వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఏడై నా దూకి చావొచ్చు.. చంద్రబాబు” అని వ్యాఖ్యానించారు. అదేసమయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుపైనా జగన్ ఇవే వ్యాఖ్యలు చేశారు. “ఇద్దరూ కలిసి(సీఎం, మంత్రి) ఏడైనా బావుంటే చూసుకుని దూకితే సరిపోతుంది.” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది.
ఏం జరిగింది?
తాజాగా బుధవారం ఉదయం తాడేపల్లిలోని నివాసంలో జగన్ మీడియాతో మాట్లాడారు. మంగళవారం వైసీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన.. ‘అన్నదాత పోరు’ కార్యక్రమం గురించి వివరించారు. రాష్ట్రం లో రైతులు నానా అగచాట్లు పడుతున్నారని.. ఎరువులు, పురుగు మందులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో అన్నదాతలకు అండగా తమ పార్టీ తరఫున కార్యక్రమం చేపట్టి నట్టు చెప్పారు. అయితే. పోలీసులను పెట్టుకుని తమ వారికి నోటీసులు ఇచ్చారని… అడ్డుకున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా జగన్ రైతులు.. పడుతున్న ఇబ్బందులకు సంబంధించి ఫొటోలను మీడియాకు చూపించారు. రైతులు పెద్ద ఎత్తున ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద మూగడం, లైన్లు.. చెప్పులను లైన్లో పెట్టడం, రేయింబవళ్లు ఎరువుల కేంద్రాల వద్ద వేచి ఉన్న ఫొటోలను చూపించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయన ఫొటోల రూపంలో చూపించారు. “ఇది చూసిన తర్వాత… ఏడైనా దూకి చావొచ్చు.. చంద్రబాబు” అని జగన్ వ్యాఖ్యానించారు.
అనంతరం.. శ్రీకాకుళం జిల్లాలో రైతులు పడుతున్న అవస్థలను కూడా ఫొటోల రూపంలో చూపించారు. “ఇది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇది చూసిన తర్వాత.. ఇద్దరూ(సీఎం, మంత్రి) ఏడైనా బావింటే చూసుకుని దూకితే సరిపోద్ది” అని జగన్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి సమస్యలు ఎత్తి చూపడం తప్పుకాదు. కానీ, ఇలా చావు-బావి అంటూ.. వ్యాఖ్యలు చేయడం ఆయనస్థాయికి తగదన్న వాదన వినిపిస్తోంది.
This post was last modified on September 10, 2025 12:24 pm
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…
మనకు డెవిల్ అంటే ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమా గుర్తొస్తుంది కానీ ఇటీవలే కన్నడలో విడుదలైన భారీ…
మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ…
గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సువార్తీకుడు కేఏ పాల్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ…
తమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే.. బీజేపీ విషయంలో ఇది అక్షరాలా నిజం. తనకు అవకాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…