Political News

వైసీపీ మరో తప్పు.. అలా వద్దంటున్న నేతలు..!

ఏపీ ప్రతిపక్షం వైసీపీలో తప్పులపై తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వలంటీర్లను నమ్ముకుని నిండా మునిగారు. అప్పట్లో నాయకులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కార్యకర్తలను పట్టించుకోలేదు. దీంతో పార్టీ పరిస్థితి ఎన్నికల నాటికి ఇబ్బందిగా మారిపోయింది. అంతేకాదు, నమ్ముకున్న వలంటీర్లు యూటర్న్ తీసుకున్నారు.

దీనిని అప్పట్లోనే నాయకులు హెచ్చరించారు. తమకు ప్రాధాన్యం లేకుండా వలంటీర్లకే సర్వాధికారులు ఇస్తున్నారని వగర్చారు. అయినా అధినేత పట్టించుకోలేదు.

ఇక ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టేందుకు, పుంజుకునేలా చేసేందుకు మరో మంత్రం పఠించాలంటూ కోరుతున్నా, కేవలం జిల్లా స్థాయిలో నాయకులను నియమించి చేతులు దులుపుకుంటున్నారు. ఇదిలావుంటే తమకు అవసరం లేదని, తమకు భారంగా మారుతున్నారని ఓ నేతపై ఆరోపణలు చేస్తున్నా, ఆయన్నే మరోసారి సర్వాధికారం అప్పగించారు.

ప్రజానాయకుడు కూడా కాని, వార్డు నేతగా కూడా ఎన్నిక కాని ఆయనకు తమపై పెత్తనం చేసే అధికారం ఎందుకు ఇస్తున్నారన్నది పార్టీలో జరుగుతున్న చర్చ.

దీనిపై మరోసారి పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తీవ్ర చర్చ, రచ్చగా మారుతోంది. ఇదిలావుంటే అంతా సోష‌ల్ మీడియాపైనే బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు నాయకులకు మరింత ఇబ్బందిగా మారింది. బాధ్యతలు ఇవ్వడం తప్పుకాదని, కానీ పార్టీ తరఫున ప్రజల మధ్యకు వెళ్లే తమకు నిధులు ఇవ్వకుండా మీరే భరించాలంటూ చెప్పడం, సోష‌ల్ మీడియాకు భారీ ఎత్తున నిధులు కేటాయించడం నాయకుల్లో అసంతృప్తికి దారితీస్తోంది.

“మేం ప్రజల మధ్యకు వెళ్తే ఫలితం ఉంటుంది. సోష‌ల్ మీడియా ద్వారా ఎంతవరకు ఉంటుంది? నిధులు ఇవ్వడం తప్పుకాదు. కానీ సోష‌ల్ మీడియానే సర్వస్వం అనుకోవడం సరికాదు. మాకు కూడా కొంత మేరకు నిధులు ఇవ్వాలి,” అని ఓ నాయకుడు కీలక సలహాదారునికి తేల్చి చెప్పారు.

దానికి ఆయన స్పందిస్తూ, “ఎన్నికల్లో మీకు టికెట్లు ఇస్తున్నాం. కాబట్టి ఆ మేరకు భారం ఇప్పుడు మీరు భరించాలి. సోష‌ల్ మీడియాను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాం,” అని చెప్పారు.

దీనిపై మెజారిటీ నాయకులు గుస్సాగా ఉన్నారు. మరి దీనిని మారుస్తారా లేదా చూడాలి.

This post was last modified on August 26, 2025 9:45 am

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

51 minutes ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

2 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

2 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

3 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

3 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

4 hours ago