తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు, ఇదే పాలక మండలి మాజీ చైర్మన్, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిల మధ్య వాదప్రతివాదాలు తారస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణల వరకు వివాదం ముదిరింది. తిరుపతి నుంచి భూమనను తరిమికొట్టాలని బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై భూమన తీవ్రంగా స్పందించారు. ఎవరిని ఎవరు తరిమికొడతారో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు.
తిరుమల పవిత్రతను కాపాడాలని తాను వినతిచేసినా తనపై అపవాదులు మోపుతున్నారని భూమన అన్నారు. తిరుమలను ఆనుకుని ఉన్న భూములను పర్యాటక శాఖకు ఇవ్వడాన్ని తాను ఆది నుంచి తప్పుబట్టానని, ఇప్పటికీ అదే ప్రశ్న అడుగుతున్నానని స్పష్టం చేశారు. పవిత్ర కార్యాలయాలకే పరిమితం కావాల్సిన శ్రీవారి భూములను పర్యాటకం పేరుతో తాగి తందనాలాడేందుకు రిసార్టులకు కేటాయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనికి నాయుడు సమాధానం చెప్పాలన్నారు.
అయితే అసలు ఆ ప్రతిపాదన వైసీపీ హయాంలోనే వచ్చిందని, ప్రస్తుతం కాదని బీఆర్ నాయుడు తెలిపారు. తాము తిరుమల పవిత్రతను కాపాడే క్రమంలో ఆయా భూములను కాకుండా దూరంలోని వేరే భూములను కేటాయిస్తున్నామని చెప్పారు. మరోవైపు నాయుడు తమను బెదిరిస్తున్నారని, తిరుపతి నుంచి తరిమికొడతామన్నారని భూమన ఆరోపించారు. కానీ ఎవరిని ఎవరు తరిమికొడతారో ప్రజలే తేలుస్తారని, అది ఎవరి చేతుల్లో లేదని అన్నారు.
ఇక నాయుడు చైర్మన్ గిరిపై కూడా భూమన తీవ్ర విమర్శలు చేశారు. “క్విడ్ ప్రో కో” కింద బీఆర్ నాయుడికి తిరుమల పాలక మండలి చైర్మన్ పదవి వచ్చిందని భూమన వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ ఇచ్చిన నాయుడు అలాగని నిరూపిస్తే ఇప్పుడే తాను పదవి నుంచి తప్పుకుంటానని అన్నారు. దీనిని నిరూపించాలా లేదా క్షమాపణ చెప్పాలా అని భూమనను నాయుడు డిమాండ్ చేశారు. మొత్తానికి నాయుడు వర్సెస్ రెడ్డి నేతల మధ్య వివాదాలు ముసురుకున్నాయి. ఇవి ఎంత దూరం వెళ్తాయో చూడాలి.
This post was last modified on August 29, 2025 10:46 pm
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…
రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీని కంటే ముందు ఆయన మొదలుపెట్టిన…
తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…
ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…