నిజంగానే వైసీపీ కీలక నేత, రాజంపేట హ్యాట్రిక్ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి పెద్ద కష్టమే వచ్చిపడింది. ఏదో ఉపరాష్ట్రపతి ఎన్నికను సాకుగా చూపి ఓ నెల పాటో, 15 రోజుల పాటో బయట తిరుగుతూ వ్యవహారాలు చక్కబెట్టుకుందామని ఆయన అనుకున్నారు. అయితే విధి మాత్రం ఆయన అభీష్ఠాన్ని మన్నించలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు 5 రోజుల వెసులుబాటు సరిపోతుంది కదా అని చెప్పిన కోర్టు… ఆ 5 రోజుల మేరకే ఆయనకు ఇంటెరిమ్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఉత్తర్వులు రాగానే రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చిన మిథున్… ఈ 5 రోజుల్లో ఏం చేశారో తెలియదు గానీ గురువారం గడువు ముగియగానే సాయంత్రం బుద్ధిగా వచ్చి జైలు అధికారుల ముందు లొంగిపోయారు.
వైసీపీ అధినేతకు అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్న మిథున్ రెడ్డి… లిక్కర్ స్కాంకు సూత్రధారి అన్నది ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారుల భావన. అందుకే ఈ కేసులో ఆయనను ఏ4గా చేర్చారు. విచారణకు రమ్మంటే సుదీర్ఘ కాలం పాటు సాకులు చెప్పిన మిథున్.. చివరాఖరుకు విచారణకు హాజరు కాక తప్పలేదు. అదే సమయంలో అయనను సిట్ పకడ్బందీగానే అరెస్టు చేసింది. దాదాదాపు 50 రోజులపాటు ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నారు. బెయిల్ కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్న మిథున్ కు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. లోక్ సభలో వైసీపీ పక్ష నేతగా ఉన్నందున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే విషయంలో కోర్టు కొంత మేర సానుకూల దృక్పథాన్ని కనబరచింది.
వైసీపీ అధికారంలో ఉండగా… మిథున్ రెడ్డి హవా ఓ రేంజిలో కొనసాగింది. జగన్ తో తనకున్న సన్నిహితత్వాన్ని ఆసరా చేసుకుని ఆయన చెలరేగిపోయారని చెప్పక తప్పదు. ఈ కారణంగా ఒక్క లిక్కర్ స్కామే కాకుండా… తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు, బాబాయి ఎమ్మెల్యేగా ఉన్న తంబళ్లపల్లి నియోజకవర్గాలను ఆయన మకుటం లేని మారాజుగా వెలుగొందారు. కంటికి కనిపించిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను హస్తగతం చేసుకున్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోనూ మిథున్ తిప్పిన హవాతో చాలా మంది వైసీపీ నేతలే ఇబ్బంది పడ్డారు. అయితే ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోయారు. అలాంటి మిథున్ ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు జైలులో లొంగిపోయారు. ఇక మళ్లీ ఆయన ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి.
This post was last modified on September 12, 2025 9:38 am
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…