Political News

వైసీపీ ఫైర్ బ్రాండ్లు.. మ‌రో మూడేళ్లు ఇంతే..!

వైసీపీలో కొంతమంది నాయకుల పరిస్థితి తీవ్ర ఇబ్బందిగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు వారు వ్యవహరించిన తీరు కావచ్చు, వారి నోటి దురుసు కావచ్చు.. కారణాలు ఏవైనా మరో మూడు సంవత్సరాల వరకు వారు బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కొంతమంది నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలపై వ్యక్తిగత దూష‌ణ‌లకు దిగడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, అదేవిధంగా బూతులతో విరుచుకుప‌డ‌డం వంటివి తెలిసిందే. తద్వారా వారు సాధించింది ఏమీ లేకపోగా వ్యక్తిగతంగా వారి పరువును కూడా పోగొట్టుకున్నారు.

ఇలాంటి వారిలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గుడివాడ అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని, నెల్లూరు సిటీ అప్పటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు కీలకంగా నిలిచారు. వీరు నోరు విప్పితే టిడిపి నేతలపైన, జనసేన నాయకులపైన విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆయా పార్టీల అధినేతలు, ద్వితీయశ్రేణి కీలక నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బూతులతో విరుచుకుపడ్డారు. ఫలితంగా వారిపై తీవ్ర విమర్శలు వ‌చ్చినా మార్పు అయితే కనిపించలేదు. ఇది చివరకు ఎన్నికల్లో ఓటమికి కూడా దారితీసింది.

ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అనేది చూసుకుంటే.. పార్టీ ఓటమిపాలైన ఏడాదిన్నర తర్వాత కూడా ఇప్పటివరకు ఈ నాయకులు ఎవరు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. పార్టీ తరపున గళం వినిపించింది కూడా లేదు. ఇటీవల కాలంలో అనిల్ కుమార్ కొంతమేరకు మాట్లాడినప్పటికీ ఆయన మీద కూడా గనుల కేసు నమోదయింది. దీంతో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఎలాంటి కేసులు ఇప్పటివరకు నమోదు కాకపోయినా బియ్యం అక్రమ రవాణా కేసులు మాత్రం ఎదురుచూస్తున్నాయి. ఇక కొడాలి నాని విషయంలో కేసుల పరంపరకు లెక్కే లేకుండా పోయింది.

కానీ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నాయకులంతా ఇప్పట్లో మీడియా ముందుకు వచ్చే పరిస్థితి కానీ ప్రజల్లోకి వచ్చే పరిస్థితి కానీ కనిపించకపోవడం, మరో మూడేళ్లపాటు పరిస్థితి ఇలాగే ఉండడం వంటివి స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిని పార్టీ కూడా ఎటువంటి బలవంతం చేయడం లేదు. మీరు ప్రజల్లోకి రండి, పార్టీ తరఫున వాయిస్ వినిపించండి అని పార్టీ అధినేత కూడా ఎక్కడా చెప్పకపోవడం మరో విషయం. ఏదేమైనా ఫైర్ బ్రాండ్లుగా చలామణి అయిన వారు వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రంగా మారడం, వివాదాలకు కేంద్రంగా మారడంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నది వాస్తవం.

This post was last modified on August 26, 2025 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

19 minutes ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

1 hour ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

2 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

4 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

4 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

5 hours ago