Political News

బీసీల రిజర్వేషన్లపై రేవంత్ సంచలన నిర్ణయం

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వ్యవహారం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితి కోటా వంటి అంశాలపై గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఆ విషయాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవో విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంచాయతీల్లో రిజర్వేషన్ 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ జీవో విడుదల చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు సెప్టెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్న తీర్మానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

దాంతోపాటు, ఇటీవల భారీగా కురిసిన వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకునే అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నారని తెలుస్తోంది. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థిక సాయం కోరే తీర్మానికీ ఆమోద ముద్ర లభించే అవకాశముంది.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, టీమిండియా మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ల పేర్లను ఖరారు చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత జీవో ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయంపై బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on August 30, 2025 3:12 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago