Political News

బీసీల రిజర్వేషన్లపై రేవంత్ సంచలన నిర్ణయం

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వ్యవహారం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితి కోటా వంటి అంశాలపై గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఆ విషయాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవో విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంచాయతీల్లో రిజర్వేషన్ 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ జీవో విడుదల చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు సెప్టెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్న తీర్మానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

దాంతోపాటు, ఇటీవల భారీగా కురిసిన వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకునే అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నారని తెలుస్తోంది. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థిక సాయం కోరే తీర్మానికీ ఆమోద ముద్ర లభించే అవకాశముంది.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, టీమిండియా మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ల పేర్లను ఖరారు చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత జీవో ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయంపై బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on August 30, 2025 3:12 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

18 minutes ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

1 hour ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

2 hours ago

కొట్లాట కొత్త కాదు రేవంత్ చెబితే రాజీనామా దానం కీలక కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…

3 hours ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

3 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

3 hours ago