వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తొలిసారి వినాయక చవితి పూజలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏటా గణపతి ఉత్సవాలు నిర్వహించినా, దానికి ఆయన కడుదూరంగా ఉంటారు. గత ఏడాది కూడా వైవీ సుబ్బారెడ్డి సహా కొందరు పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొనగా, జగన్ మాత్రం వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉన్నారు.
కానీ, ఈసారి మాత్రం ఆయనే నేరుగా ఈ పూజల్లో పాల్గొనడం, స్వామివారి కథ వినడం, చివరన ప్రసాదం కూడా తినడం ఆశ్చర్యంగా అనిపిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఏం జరిగింది?
వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వరసిద్ధ వినాయకుని ఆశీర్వచనాలు పొంది ప్రసాదం స్వీకరించారు. ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు లభించేలా ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు ఈ సందర్బంగా జగన్ పేర్కొన్నారు. ప్రజలందరికీ ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు.
స్వామి సలహాయేనా?
మరోవైపు, జగన్ ఇలా వినాయక చవితి వేడుకల్లో పాల్గొని పూజలు చేయడం వెనుక ఆయన మనసుకు నచ్చిన విశాఖకు చెందిన పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఉండి ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పార్టీ పరిస్థితితోపాటు వ్యక్తిగతంగా కూడా జగన్ ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారని అంటున్నారు.
వాస్తవానికి ఆది నుంచి క్రిస్టియానిటీలో ఉన్న జగన్ ఎప్పుడూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తాము చూడలేదని సీనియర్లు చెబుతున్నారు. కేవలం ఓ సందేశం ఇచ్చి ఊరుకుంటారని, కానీ ఈ దఫా మాత్రం ఆయన నేరుగా పూజల్లో పాల్గొన్నారని తెలిపారు. కాగా జగన్ సతీమణి భారతి మాత్రం ఈ పూజలకు దూరంగా ఉన్నారు.
This post was last modified on August 27, 2025 4:35 pm
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…