Political News

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం: సీబీఐకి సుగాలి ప్రీతి కేసు

2017లో సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కర్నూలులోని హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ కు ప్రీతి ఉరి వేసుకుని మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రీతి కేసు విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం హామీనిచ్చింది. ఆ మాట ప్రకారమే తాజాగా సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగిస్తామని ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకుంది. సుగాలి ప్రీత కుటుంబానికి న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రీతి తల్లిదండ్రులకు హామీనిచ్చారు. అయితే, సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం వాడుకున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. పవన్ ను కలిసేందుకు తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ సుగాలీ ప్రీతి తల్లి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఆ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ కేసును తానే బయటకు తెచ్చానని, ప్రీతికి న్యాయం చేయాలని పోరాడానని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

This post was last modified on September 2, 2025 8:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

32 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

3 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

3 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago