Political News

కుప్పం.. ఇక నెంబర్ 1 నియోజకవర్గమే..!

ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం ఇక నెంబర్ 1 స్థానంలోకి వెళ్తుందా? ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి తిరుగులేదా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో చంద్రబాబు వరుసగా 7వ సారి విజయం సాధించిన తర్వాత ఇక్కడి పరిస్థితులు, పరిణామాలు కూడా మారుతున్నాయి. ఎన్నికలకు ముందు ఎలా ఉన్నా, ఇప్పుడు మాత్రం ఈ 15 మాసాల్లో నియోజకవర్గంలో సమూలమైన మార్పులు వచ్చాయి.

వైసీపీ చేసిన విమర్శలకు, ఇక్కడ పాగా వేయాలన్న ఆ పార్టీ వ్యూహాలకు చంద్రబాబు సహా ఆయన సతీమణి చెక్ పెట్టారు. గత ఎన్నికల సమయంలో నారా భువనేశ్వరి కూడా ఇక్కడ పర్యటించారు. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. వరుస విజయాల అనంతరం చంద్రబాబు కీలకమైన సూర్యఘర్ పథకం ను తన నియోజకవర్గంలోనే ప్రారంభించారు. పలు మండలాల్లో పూర్తిగా సూర్యఘర్ ను అమల్లోకి తెచ్చి విద్యుత్ చార్జీల బెడద నుంచి ప్రజలను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఇంటికో ఆదాయ వనరును కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుని చేతివృత్తులను ప్రోత్సహిస్తున్నారు. కుట్టు మిషన్లతో పాటు కంప్యూటర్లను కూడా రుణాలపై ఇప్పిస్తున్నారు. విద్యను ప్రోత్సహిస్తున్నారు.

తాజాగా కుప్పంలో రెండు పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు. ఈ రెండు పరిశ్రమలతో 8 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు నియోజకవర్గానికి రానున్నాయి. దీంతో పాటు సుమారు 5 వేల మంది స్థానికులకు ఉపాధి లభించనుంది. ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి.

తాజాగా ఈ పరిశ్రమలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిలో పండ్ల గుజ్జు (పల్ప్ ఇండస్ట్రీ) పరిశ్రమను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా చిత్తూరులో ప్రధాన సమస్యగా ఇటీవలి కాలంలో తెరమీదకు వచ్చిన మామిడి కాయల వ్యవహారం భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు జిల్లా మొత్తానికి కూడా నియోజకవర్గం కేంద్రంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇలా ప్రతి విషయంలోనూ కుప్పం నియోజకవర్గంలో పనులు వేగంగా సాగుతున్నాయి. రహదారుల నిర్మాణం, ఇటీవ‌లే కుప్పానికి నీరు ఇవ్వడం వంటివి నియోజకవర్గాన్ని నెంబర్ 1గా మారుస్తున్నాయని టీడీపీ నాయకులు అంటున్నారు.

Satya

Recent Posts

దెయ్యాలంటే మనోళ్లకు ప్రేమ ఎక్కువే

ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…

13 minutes ago

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…

48 minutes ago

అఖిల్ ఈసారి ఆ తప్పు చేయకూడదు

అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…

2 hours ago

తారక్ సినిమా లక్ష్యాలు చాలా పెద్దవి

ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…

3 hours ago

వెయ్యి కోట్ల దురంధర్… అక్కడేమో డిజాస్టర్

పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…

3 hours ago

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

5 hours ago