ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి 300 ఓట్ల వద్దే ఆగిపోయారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఏపీలోని మూడు పార్టీలను ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మీరు ముగ్గురూ చరిత్ర హీనులు” అంటూ.. టీడీపీ, జనసేన, వైసీపీ అధినేతలపై ఆమె విరుచుకుపడ్డారు. ముగ్గురూ కలిసి ఉమ్మడిగా ఎన్డీయే అభ్యర్థిని గెలిపించారని ఎద్దేవా చేశారు. తెలుగు జాతి పౌరుషం అంటూ పార్టీ పెట్టిన టీడీపీ.. ప్రశ్నిస్తానని వచ్చిన జనసేన, తెలుగు వారికోసమే కట్టుబడి పనిచేస్తామన్న వైసీపీ ఇప్పుడు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
అంతేకాదు.. ఆర్ఎస్ఎస్ కు చెందిన అభ్యర్థికి ఓటు వేయించి.. ఈ మూడు పార్టీలు తెలుగు జాతికి ద్రోహం చేశాయని షర్మిల విమర్శించారు. “ఈ రోజు తెలుగు జాతికి చీకటి రోజు” అని పేర్కొన్నారు. “తెలుగు జాతికి నేడు చీకటి రోజు. ఆత్మగౌరవమే అజెండా అని టీడీపీ, పదవుల కన్నా జాతి ప్రయోజనం ముఖ్యమని జనసేన, తెలుగే లెస్స అని చిలక పలుకులు పలికిన వైసీపీ… తెలుగు జాతికి చేసింది నేడు తీరని ద్రోహం. రాజకీయాలకు అతీతంగా, అత్యున్నత పదవికి తెలుగు బిడ్డ పోటీ పడితే, ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేయించిన మూడు పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు.” అని ఆమె నిప్పులు చెరిగారు.
ప్రధాని మోడీకి ఈ మూడు పార్టీల నాయకులు మోకాళ్లు ఒత్తుతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. తెలుగు బిడ్డను ప్రోత్సహించాల్సింది పోయి.. మోడీ చెప్పారని.. ఆర్ఎస్ఎస్ వాదికి ఓటేస్తారా? అని ప్రశ్నించారు. ఇది అత్యంత దారుణం, బాధాకరమని షర్మిల వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో తెలుగు జాతికి జరిగిన ఘోర అవమానంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మూడు పార్టీల నాయకులకు షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇదేసమయంలో వైసీపీ అధినేత జగన్పై మరింత ఘాటుగా విరుచుకుపడ్డారు. సీబీఐ, ఈడీ కేసులకు భయపడి జగన్.. మోడీకి మోకరిల్లాడని అన్నారు.
షర్మిల ప్రశ్నలు ఇవీ..
This post was last modified on September 10, 2025 10:01 am
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…