ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి 300 ఓట్ల వద్దే ఆగిపోయారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఏపీలోని మూడు పార్టీలను ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మీరు ముగ్గురూ చరిత్ర హీనులు” అంటూ.. టీడీపీ, జనసేన, వైసీపీ అధినేతలపై ఆమె విరుచుకుపడ్డారు. ముగ్గురూ కలిసి ఉమ్మడిగా ఎన్డీయే అభ్యర్థిని గెలిపించారని ఎద్దేవా చేశారు. తెలుగు జాతి పౌరుషం అంటూ పార్టీ పెట్టిన టీడీపీ.. ప్రశ్నిస్తానని వచ్చిన జనసేన, తెలుగు వారికోసమే కట్టుబడి పనిచేస్తామన్న వైసీపీ ఇప్పుడు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
అంతేకాదు.. ఆర్ఎస్ఎస్ కు చెందిన అభ్యర్థికి ఓటు వేయించి.. ఈ మూడు పార్టీలు తెలుగు జాతికి ద్రోహం చేశాయని షర్మిల విమర్శించారు. “ఈ రోజు తెలుగు జాతికి చీకటి రోజు” అని పేర్కొన్నారు. “తెలుగు జాతికి నేడు చీకటి రోజు. ఆత్మగౌరవమే అజెండా అని టీడీపీ, పదవుల కన్నా జాతి ప్రయోజనం ముఖ్యమని జనసేన, తెలుగే లెస్స అని చిలక పలుకులు పలికిన వైసీపీ… తెలుగు జాతికి చేసింది నేడు తీరని ద్రోహం. రాజకీయాలకు అతీతంగా, అత్యున్నత పదవికి తెలుగు బిడ్డ పోటీ పడితే, ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేయించిన మూడు పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు.” అని ఆమె నిప్పులు చెరిగారు.
ప్రధాని మోడీకి ఈ మూడు పార్టీల నాయకులు మోకాళ్లు ఒత్తుతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. తెలుగు బిడ్డను ప్రోత్సహించాల్సింది పోయి.. మోడీ చెప్పారని.. ఆర్ఎస్ఎస్ వాదికి ఓటేస్తారా? అని ప్రశ్నించారు. ఇది అత్యంత దారుణం, బాధాకరమని షర్మిల వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో తెలుగు జాతికి జరిగిన ఘోర అవమానంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మూడు పార్టీల నాయకులకు షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇదేసమయంలో వైసీపీ అధినేత జగన్పై మరింత ఘాటుగా విరుచుకుపడ్డారు. సీబీఐ, ఈడీ కేసులకు భయపడి జగన్.. మోడీకి మోకరిల్లాడని అన్నారు.
షర్మిల ప్రశ్నలు ఇవీ..
This post was last modified on September 10, 2025 10:01 am
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…