బీఆర్ఎస్ పై, మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన కవితపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే సస్పెన్షన్ అనంతరం తొలిసారి మీడియాతో మాట్లాడిన కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి హరీష్ రావుతో పాటు తన సోదరుడు కేటీఆర్ ను కూడా కవిత టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు.
పార్టీ ఆఫీసులో కూర్చొని తనపై కుట్ర జరుగుతోందని చెప్పినా కేటీఆర్ స్పందించలేదని కవిత ఆరోపించారు. లేఖ లీక్ కాక ముందు, తాను అమెరికా పర్యటనకు వెళ్లక ముందే ఇదంతా జరిగిందని అన్నారు. 103 రోజుల పాటు తనతో కేటీఆర్ మాట్లాడలేదని అన్నారు. సొంత చెల్లి ఎందుకు బాధపడుతోందని కేటీఆర్ అడగలేదని వాపోయారు. రక్త సంబంధం..అన్నా చెల్లి రిలేషన్ పక్కనపెట్టి చూసినా తాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అని, కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని…పార్టీ పరంగా అయినా తనతో మాట్లాడాల్సిన కేటీఆర్ అలా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ బిడ్డ అయిన తనకే రెస్పాన్స్ రాలేదని, పార్టీలో మిగతా మహిళల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. 5 నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత తాను ప్రజా సమస్యలపై పోరాడానని, వాటిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా కొందరు చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి ఎలా వ్యతిరేక కార్యక్రమాలో చెప్పాలని బీఆర్ఎస్ పెద్దలను నిలదీశారు.
This post was last modified on September 3, 2025 1:00 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…