Political News

వైసీపీ మరో తప్పు.. అలా వద్దంటున్న నేతలు..!

ఏపీ ప్రతిపక్షం వైసీపీలో తప్పులపై తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వలంటీర్లను నమ్ముకుని నిండా మునిగారు. అప్పట్లో నాయకులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కార్యకర్తలను పట్టించుకోలేదు. దీంతో పార్టీ పరిస్థితి ఎన్నికల నాటికి ఇబ్బందిగా మారిపోయింది. అంతేకాదు, నమ్ముకున్న వలంటీర్లు యూటర్న్ తీసుకున్నారు.

దీనిని అప్పట్లోనే నాయకులు హెచ్చరించారు. తమకు ప్రాధాన్యం లేకుండా వలంటీర్లకే సర్వాధికారులు ఇస్తున్నారని వగర్చారు. అయినా అధినేత పట్టించుకోలేదు.

ఇక ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టేందుకు, పుంజుకునేలా చేసేందుకు మరో మంత్రం పఠించాలంటూ కోరుతున్నా, కేవలం జిల్లా స్థాయిలో నాయకులను నియమించి చేతులు దులుపుకుంటున్నారు. ఇదిలావుంటే తమకు అవసరం లేదని, తమకు భారంగా మారుతున్నారని ఓ నేతపై ఆరోపణలు చేస్తున్నా, ఆయన్నే మరోసారి సర్వాధికారం అప్పగించారు.

ప్రజానాయకుడు కూడా కాని, వార్డు నేతగా కూడా ఎన్నిక కాని ఆయనకు తమపై పెత్తనం చేసే అధికారం ఎందుకు ఇస్తున్నారన్నది పార్టీలో జరుగుతున్న చర్చ.

దీనిపై మరోసారి పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తీవ్ర చర్చ, రచ్చగా మారుతోంది. ఇదిలావుంటే అంతా సోష‌ల్ మీడియాపైనే బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు నాయకులకు మరింత ఇబ్బందిగా మారింది. బాధ్యతలు ఇవ్వడం తప్పుకాదని, కానీ పార్టీ తరఫున ప్రజల మధ్యకు వెళ్లే తమకు నిధులు ఇవ్వకుండా మీరే భరించాలంటూ చెప్పడం, సోష‌ల్ మీడియాకు భారీ ఎత్తున నిధులు కేటాయించడం నాయకుల్లో అసంతృప్తికి దారితీస్తోంది.

“మేం ప్రజల మధ్యకు వెళ్తే ఫలితం ఉంటుంది. సోష‌ల్ మీడియా ద్వారా ఎంతవరకు ఉంటుంది? నిధులు ఇవ్వడం తప్పుకాదు. కానీ సోష‌ల్ మీడియానే సర్వస్వం అనుకోవడం సరికాదు. మాకు కూడా కొంత మేరకు నిధులు ఇవ్వాలి,” అని ఓ నాయకుడు కీలక సలహాదారునికి తేల్చి చెప్పారు.

దానికి ఆయన స్పందిస్తూ, “ఎన్నికల్లో మీకు టికెట్లు ఇస్తున్నాం. కాబట్టి ఆ మేరకు భారం ఇప్పుడు మీరు భరించాలి. సోష‌ల్ మీడియాను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాం,” అని చెప్పారు.

దీనిపై మెజారిటీ నాయకులు గుస్సాగా ఉన్నారు. మరి దీనిని మారుస్తారా లేదా చూడాలి.

This post was last modified on August 26, 2025 9:45 am

Share
Show comments
Published by
Satya
Tags: YSRCP

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

1 hour ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago