ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి 300 ఓట్ల వద్దే ఆగిపోయారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఏపీలోని మూడు పార్టీలను ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మీరు ముగ్గురూ చరిత్ర హీనులు” అంటూ.. టీడీపీ, జనసేన, వైసీపీ అధినేతలపై ఆమె విరుచుకుపడ్డారు. ముగ్గురూ కలిసి ఉమ్మడిగా ఎన్డీయే అభ్యర్థిని గెలిపించారని ఎద్దేవా చేశారు. తెలుగు జాతి పౌరుషం అంటూ పార్టీ పెట్టిన టీడీపీ.. ప్రశ్నిస్తానని వచ్చిన జనసేన, తెలుగు వారికోసమే కట్టుబడి పనిచేస్తామన్న వైసీపీ ఇప్పుడు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
అంతేకాదు.. ఆర్ఎస్ఎస్ కు చెందిన అభ్యర్థికి ఓటు వేయించి.. ఈ మూడు పార్టీలు తెలుగు జాతికి ద్రోహం చేశాయని షర్మిల విమర్శించారు. “ఈ రోజు తెలుగు జాతికి చీకటి రోజు” అని పేర్కొన్నారు. “తెలుగు జాతికి నేడు చీకటి రోజు. ఆత్మగౌరవమే అజెండా అని టీడీపీ, పదవుల కన్నా జాతి ప్రయోజనం ముఖ్యమని జనసేన, తెలుగే లెస్స అని చిలక పలుకులు పలికిన వైసీపీ… తెలుగు జాతికి చేసింది నేడు తీరని ద్రోహం. రాజకీయాలకు అతీతంగా, అత్యున్నత పదవికి తెలుగు బిడ్డ పోటీ పడితే, ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేయించిన మూడు పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు.” అని ఆమె నిప్పులు చెరిగారు.
ప్రధాని మోడీకి ఈ మూడు పార్టీల నాయకులు మోకాళ్లు ఒత్తుతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. తెలుగు బిడ్డను ప్రోత్సహించాల్సింది పోయి.. మోడీ చెప్పారని.. ఆర్ఎస్ఎస్ వాదికి ఓటేస్తారా? అని ప్రశ్నించారు. ఇది అత్యంత దారుణం, బాధాకరమని షర్మిల వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో తెలుగు జాతికి జరిగిన ఘోర అవమానంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మూడు పార్టీల నాయకులకు షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇదేసమయంలో వైసీపీ అధినేత జగన్పై మరింత ఘాటుగా విరుచుకుపడ్డారు. సీబీఐ, ఈడీ కేసులకు భయపడి జగన్.. మోడీకి మోకరిల్లాడని అన్నారు.
షర్మిల ప్రశ్నలు ఇవీ..
టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
నాలుగేళ్ల ముందు వరకు రిషబ్ శెట్టి అంటే.. కన్నడకే పరిమితమైన ఒక నటుడు, దర్శకుడు. తన మార్కెట్ పరిధి చాలా…