ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి 300 ఓట్ల వద్దే ఆగిపోయారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఏపీలోని మూడు పార్టీలను ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మీరు ముగ్గురూ చరిత్ర హీనులు” అంటూ.. టీడీపీ, జనసేన, వైసీపీ అధినేతలపై ఆమె విరుచుకుపడ్డారు. ముగ్గురూ కలిసి ఉమ్మడిగా ఎన్డీయే అభ్యర్థిని గెలిపించారని ఎద్దేవా చేశారు. తెలుగు జాతి పౌరుషం అంటూ పార్టీ పెట్టిన టీడీపీ.. ప్రశ్నిస్తానని వచ్చిన జనసేన, తెలుగు వారికోసమే కట్టుబడి పనిచేస్తామన్న వైసీపీ ఇప్పుడు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
అంతేకాదు.. ఆర్ఎస్ఎస్ కు చెందిన అభ్యర్థికి ఓటు వేయించి.. ఈ మూడు పార్టీలు తెలుగు జాతికి ద్రోహం చేశాయని షర్మిల విమర్శించారు. “ఈ రోజు తెలుగు జాతికి చీకటి రోజు” అని పేర్కొన్నారు. “తెలుగు జాతికి నేడు చీకటి రోజు. ఆత్మగౌరవమే అజెండా అని టీడీపీ, పదవుల కన్నా జాతి ప్రయోజనం ముఖ్యమని జనసేన, తెలుగే లెస్స అని చిలక పలుకులు పలికిన వైసీపీ… తెలుగు జాతికి చేసింది నేడు తీరని ద్రోహం. రాజకీయాలకు అతీతంగా, అత్యున్నత పదవికి తెలుగు బిడ్డ పోటీ పడితే, ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేయించిన మూడు పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు.” అని ఆమె నిప్పులు చెరిగారు.
ప్రధాని మోడీకి ఈ మూడు పార్టీల నాయకులు మోకాళ్లు ఒత్తుతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. తెలుగు బిడ్డను ప్రోత్సహించాల్సింది పోయి.. మోడీ చెప్పారని.. ఆర్ఎస్ఎస్ వాదికి ఓటేస్తారా? అని ప్రశ్నించారు. ఇది అత్యంత దారుణం, బాధాకరమని షర్మిల వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో తెలుగు జాతికి జరిగిన ఘోర అవమానంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మూడు పార్టీల నాయకులకు షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇదేసమయంలో వైసీపీ అధినేత జగన్పై మరింత ఘాటుగా విరుచుకుపడ్డారు. సీబీఐ, ఈడీ కేసులకు భయపడి జగన్.. మోడీకి మోకరిల్లాడని అన్నారు.
షర్మిల ప్రశ్నలు ఇవీ..
This post was last modified on September 10, 2025 10:01 am
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…