Political News

మీరు ముగ్గురూ చ‌రిత్ర హీనులు: ష‌ర్మిల ఫైర్‌

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి అభ్య‌ర్థి జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డి 300 ఓట్ల వ‌ద్దే ఆగిపోయారు. ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. ఏపీలోని మూడు పార్టీల‌ను ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. “మీరు ముగ్గురూ చ‌రిత్ర హీనులు” అంటూ.. టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీ అధినేత‌ల‌పై ఆమె విరుచుకుప‌డ్డారు. ముగ్గురూ క‌లిసి ఉమ్మ‌డిగా ఎన్డీయే అభ్య‌ర్థిని గెలిపించార‌ని ఎద్దేవా చేశారు. తెలుగు జాతి పౌరుషం అంటూ పార్టీ పెట్టిన టీడీపీ.. ప్ర‌శ్నిస్తాన‌ని వ‌చ్చిన జ‌న‌సేన‌, తెలుగు వారికోస‌మే క‌ట్టుబ‌డి ప‌నిచేస్తామ‌న్న వైసీపీ ఇప్పుడు మొహాలు ఎక్క‌డ పెట్టుకుంటార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

అంతేకాదు.. ఆర్ఎస్ఎస్ కు చెందిన అభ్య‌ర్థికి ఓటు వేయించి.. ఈ మూడు పార్టీలు తెలుగు జాతికి ద్రోహం చేశాయ‌ని ష‌ర్మిల విమ‌ర్శించారు. “ఈ రోజు తెలుగు జాతికి చీకటి రోజు” అని పేర్కొన్నారు. “తెలుగు జాతికి నేడు చీకటి రోజు. ఆత్మగౌరవమే అజెండా అని టీడీపీ, పదవుల కన్నా జాతి ప్రయోజనం ముఖ్యమని జనసేన, తెలుగే లెస్స అని చిలక పలుకులు పలికిన వైసీపీ… తెలుగు జాతికి చేసింది నేడు తీరని ద్రోహం. రాజకీయాలకు అతీతంగా, అత్యున్నత పదవికి తెలుగు బిడ్డ పోటీ పడితే, ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేయించిన మూడు పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు.” అని ఆమె నిప్పులు చెరిగారు.

ప్ర‌ధాని మోడీకి ఈ మూడు పార్టీల నాయ‌కులు మోకాళ్లు ఒత్తుతున్నార‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. తెలుగు బిడ్డ‌ను ప్రోత్స‌హించాల్సింది పోయి.. మోడీ చెప్పార‌ని.. ఆర్ఎస్ఎస్ వాదికి ఓటేస్తారా? అని ప్ర‌శ్నించారు. ఇది అత్యంత దారుణం, బాధాక‌ర‌మ‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో తెలుగు జాతికి జరిగిన ఘోర అవమానంగా పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా మూడు పార్టీల నాయ‌కుల‌కు ష‌ర్మిల కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. ఇదేస‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై మ‌రింత ఘాటుగా విరుచుకుప‌డ్డారు. సీబీఐ, ఈడీ కేసుల‌కు భ‌య‌ప‌డి జ‌గ‌న్‌.. మోడీకి మోక‌రిల్లాడ‌ని అన్నారు.

ష‌ర్మిల ప్ర‌శ్న‌లు ఇవీ..

  • తెలుగు ప్రజల ఆత్మగౌరవం కంటే మోడీతో స్వప్రయోజనమే ముఖ్యమా?
  • పోటీలు పడి మోడీ దగ్గర మోకరిల్లాల్సిన ఖర్మ ఎందుకు పట్టింది?
  • రాష్ట్రానికి బీజేపీ చేసిన మోసం మీకు కనిపించలేదా?
  • 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి గొంతు కోసిన విష‌యం గుర్తులేదా?
  • తెలుగు ప్ర‌జ‌ల జీవనాడి పోలవరం జీవం తీసేస్తే మీలో చలనం లేదా?
  • విశాఖ స్టీల్ ప్లాంటును అమ్మేస్తుంటే మీకు రోషం లేదా?
Satya

Recent Posts

జూన్ నెలలో విజయ్…….జూలైలో జూనియర్ విజయ్

కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…

3 hours ago

కెప్టెన్‌గా రిష‌బ్ పంత్ ఔట్‌

రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్ల‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీం సొంత‌మైన ఆట‌గాడు రిష‌బ్ పంత్.…

4 hours ago

రండి తేల్చేద్దాం.. ముఖ్య నేత‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. గ‌త వారం రోజులుగా మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌పై దృష్టి పెట్టారు. ఇదేస‌మ‌యంలో పాల‌న ప‌రంగా కూడా స‌మీక్ష‌లు..…

4 hours ago

అతిథిని ఎక్కువగా అంచనా వేశారు

మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించడం చూశాం. ముఖ్యంగా ఖలేజాని చూసుకుంటే దానికొచ్చిన…

5 hours ago

జ‌గ‌న్ ఇప్పుడు ఫీల‌వుతున్నారా…?

వైసీపీ అధినేత జగన్ ఆవేదన చెందుతున్నారా ? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. పార్టీని…

6 hours ago

సైలెంటుగా సినిమా చేస్తున్న క్రిష్

తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకరు. తొలి సినిమా ‘గమ్యం’తో మొత్తం ఇండస్ట్రీ దృష్టిని అతను…

6 hours ago