Political News

తెలంగాణ స‌భా స‌మ‌రం ముహూర్తం రెడీ..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం పెట్టారు. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా స్పీకర్ ప్రసాదరావు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలను చర్చించాలనే విషయంపై సమావేశాలు ప్రారంభమైన రెండో రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీనికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు.

సమరం ఖాయం!

వర్షాకాల సమావేశాల విషయానికి వస్తే అధికార పక్షం, విపక్షం బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం తప్పదని స్పష్టంగా కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పినాకి చంద్రఘోష్ ఇచ్చిన నివేదికను సభలో ప్రవేశపెట్టి దీనిపై చర్చించి మాజీ సీఎం కేసీఆర్ పాలన బాగోతాన్ని తెలంగాణ సమాజానికి వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు. దీనిపై ఖచ్చితంగా బీఆర్‌ఎస్ అడ్డుతగలడంతోపాటు ఇటీవలి పరిణామాలను కూడా ప్రస్తావించనుంది. దీంతో సభ వాడివేడి చర్చలకు వేదిక కానుంది.

ఇక బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ సారైనా సభకు వస్తారా, రారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. గతంలో ఒక్కసారి మాత్రమే ఆయన సభకు వచ్చారు. అది కూడా బడ్జెట్ సమావేశాల సమయంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ 20 నెలల కాలంలో ఒక్కసారి కూడా సభకు రాలేదు. అనేకసార్లు సీఎం రేవంత్ రెడ్డి సహా స్పీకర్ ప్రసాదరావులు వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ రావాలని విన్నవించారు. అంతేకాక బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు సవాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో ఈ దఫా కేసీఆర్ వస్తారా, రారా అనేది చూడాలి.

మరోవైపు బీఆర్‌ఎస్ కూడా తమ పార్టీ తరఫున విజయం సాధించి కాంగ్రెస్‌లో చేరిపోయిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న పట్టుదలతో ఉంది. దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు కూడా స్పీకర్‌కు గడువు విధించింది. ఈ క్రమంలో ఆయన ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిణామాల క్ర‌మంలో మరోసారి ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ సభలో లేవనెత్తడం ఖాయమని తెలుస్తోంది.

తద్వారా ఇరుపక్షాల మధ్య వాడివేడి మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా హైడ్రా, హైదరాబాద్‌లో జరుగుతున్న హత్యలు, దొంగతనాలు వంటి అంశాలు కూడా బీఆర్‌ఎస్‌కు ఆయుధాలుగా మారనున్నాయి.

This post was last modified on August 28, 2025 12:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

29 minutes ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

1 hour ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

2 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

4 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

4 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

5 hours ago