Political News

బొట్టు బొట్టుకు లెక్క: డేంజర్‌లో వైసీపీ..!

వైసిపి హయాంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో కూపీ లాగుతున్నకొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బొట్టు బొట్టుకు లెక్క కట్టి అప్పట్లో సొమ్ములు చేసుకున్నారనేది తాజాగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చెబుతున్నారు. ఇటీవల వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణస్వామిని విచారించినప్పుడు కొన్ని విషయాలు ఆయన స్పష్టంగా వెల్లడించారు. ఈ క్రమంలో మద్యానికి సంబంధించి బొట్టు బొట్టుకు లెక్క కట్టి అప్పట్లో వసూలు చేశారని తెలిసింది.

పెద్ద ఎత్తున ఈ విషయంలో సొమ్ములు చేసుకున్నారనేది సిట్ అధికారులు తాజాగా గుర్తించినట్టు సమాచారం. వాస్తవానికి ఇప్పటివరకు డిస్టిలరీల కేటాయింపు, సీసాల లెక్క (కేసులు) ప్రకారం అక్రమాలు జరిగాయని సిట్ అధికారులు గుర్తించారు. వాటి ప్రకారమే లెక్కలు తేల్చారు. కొంతమందిని నిందితులుగా పేర్కొంటూ జైల్లోకి కూడా పంపించారు. వీరిలో ఏ1గా రాజ్ కసిరెడ్డి, ఏ2గా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహా మాజీ ఐఏఎస్ అధికారి, జగన్‌కు అప్పట్లో ఓఎస్‌డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి వంటి వారిని జైళ్ళకు పంపించారు.

అయితే ఈ కేసులో మరిన్ని విషయాలు మరుగున పడి ఉండడం, వాటిని తేల్చాలని ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో నారాయణస్వామిని విచారించారు. ఈ క్రమంలోనే ఆయన చెప్పిన సమాచారం బట్టి ప్రతి బొట్టుకు లెక్క గట్టి బార్ల నుంచి వసూలు చేశారట. బార్లలో సహజంగా సీసాల రూపంలో కాకుండా మందును విడిగా విక్రయిస్తారు. ఇలా విక్రయించిన మందుకు పెగ్గులు, 90ల రూపంలో అమ్మిన దానికి కమిషన్ల రూపంలో సొమ్ములు చేసుకున్నారు అన్నది నారాయణస్వామి చెబుతున్న మాట.

ఈ విషయంపై ఇప్పుడు సిట్ అధికారులు మరోసారి దృష్టి పెట్టారు. ఇలా ఎవరు ప్రోత్సహించారు, ఈ విధంగా చేయమని ఎవరు ఆదేశించారనే విషయంపై ఆరాతీస్తున్నారు. అవసరమైతే బార్ల యాజమాన్యాలను కూడా నగరాల వారీగా కొంతమందిని ఎంపిక చేసి విచారించాలని ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి కీలక నగరాల్లో మద్యం ఎక్కువగా విక్రయం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నారాయణస్వామి చెప్పిన సమాచారం బట్టి బొట్టు బొట్టుకు ఎంత కమిషన్ నొక్కారో లెక్క తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. దీంతో వైసీపీకి మరింత ఉక్కపోత తప్పదన్న చర్చ సాగుతోంది.

This post was last modified on August 26, 2025 9:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగోళ్లు లేపుతుంటే… తమిళోళ్లు ముంచేస్తున్నారు

ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…

1 hour ago

సీఎంకు మ‌రో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం ప‌దుల సంఖ్య‌లో పోటీ!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మ‌రో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం చూస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రిని…

2 hours ago

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

6 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

7 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

10 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

10 hours ago