Political News

చీరలు పంపిస్తా కట్టుకోండి: వైసీపీ నేతల పై మంత్రి కామెంట్స్

వైసీపీ నేతలపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలకు తన సొంత ఖర్చుతో చీరలు పంపిస్తానని, వాటిని కట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో 16 వేల బస్సులు ఉంటే కేవలం 4 వేల బస్సుల్లోనే ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం అనుమతి ఇస్తోందని వైసీపీ నాయకులు ఆరోపించారు. అదేసమయంలో మహిళలకు బస్సులు సరిపోక సీట్లు లభించక ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు.

గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు ఆర్టీసీ ఉచిత బస్సులపై కామెంట్లు చేస్తున్నారు. మహిళలకు ఉచితం లేదని, కొందరికి మాత్రమే వర్తింప చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లను తాజాగా ప్రస్తావించిన ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి ప్రాంతంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను ఉచిత బస్సు ప్రయాణంపై ఆరాతీశారు. వారు అంతా బాగానే ఉందని సమాధానం చెప్పారు. ఈ పథకాన్ని ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. అనంతరం మంత్రి వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ప్రస్తావించారు.

రాష్ట్రంలో ప్రజలు బాగానే ఉన్నారని, కానీ అధికారం పోయిందన్న బాధ వైసీపీని వీడడం లేదని అన్నారు. అందుకే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు.

ఒకవేళ ప్రభుత్వం ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయడం లేదని వైసీపీ నాయకులు భావిస్తే,
“నేను చీరలు పంపిస్తా. నేనే కొంటా. ఎంత మంది ఉన్నారో లెక్క చెప్పండి. అన్ని చీరలు నేనే పంపిస్తా. వాటిని కట్టుకుని బస్సులు ఎక్కండి. అప్పుడు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారో లేదో తెలుస్తుంది” అని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on September 1, 2025 9:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

43 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago