Political News

వైసీపీ ఫైర్ బ్రాండ్లు.. మ‌రో మూడేళ్లు ఇంతే..!

వైసీపీలో కొంతమంది నాయకుల పరిస్థితి తీవ్ర ఇబ్బందిగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు వారు వ్యవహరించిన తీరు కావచ్చు, వారి నోటి దురుసు కావచ్చు.. కారణాలు ఏవైనా మరో మూడు సంవత్సరాల వరకు వారు బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కొంతమంది నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలపై వ్యక్తిగత దూష‌ణ‌లకు దిగడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, అదేవిధంగా బూతులతో విరుచుకుప‌డ‌డం వంటివి తెలిసిందే. తద్వారా వారు సాధించింది ఏమీ లేకపోగా వ్యక్తిగతంగా వారి పరువును కూడా పోగొట్టుకున్నారు.

ఇలాంటి వారిలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గుడివాడ అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని, నెల్లూరు సిటీ అప్పటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు కీలకంగా నిలిచారు. వీరు నోరు విప్పితే టిడిపి నేతలపైన, జనసేన నాయకులపైన విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆయా పార్టీల అధినేతలు, ద్వితీయశ్రేణి కీలక నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బూతులతో విరుచుకుపడ్డారు. ఫలితంగా వారిపై తీవ్ర విమర్శలు వ‌చ్చినా మార్పు అయితే కనిపించలేదు. ఇది చివరకు ఎన్నికల్లో ఓటమికి కూడా దారితీసింది.

ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అనేది చూసుకుంటే.. పార్టీ ఓటమిపాలైన ఏడాదిన్నర తర్వాత కూడా ఇప్పటివరకు ఈ నాయకులు ఎవరు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. పార్టీ తరపున గళం వినిపించింది కూడా లేదు. ఇటీవల కాలంలో అనిల్ కుమార్ కొంతమేరకు మాట్లాడినప్పటికీ ఆయన మీద కూడా గనుల కేసు నమోదయింది. దీంతో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఎలాంటి కేసులు ఇప్పటివరకు నమోదు కాకపోయినా బియ్యం అక్రమ రవాణా కేసులు మాత్రం ఎదురుచూస్తున్నాయి. ఇక కొడాలి నాని విషయంలో కేసుల పరంపరకు లెక్కే లేకుండా పోయింది.

కానీ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నాయకులంతా ఇప్పట్లో మీడియా ముందుకు వచ్చే పరిస్థితి కానీ ప్రజల్లోకి వచ్చే పరిస్థితి కానీ కనిపించకపోవడం, మరో మూడేళ్లపాటు పరిస్థితి ఇలాగే ఉండడం వంటివి స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిని పార్టీ కూడా ఎటువంటి బలవంతం చేయడం లేదు. మీరు ప్రజల్లోకి రండి, పార్టీ తరఫున వాయిస్ వినిపించండి అని పార్టీ అధినేత కూడా ఎక్కడా చెప్పకపోవడం మరో విషయం. ఏదేమైనా ఫైర్ బ్రాండ్లుగా చలామణి అయిన వారు వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రంగా మారడం, వివాదాలకు కేంద్రంగా మారడంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నది వాస్తవం.

This post was last modified on August 26, 2025 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

21 minutes ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

1 hour ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

2 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

3 hours ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

3 hours ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

3 hours ago