Political News

ఔను.. మా అబ్బాయి రాజ‌కీయాల్లోకి వ‌స్తాడు: ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కుమారుడు రాజా రెడ్డి రాజ‌కీయ ఎంట్రీపై ఆమె స్పందించారు. త్వ‌ర‌లోనే రాజారెడ్డి రాజ‌కీయాల్లో వ‌స్తాడ‌ని చెప్పారు. క‌డ‌ప జిల్లా నుంచే తాత గారి వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని రాజ‌కీయాల్లోరావాల‌ని రాజా కూడా అనుకుంటున్న‌ట్టు ష‌ర్మిల వ్యాఖ్యానించారు. అయితే.. ఏ నియోజ‌క‌వ‌ర్గం అనే విష‌యంపై ష‌ర్మిల స్పందించ‌లేదు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయాల‌ను రాజా అధ్య‌య‌నం చేస్తున్నాడ‌ని.. త్వ‌ర‌లోనే అవ‌స‌రాన్ని బ‌ట్టి రాజ‌కీయంగా వ‌స్తాడ‌ని మాత్ర‌మే చెప్పారు.

తాజాగా ష‌ర్మిల‌.. క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టించారు. కొన్నాళ్లుగా ఇక్క‌డి రైతులు ఉల్లిపాయ‌ల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. భారీ ఎత్తున దిగుబ‌డులు వ‌చ్చినా.. కొనుగోలు చేసేవారు లేక‌.. ఉల్లి రైతులు నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు. రోజ‌లు త‌ర‌బ‌డి ఉల్లిపాయ‌ల కొనుగోలు కోసం వేచి చూస్తున్నారు. ప్ర‌భుత్వ అధీనంలోని మార్క్ ఫెడ్ 1260 ట‌న్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. అయిన‌ప్ప‌టికీ.. మ‌రో 1000 ట‌న్నుల వ‌ర‌కు మిగిలిపోయాయి. వీటిని కొనుగోలు చేయాల‌ని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రోవైపు ప్ర‌భుత్వం ఉల్లిపాయ‌ల‌కు క్వింటాకు రూ.1200 చొప్పున మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించింది. అయిన ప్ప‌టికీ.. ఎవ‌రూ కొనుగోలు చేయ‌డం లేదు. దీంతో వ్య‌త్యాసాన్ని తాము భ‌రిస్తామ‌ని.. వ్యాపారులు ఎంత‌కైనా కొనుగోలు చేయొచ్చ‌ని పేర్కొంది. అయినా కూడా వ్యాపారుల నుంచి ఆశించిన మేర‌కు స్పంద‌న క‌నిపించ డం లేదు. దీంతో రైతులు తిప్ప‌లు ప‌డుతున్నారు. వీరిని ఊర‌డించేందుకు ష‌ర్మిల క‌ర్నూలులోని ఉల్లిపాయ‌ల మార్కెట్‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా రైతుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.

ఉల్లి రైతుల‌కు.. ప్ర‌భుత్వం అన్యాయం చేస్తోంద‌ని..ఈ ఏడాది దిగుబ‌డి ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని తెలిసినా.. కొనుగోలు కు ఏర్పాట్లు చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌ను రూ.1200 ప్ర‌క‌టించ‌డం దారుణ‌మ‌ని క‌నీసం 3000 చొప్పున నిర్ణ‌యించాల‌ని డిమాండ్ చేశారు. రైతుల‌ను ఆదుకునే వర‌కు కూడా కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున తాము రైతుల‌కు అండ‌గా ఉంటామ‌ని చెప్పారు. ప్ర‌తి పాయ‌ను ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేసేలా ఒత్తిడి పెంచుతామ‌ని అన్నారు. ఈ స‌మ‌యంలోనే రాజారెడ్డి రాజ‌కీయ ఎంట్రీపై కామెంట్స్ చేశారు.

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

58 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

1 hour ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

9 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

10 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

12 hours ago