Political News

మిథున్ రెడ్డి బెయిల్‌.. ఆ ఒక్క‌టే కార‌ణం!

వైసీపీ నాయ‌కుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి బెయిల్ ల‌భించింది. ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే… ప‌లు ష‌ర‌తులు విధించింది. అంతేకాదు.. కేవ‌లం 5 రోజులు మాత్ర‌మే బెయిల్‌పై బ‌య‌ట‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ హ‌యాంలో చోటు చేసుకున్న లిక్క‌ర్ కుంభ‌కోణంలో నిధుల‌ను దారి మ‌ళ్లించ‌డంతోపాటు… కొత్త పాల‌సీ ప్ర‌కారం.. ఎవరు ఎంత మొత్తం క‌మీష‌న్లు ఇవ్వాల‌నే అంశంలో మిథ‌న్ రెడ్డి పాత్ర ఉంద‌ని సిట్ అధికారులు గుర్తించారు.

ఈ క్ర‌మంలోనే నాలుగు సార్లు విచారించిన ద‌రిమిలా.. ఆయ‌న‌ను అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్న మిథున్‌రెడ్డి ఇప్ప‌టికి రెండు సార్లు త‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని అభ్య‌ర్థించారు. అయితే.. కోర్టు ఇవ్వ‌లేదు. తాజాగా ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నెల 9న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఎంపీ లు ఓటు వేయాల్సి ఉంది. ఈ క్ర‌మంలో త‌న‌కు ఉన్న ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని.. ఈ క్ర‌మంలో మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేయాల‌ని మిథున్ రెడ్డి కోర్టులో పిటిష‌న్ వేశారు.

దీనిని విచారించిన కోర్టు తాజాగా శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాత్ర‌మే అనుమతి ఇస్తున్నామ‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది. ఈ మ‌ధ్య కాలంలో ఎవ‌రితోనూ మాట్లాడ‌రాద‌ని.. ముఖ్యంగా కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారిని క‌లుసుకు నేందుకు అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేసింది. సాక్షుల‌ను ప్ర‌భావితం చేయ‌రాద‌ని తేల్చి చెప్పింది. అదేవిధంగా మీడియాతోనూ మాట్లాడ‌కూడ‌ద‌ని ఆంక్ష‌లు విధించింది. ఇత‌ర దేశాల‌కు వెళ్ల‌రాద‌ని, పాస్ పోర్టును పోలీసుల‌కు స్వాధీనం చేయాల‌ని బెయిల్ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

This post was last modified on September 6, 2025 2:02 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

15 minutes ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

1 hour ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

1 hour ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

3 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

4 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago