వైసీపీలో కొంతమంది నాయకుల పరిస్థితి తీవ్ర ఇబ్బందిగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు వారు వ్యవహరించిన తీరు కావచ్చు, వారి నోటి దురుసు కావచ్చు.. కారణాలు ఏవైనా మరో మూడు సంవత్సరాల వరకు వారు బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కొంతమంది నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలపై వ్యక్తిగత దూషణలకు దిగడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, అదేవిధంగా బూతులతో విరుచుకుపడడం వంటివి తెలిసిందే. తద్వారా వారు సాధించింది ఏమీ లేకపోగా వ్యక్తిగతంగా వారి పరువును కూడా పోగొట్టుకున్నారు.
ఇలాంటి వారిలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గుడివాడ అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని, నెల్లూరు సిటీ అప్పటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు కీలకంగా నిలిచారు. వీరు నోరు విప్పితే టిడిపి నేతలపైన, జనసేన నాయకులపైన విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆయా పార్టీల అధినేతలు, ద్వితీయశ్రేణి కీలక నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బూతులతో విరుచుకుపడ్డారు. ఫలితంగా వారిపై తీవ్ర విమర్శలు వచ్చినా మార్పు అయితే కనిపించలేదు. ఇది చివరకు ఎన్నికల్లో ఓటమికి కూడా దారితీసింది.
ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అనేది చూసుకుంటే.. పార్టీ ఓటమిపాలైన ఏడాదిన్నర తర్వాత కూడా ఇప్పటివరకు ఈ నాయకులు ఎవరు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. పార్టీ తరపున గళం వినిపించింది కూడా లేదు. ఇటీవల కాలంలో అనిల్ కుమార్ కొంతమేరకు మాట్లాడినప్పటికీ ఆయన మీద కూడా గనుల కేసు నమోదయింది. దీంతో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఎలాంటి కేసులు ఇప్పటివరకు నమోదు కాకపోయినా బియ్యం అక్రమ రవాణా కేసులు మాత్రం ఎదురుచూస్తున్నాయి. ఇక కొడాలి నాని విషయంలో కేసుల పరంపరకు లెక్కే లేకుండా పోయింది.
కానీ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నాయకులంతా ఇప్పట్లో మీడియా ముందుకు వచ్చే పరిస్థితి కానీ ప్రజల్లోకి వచ్చే పరిస్థితి కానీ కనిపించకపోవడం, మరో మూడేళ్లపాటు పరిస్థితి ఇలాగే ఉండడం వంటివి స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిని పార్టీ కూడా ఎటువంటి బలవంతం చేయడం లేదు. మీరు ప్రజల్లోకి రండి, పార్టీ తరఫున వాయిస్ వినిపించండి అని పార్టీ అధినేత కూడా ఎక్కడా చెప్పకపోవడం మరో విషయం. ఏదేమైనా ఫైర్ బ్రాండ్లుగా చలామణి అయిన వారు వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రంగా మారడం, వివాదాలకు కేంద్రంగా మారడంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నది వాస్తవం.
This post was last modified on August 26, 2025 9:54 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…