Political News

వైసీపీ ఫైర్ బ్రాండ్లు.. మ‌రో మూడేళ్లు ఇంతే..!

వైసీపీలో కొంతమంది నాయకుల పరిస్థితి తీవ్ర ఇబ్బందిగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు వారు వ్యవహరించిన తీరు కావచ్చు, వారి నోటి దురుసు కావచ్చు.. కారణాలు ఏవైనా మరో మూడు సంవత్సరాల వరకు వారు బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కొంతమంది నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలపై వ్యక్తిగత దూష‌ణ‌లకు దిగడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, అదేవిధంగా బూతులతో విరుచుకుప‌డ‌డం వంటివి తెలిసిందే. తద్వారా వారు సాధించింది ఏమీ లేకపోగా వ్యక్తిగతంగా వారి పరువును కూడా పోగొట్టుకున్నారు.

ఇలాంటి వారిలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గుడివాడ అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని, నెల్లూరు సిటీ అప్పటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు కీలకంగా నిలిచారు. వీరు నోరు విప్పితే టిడిపి నేతలపైన, జనసేన నాయకులపైన విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆయా పార్టీల అధినేతలు, ద్వితీయశ్రేణి కీలక నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బూతులతో విరుచుకుపడ్డారు. ఫలితంగా వారిపై తీవ్ర విమర్శలు వ‌చ్చినా మార్పు అయితే కనిపించలేదు. ఇది చివరకు ఎన్నికల్లో ఓటమికి కూడా దారితీసింది.

ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అనేది చూసుకుంటే.. పార్టీ ఓటమిపాలైన ఏడాదిన్నర తర్వాత కూడా ఇప్పటివరకు ఈ నాయకులు ఎవరు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. పార్టీ తరపున గళం వినిపించింది కూడా లేదు. ఇటీవల కాలంలో అనిల్ కుమార్ కొంతమేరకు మాట్లాడినప్పటికీ ఆయన మీద కూడా గనుల కేసు నమోదయింది. దీంతో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఎలాంటి కేసులు ఇప్పటివరకు నమోదు కాకపోయినా బియ్యం అక్రమ రవాణా కేసులు మాత్రం ఎదురుచూస్తున్నాయి. ఇక కొడాలి నాని విషయంలో కేసుల పరంపరకు లెక్కే లేకుండా పోయింది.

కానీ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నాయకులంతా ఇప్పట్లో మీడియా ముందుకు వచ్చే పరిస్థితి కానీ ప్రజల్లోకి వచ్చే పరిస్థితి కానీ కనిపించకపోవడం, మరో మూడేళ్లపాటు పరిస్థితి ఇలాగే ఉండడం వంటివి స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిని పార్టీ కూడా ఎటువంటి బలవంతం చేయడం లేదు. మీరు ప్రజల్లోకి రండి, పార్టీ తరఫున వాయిస్ వినిపించండి అని పార్టీ అధినేత కూడా ఎక్కడా చెప్పకపోవడం మరో విషయం. ఏదేమైనా ఫైర్ బ్రాండ్లుగా చలామణి అయిన వారు వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రంగా మారడం, వివాదాలకు కేంద్రంగా మారడంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నది వాస్తవం.

This post was last modified on August 26, 2025 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

5 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

6 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

6 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

8 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

8 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

10 hours ago