Political News

బొట్టు బొట్టుకు లెక్క: డేంజర్‌లో వైసీపీ..!

వైసిపి హయాంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో కూపీ లాగుతున్నకొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బొట్టు బొట్టుకు లెక్క కట్టి అప్పట్లో సొమ్ములు చేసుకున్నారనేది తాజాగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చెబుతున్నారు. ఇటీవల వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణస్వామిని విచారించినప్పుడు కొన్ని విషయాలు ఆయన స్పష్టంగా వెల్లడించారు. ఈ క్రమంలో మద్యానికి సంబంధించి బొట్టు బొట్టుకు లెక్క కట్టి అప్పట్లో వసూలు చేశారని తెలిసింది.

పెద్ద ఎత్తున ఈ విషయంలో సొమ్ములు చేసుకున్నారనేది సిట్ అధికారులు తాజాగా గుర్తించినట్టు సమాచారం. వాస్తవానికి ఇప్పటివరకు డిస్టిలరీల కేటాయింపు, సీసాల లెక్క (కేసులు) ప్రకారం అక్రమాలు జరిగాయని సిట్ అధికారులు గుర్తించారు. వాటి ప్రకారమే లెక్కలు తేల్చారు. కొంతమందిని నిందితులుగా పేర్కొంటూ జైల్లోకి కూడా పంపించారు. వీరిలో ఏ1గా రాజ్ కసిరెడ్డి, ఏ2గా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహా మాజీ ఐఏఎస్ అధికారి, జగన్‌కు అప్పట్లో ఓఎస్‌డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి వంటి వారిని జైళ్ళకు పంపించారు.

అయితే ఈ కేసులో మరిన్ని విషయాలు మరుగున పడి ఉండడం, వాటిని తేల్చాలని ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో నారాయణస్వామిని విచారించారు. ఈ క్రమంలోనే ఆయన చెప్పిన సమాచారం బట్టి ప్రతి బొట్టుకు లెక్క గట్టి బార్ల నుంచి వసూలు చేశారట. బార్లలో సహజంగా సీసాల రూపంలో కాకుండా మందును విడిగా విక్రయిస్తారు. ఇలా విక్రయించిన మందుకు పెగ్గులు, 90ల రూపంలో అమ్మిన దానికి కమిషన్ల రూపంలో సొమ్ములు చేసుకున్నారు అన్నది నారాయణస్వామి చెబుతున్న మాట.

ఈ విషయంపై ఇప్పుడు సిట్ అధికారులు మరోసారి దృష్టి పెట్టారు. ఇలా ఎవరు ప్రోత్సహించారు, ఈ విధంగా చేయమని ఎవరు ఆదేశించారనే విషయంపై ఆరాతీస్తున్నారు. అవసరమైతే బార్ల యాజమాన్యాలను కూడా నగరాల వారీగా కొంతమందిని ఎంపిక చేసి విచారించాలని ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి కీలక నగరాల్లో మద్యం ఎక్కువగా విక్రయం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నారాయణస్వామి చెప్పిన సమాచారం బట్టి బొట్టు బొట్టుకు ఎంత కమిషన్ నొక్కారో లెక్క తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. దీంతో వైసీపీకి మరింత ఉక్కపోత తప్పదన్న చర్చ సాగుతోంది.

This post was last modified on August 26, 2025 9:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

17 minutes ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

38 minutes ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

3 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

4 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

4 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

6 hours ago