తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు, ఇదే పాలక మండలి మాజీ చైర్మన్, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిల మధ్య వాదప్రతివాదాలు తారస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణల వరకు వివాదం ముదిరింది. తిరుపతి నుంచి భూమనను తరిమికొట్టాలని బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై భూమన తీవ్రంగా స్పందించారు. ఎవరిని ఎవరు తరిమికొడతారో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు.
తిరుమల పవిత్రతను కాపాడాలని తాను వినతిచేసినా తనపై అపవాదులు మోపుతున్నారని భూమన అన్నారు. తిరుమలను ఆనుకుని ఉన్న భూములను పర్యాటక శాఖకు ఇవ్వడాన్ని తాను ఆది నుంచి తప్పుబట్టానని, ఇప్పటికీ అదే ప్రశ్న అడుగుతున్నానని స్పష్టం చేశారు. పవిత్ర కార్యాలయాలకే పరిమితం కావాల్సిన శ్రీవారి భూములను పర్యాటకం పేరుతో తాగి తందనాలాడేందుకు రిసార్టులకు కేటాయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనికి నాయుడు సమాధానం చెప్పాలన్నారు.
అయితే అసలు ఆ ప్రతిపాదన వైసీపీ హయాంలోనే వచ్చిందని, ప్రస్తుతం కాదని బీఆర్ నాయుడు తెలిపారు. తాము తిరుమల పవిత్రతను కాపాడే క్రమంలో ఆయా భూములను కాకుండా దూరంలోని వేరే భూములను కేటాయిస్తున్నామని చెప్పారు. మరోవైపు నాయుడు తమను బెదిరిస్తున్నారని, తిరుపతి నుంచి తరిమికొడతామన్నారని భూమన ఆరోపించారు. కానీ ఎవరిని ఎవరు తరిమికొడతారో ప్రజలే తేలుస్తారని, అది ఎవరి చేతుల్లో లేదని అన్నారు.
ఇక నాయుడు చైర్మన్ గిరిపై కూడా భూమన తీవ్ర విమర్శలు చేశారు. “క్విడ్ ప్రో కో” కింద బీఆర్ నాయుడికి తిరుమల పాలక మండలి చైర్మన్ పదవి వచ్చిందని భూమన వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ ఇచ్చిన నాయుడు అలాగని నిరూపిస్తే ఇప్పుడే తాను పదవి నుంచి తప్పుకుంటానని అన్నారు. దీనిని నిరూపించాలా లేదా క్షమాపణ చెప్పాలా అని భూమనను నాయుడు డిమాండ్ చేశారు. మొత్తానికి నాయుడు వర్సెస్ రెడ్డి నేతల మధ్య వివాదాలు ముసురుకున్నాయి. ఇవి ఎంత దూరం వెళ్తాయో చూడాలి.
This post was last modified on August 29, 2025 10:46 pm
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…