Political News

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం: సీబీఐకి సుగాలి ప్రీతి కేసు

2017లో సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కర్నూలులోని హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ కు ప్రీతి ఉరి వేసుకుని మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రీతి కేసు విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం హామీనిచ్చింది. ఆ మాట ప్రకారమే తాజాగా సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగిస్తామని ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకుంది. సుగాలి ప్రీత కుటుంబానికి న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రీతి తల్లిదండ్రులకు హామీనిచ్చారు. అయితే, సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం వాడుకున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. పవన్ ను కలిసేందుకు తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ సుగాలీ ప్రీతి తల్లి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఆ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ కేసును తానే బయటకు తెచ్చానని, ప్రీతికి న్యాయం చేయాలని పోరాడానని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

This post was last modified on September 2, 2025 8:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

5 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

7 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

7 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

7 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

9 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

10 hours ago