారు. పులివెందుల, మచిలీపట్నం, నంద్యాల, పాడేరులకు వెళ్లి చూస్తే… తాము కట్టిన మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయో, మెడికల్ కాలేజీ విద్యార్థులు ఎలా ఉంటారో కూటమి నేతలకు అర్థం అవుతుందని ఆమె చెప్పుకొచ్చారు. ఎక్కడైనా మంజూరైన పనులు విడతలవారీగా జరుగుతాయి తప్పించి అన్నింటినీ ఒకేసారి చేపట్టి పూర్తి చేయడం అసాధ్యమని ఆమె చెప్పుకొచ్చారు.
పీపీపీని పవన్ అడ్డుకోవాలి..
ప్రజల సంక్షేమం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..తన కళ్లెదుటే 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అయిపోతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని రోజా ప్రశ్నించారు. పేదలకు తీవ్ర నష్టం చేసే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పవన్ అడ్డుకుని తీరాలని ఆమె డిమాండ్ చేశారు. ఏదో స్సెషల్ ఫ్లైట్లు, హెలికాఫ్టర్లలో తిరగడానికి ప్రజలు పవన్ కు ఓటు వేయలేదని ఆమె అన్నారు. కేబినెట్ లో కీలక స్థానంలో ఉన్న పవన్… తన కళ్లెదుటే చంద్రబాబు లెక్కలేనన్ని ప్రజా వ్యవతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నా కిమ్మనడం లేదని కూడా రోజా ఆరోపించారు. ఇప్పటికైనా పవన్ ప్రజల పక్షాన నోరు విప్పాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.
This post was last modified on September 13, 2025 1:34 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…