తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వ్యవహారం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితి కోటా వంటి అంశాలపై గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఆ విషయాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవో విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంచాయతీల్లో రిజర్వేషన్ 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ జీవో విడుదల చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు సెప్టెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్న తీర్మానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
దాంతోపాటు, ఇటీవల భారీగా కురిసిన వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకునే అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నారని తెలుస్తోంది. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థిక సాయం కోరే తీర్మానికీ ఆమోద ముద్ర లభించే అవకాశముంది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, టీమిండియా మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ల పేర్లను ఖరారు చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత జీవో ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయంపై బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…