Political News

తెలంగాణ స‌భా స‌మ‌రం ముహూర్తం రెడీ..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం పెట్టారు. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా స్పీకర్ ప్రసాదరావు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలను చర్చించాలనే విషయంపై సమావేశాలు ప్రారంభమైన రెండో రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీనికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు.

సమరం ఖాయం!

వర్షాకాల సమావేశాల విషయానికి వస్తే అధికార పక్షం, విపక్షం బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం తప్పదని స్పష్టంగా కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పినాకి చంద్రఘోష్ ఇచ్చిన నివేదికను సభలో ప్రవేశపెట్టి దీనిపై చర్చించి మాజీ సీఎం కేసీఆర్ పాలన బాగోతాన్ని తెలంగాణ సమాజానికి వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు. దీనిపై ఖచ్చితంగా బీఆర్‌ఎస్ అడ్డుతగలడంతోపాటు ఇటీవలి పరిణామాలను కూడా ప్రస్తావించనుంది. దీంతో సభ వాడివేడి చర్చలకు వేదిక కానుంది.

ఇక బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ సారైనా సభకు వస్తారా, రారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. గతంలో ఒక్కసారి మాత్రమే ఆయన సభకు వచ్చారు. అది కూడా బడ్జెట్ సమావేశాల సమయంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ 20 నెలల కాలంలో ఒక్కసారి కూడా సభకు రాలేదు. అనేకసార్లు సీఎం రేవంత్ రెడ్డి సహా స్పీకర్ ప్రసాదరావులు వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ రావాలని విన్నవించారు. అంతేకాక బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు సవాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో ఈ దఫా కేసీఆర్ వస్తారా, రారా అనేది చూడాలి.

మరోవైపు బీఆర్‌ఎస్ కూడా తమ పార్టీ తరఫున విజయం సాధించి కాంగ్రెస్‌లో చేరిపోయిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న పట్టుదలతో ఉంది. దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు కూడా స్పీకర్‌కు గడువు విధించింది. ఈ క్రమంలో ఆయన ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిణామాల క్ర‌మంలో మరోసారి ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ సభలో లేవనెత్తడం ఖాయమని తెలుస్తోంది.

తద్వారా ఇరుపక్షాల మధ్య వాడివేడి మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా హైడ్రా, హైదరాబాద్‌లో జరుగుతున్న హత్యలు, దొంగతనాలు వంటి అంశాలు కూడా బీఆర్‌ఎస్‌కు ఆయుధాలుగా మారనున్నాయి.

This post was last modified on August 28, 2025 12:37 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

2 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

4 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

4 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

4 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

6 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

9 hours ago