Political News

నాయుడు వర్సెస్ రెడ్డి: తిరుమల హాట్ టాపిక్

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు, ఇదే పాలక మండలి మాజీ చైర్మన్, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిల మధ్య వాదప్రతివాదాలు తారస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణల వరకు వివాదం ముదిరింది. తిరుపతి నుంచి భూమనను తరిమికొట్టాలని బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై భూమన తీవ్రంగా స్పందించారు. ఎవ‌రిని ఎవరు తరిమికొడతారో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు.

తిరుమల పవిత్రతను కాపాడాలని తాను వినతిచేసినా తనపై అపవాదులు మోపుతున్నారని భూమన అన్నారు. తిరుమలను ఆనుకుని ఉన్న భూములను పర్యాటక శాఖకు ఇవ్వడాన్ని తాను ఆది నుంచి తప్పుబట్టానని, ఇప్పటికీ అదే ప్రశ్న అడుగుతున్నానని స్పష్టం చేశారు. పవిత్ర కార్యాలయాలకే పరిమితం కావాల్సిన శ్రీవారి భూములను పర్యాటకం పేరుతో తాగి తందనాలాడేందుకు రిసార్టులకు కేటాయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనికి నాయుడు సమాధానం చెప్పాలన్నారు.

అయితే అసలు ఆ ప్రతిపాదన వైసీపీ హయాంలోనే వచ్చిందని, ప్రస్తుతం కాదని బీఆర్ నాయుడు తెలిపారు. తాము తిరుమల పవిత్రతను కాపాడే క్రమంలో ఆయా భూములను కాకుండా దూరంలోని వేరే భూములను కేటాయిస్తున్నామని చెప్పారు. మరోవైపు నాయుడు తమను బెదిరిస్తున్నారని, తిరుపతి నుంచి తరిమికొడతామన్నారని భూమన ఆరోపించారు. కానీ ఎవ‌రిని ఎవరు తరిమికొడతారో ప్రజలే తేలుస్తారని, అది ఎవరి చేతుల్లో లేదని అన్నారు.

ఇక నాయుడు చైర్మన్ గిరిపై కూడా భూమన తీవ్ర విమర్శలు చేశారు. “క్విడ్ ప్రో కో” కింద బీఆర్ నాయుడికి తిరుమల పాలక మండలి చైర్మన్ పదవి వచ్చిందని భూమన వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ ఇచ్చిన నాయుడు అలాగని నిరూపిస్తే ఇప్పుడే తాను పదవి నుంచి తప్పుకుంటానని అన్నారు. దీనిని నిరూపించాలా లేదా క్షమాపణ చెప్పాలా అని భూమనను నాయుడు డిమాండ్ చేశారు. మొత్తానికి నాయుడు వర్సెస్ రెడ్డి నేతల మధ్య వివాదాలు ముసురుకున్నాయి. ఇవి ఎంత దూరం వెళ్తాయో చూడాలి.


Satya

Recent Posts

సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…

1 hour ago

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

5 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

6 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

8 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

9 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

10 hours ago