2017లో సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కర్నూలులోని హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ కు ప్రీతి ఉరి వేసుకుని మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రీతి కేసు విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం హామీనిచ్చింది. ఆ మాట ప్రకారమే తాజాగా సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగిస్తామని ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకుంది. సుగాలి ప్రీత కుటుంబానికి న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రీతి తల్లిదండ్రులకు హామీనిచ్చారు. అయితే, సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం వాడుకున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. పవన్ ను కలిసేందుకు తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ సుగాలీ ప్రీతి తల్లి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఆ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ కేసును తానే బయటకు తెచ్చానని, ప్రీతికి న్యాయం చేయాలని పోరాడానని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
This post was last modified on September 2, 2025 8:13 pm
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…