అదేంటి? అనుకుంటున్నారా? నిజమే. ట్రాఫిక్ రూల్స్ను పాటించకపోతే.. హైదరాబాద్ పోలీసులు ఎవరనే విషయాన్ని పక్కన పెట్టి చెలాన్లు విధిస్తున్నారు. ఈ విషయాన్ని గతంలో సీఎం రేవంత్ రెడ్డే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ప్రజలకు ట్రాఫిక్ పట్ల అవగాహన ఉండాలన్న ఆయన.. ఎవరు తప్పుచేసినా.. జరిమానాలు చెల్లించాల్సిందేనని వ్యాఖ్యానించారు. చివరకు తను తప్పు చేసినా పోలీసులు ఆలోచన చేయాల్సిన అవసరం లేదన్నారు. బహుశ.. ఈ విషయం దృష్టిలో పెట్టుకున్నారో.. ఏమో.. ట్రాఫిక్ పోలీసులు.. సీఎంవోకు.. సుమారు 75 వేల రూపాయల ఫైన్లకు సంబంధించిన చలాన్లను పంపించారు.
సీఎం రేవంత్ రెడ్డి సాధారణంగా.. ఒంటరిగా బయటకు రారు. ఆయన సొంత వాహనంలోనూ తిరగాల్సిన అవసరం లేదు. అయిన ప్పటికీ.. చలాన్లు ఏంటి? అనే ప్రశ్న ఉత్పన్నం కాకుండా ఉండదు. అయినా.. సీఎం రేవంత్ రెడ్డికి చలాన్లు పడ్డాయి. ఎందుకంటే.. ఆయన ప్రయాణించిన కాన్వాయ్ వాహనాలు ‘సీఎం’ పేరుతోనే చలామణి అవుతాయి. వీటిలో మొత్తంగా 11 వాహనాలు ఉంటాయి. ఒక్కొక్కసారి సమయాన్ని బట్టి వీటిని 9, 7కి కూడా తగ్గిస్తారు. ఇది పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ వాహనాలు.. గత ఆరు మాసాల్లో 18 సార్లు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి హైదరాబాద్లో చక్కర్లు కొట్టినట్టు పోలీసులు గుర్తించారు.
వీటికి సంబంధించిన సీసీ కెమెరా కాప్చర్ చేసిన ఫొటోలను నిశితంగా గమనించి.. మరో 20 ఉల్లంఘనలను లైట్ తీసుకుని తీవ్రంగా ఉన్న 18 ఉల్లంఘనలకు మాత్రమే చలాన్లు కట్టాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి ట్రాఫిక్ డీసీపీ పంపించారు. ఈ ఉల్లంఘనల్లో ప్రధానంగా అసలు సీఎం లేకుండానే..కాన్వాయ్ వాహనాలు తిరగడం. ఇలా చేయకూడదు. దీంతో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగింది. ఇక, ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధరాత్రి కూడాఈ వాహనాలు హల్చల్ చేయడం. నిజానికి సీఎం లేనప్పుడే వాహనాలు తిప్పకూడదని ఉంటే.. అర్ధరాత్రి తిప్పడం.. అది కూడా రింగ్ రోడ్డుపై తీసుకురావడం వంటివి సంచలనంగా మారాయి. ఈ క్రమంలో 18 చలాన్లకు సంబంధించి సుమారు 75 వేల రూపాయలు కట్టాలని నోటీసులు ఇచ్చినట్టు సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on September 2, 2025 9:53 pm
రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న రామాయణ దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఆ మధ్య వచ్చిన టీజర్ కు మిశ్రమ…
మనం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ఎవరికీ ఎలాంటిఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా.. జగన్ను కొందరు కలుస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది..?…
ఏపీ రాజధాని విషయంలో వైసీపీ అధినేత జగన్ పక్కా క్లారిటీతోనే ఉన్నారా? అంటే.. ఔననే ఆయన చెబుతున్నారు. ప్రజలు మెచ్చుతారా..…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధమైనా.. విపత్తయినా.. ప్రజలకు ఏం…
ఈ రోజుల్లో ఓ మోస్తరు మార్కెట్ ఉన్న హీరోల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. థియేటర్లకు వచ్చే జనం…
ఇండియన్ క్రికెట్లోనే ఐపీఎల్లో అద్భుతమైన రికార్డులున్న క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. అతడి సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్…