Political News

మీరు ముగ్గురూ చ‌రిత్ర హీనులు: ష‌ర్మిల ఫైర్‌

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి అభ్య‌ర్థి జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డి 300 ఓట్ల వ‌ద్దే ఆగిపోయారు. ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. ఏపీలోని మూడు పార్టీల‌ను ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. “మీరు ముగ్గురూ చ‌రిత్ర హీనులు” అంటూ.. టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీ అధినేత‌ల‌పై ఆమె విరుచుకుప‌డ్డారు. ముగ్గురూ క‌లిసి ఉమ్మ‌డిగా ఎన్డీయే అభ్య‌ర్థిని గెలిపించార‌ని ఎద్దేవా చేశారు. తెలుగు జాతి పౌరుషం అంటూ పార్టీ పెట్టిన టీడీపీ.. ప్ర‌శ్నిస్తాన‌ని వ‌చ్చిన జ‌న‌సేన‌, తెలుగు వారికోస‌మే క‌ట్టుబ‌డి ప‌నిచేస్తామ‌న్న వైసీపీ ఇప్పుడు మొహాలు ఎక్క‌డ పెట్టుకుంటార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

అంతేకాదు.. ఆర్ఎస్ఎస్ కు చెందిన అభ్య‌ర్థికి ఓటు వేయించి.. ఈ మూడు పార్టీలు తెలుగు జాతికి ద్రోహం చేశాయ‌ని ష‌ర్మిల విమ‌ర్శించారు. “ఈ రోజు తెలుగు జాతికి చీకటి రోజు” అని పేర్కొన్నారు. “తెలుగు జాతికి నేడు చీకటి రోజు. ఆత్మగౌరవమే అజెండా అని టీడీపీ, పదవుల కన్నా జాతి ప్రయోజనం ముఖ్యమని జనసేన, తెలుగే లెస్స అని చిలక పలుకులు పలికిన వైసీపీ… తెలుగు జాతికి చేసింది నేడు తీరని ద్రోహం. రాజకీయాలకు అతీతంగా, అత్యున్నత పదవికి తెలుగు బిడ్డ పోటీ పడితే, ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేయించిన మూడు పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు.” అని ఆమె నిప్పులు చెరిగారు.

ప్ర‌ధాని మోడీకి ఈ మూడు పార్టీల నాయ‌కులు మోకాళ్లు ఒత్తుతున్నార‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. తెలుగు బిడ్డ‌ను ప్రోత్స‌హించాల్సింది పోయి.. మోడీ చెప్పార‌ని.. ఆర్ఎస్ఎస్ వాదికి ఓటేస్తారా? అని ప్ర‌శ్నించారు. ఇది అత్యంత దారుణం, బాధాక‌ర‌మ‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో తెలుగు జాతికి జరిగిన ఘోర అవమానంగా పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా మూడు పార్టీల నాయ‌కుల‌కు ష‌ర్మిల కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. ఇదేస‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై మ‌రింత ఘాటుగా విరుచుకుప‌డ్డారు. సీబీఐ, ఈడీ కేసుల‌కు భ‌య‌ప‌డి జ‌గ‌న్‌.. మోడీకి మోక‌రిల్లాడ‌ని అన్నారు.

ష‌ర్మిల ప్ర‌శ్న‌లు ఇవీ..

  • తెలుగు ప్రజల ఆత్మగౌరవం కంటే మోడీతో స్వప్రయోజనమే ముఖ్యమా?
  • పోటీలు పడి మోడీ దగ్గర మోకరిల్లాల్సిన ఖర్మ ఎందుకు పట్టింది?
  • రాష్ట్రానికి బీజేపీ చేసిన మోసం మీకు కనిపించలేదా?
  • 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి గొంతు కోసిన విష‌యం గుర్తులేదా?
  • తెలుగు ప్ర‌జ‌ల జీవనాడి పోలవరం జీవం తీసేస్తే మీలో చలనం లేదా?
  • విశాఖ స్టీల్ ప్లాంటును అమ్మేస్తుంటే మీకు రోషం లేదా?

This post was last modified on September 10, 2025 10:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

22 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

2 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

3 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

3 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago