Political News

ఇదేం పద్ధతి: భూమన పై జగన్ ఫైర్..!

వైసీపీ సీనియర్ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను పదజాలంతో దూషించడంతో పాటు అవినీతి, అక్రమాలు, వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ రెచ్చిపోయారు. ఆయన ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్నది పార్టీలో చర్చగా మారగా, వైసీపీ అధినేత జగన్ భూమనను హెచ్చరించారన్నది పార్టీ వర్గాల మాట.

సీనియర్ అధికారి శ్రీలక్ష్మి, వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో గనుల శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే కర్ణాటకకు చెందిన గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం గనులకు అనుమతులు ఇచ్చారన్నది ఆమెపై ఉన్న ఆరోపణ. దీంతో సిబిఐ, ఈడి అధికారులు కూడా ఆమెపై కేసులు నమోదు చేశారు. వైసీపీ హయంలో ఆమెను తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చి, పురపాలక శాఖ వంటి కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉన్న శ్రీలక్ష్మిపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.

టీడీఆర్ బాండ్ల విషయంలో అవినీతి జరిగినట్టుగా శ్రీలక్ష్మి టిడిపి నాయకులకు సమాచారం అందిస్తున్నారన్నది భూమన ఆగ్రహానికి ప్రధాన కారణం. కానీ అవినీతి జరిగితే ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. తప్పు చేయకపోతే నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని పట్టుకుని భూమన తీవ్ర వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత దూషణలు చేయడం, బాడీ షేమింగ్ చేయడం తీవ్ర పరిణామాలుగా మారాయి.

దీనిని జగన్ సీరియస్‌గా తీసుకుని భూమనను వివరణ కోరినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మహిళా ఓటు బ్యాంకును కూటమి ప్రభుత్వం ఆకర్షిస్తున్న సమయంలో పార్టీ తరఫున ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నది జగన్ ప్రశ్నించినట్టు తెలిసింది. ముఖ్యంగా తన తండ్రి హయాంలోనూ, తన హయాంలోనూ కీలక అధికారిగా పనిచేసిన శ్రీలక్ష్మిపై దారుణంగా వ్యాఖ్యానించడాన్ని జగన్ తీవ్రంగా తప్పుపట్టినట్టు సమాచారం. దీనికి భూమన ఏ విధంగా సమాధానం ఇస్తారో చూడాలి.

This post was last modified on August 29, 2025 2:43 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

50 minutes ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago