2026 సంక్రాంతి మాములు వేడిగా లేదు. పోటీ అంతకంతా పెరుగుతూ పోతూ డిస్ట్రిబ్యూటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉంది. ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయిన లిస్టు చూస్తూనే థియేటర్ల సర్దుబాటు ఎలా జరుగుతుందో అంతు చిక్కడం లేదు. అలాంటిది కొత్తగా కూడా తోడవ్వడం ఇంకా విచిత్రం. ఇప్పటిదాకా ఖరారైన వాటిలో చిరంజీవి మన వరప్రసాద్ గారు, ప్రభాస్ ది రాజా సాబ్, రవితేజ 77, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు ఉన్నాయి. వీటిలో ఏదీ వెనక్కు తగ్గే సంకేతాలు నిర్మాతల వైపు నుంచి కనిపించడం లేదు. వీటికి తోడు డబ్బింగ్ మూవీ విజయ్ జన నాయకుడుకి తెలుగులోనూ బజ్ తెచ్చేలా ఉన్నారు.
ఇంత టఫ్ కాంపిటీషన్ మధ్యలో పరాశక్తిని దింపాలనుకోవడం సాహసమే. అయితే దర్శకురాలు సుధా కొంగర ఎట్టి పరిస్థితుల్లో పొంగల్ మిస్ చేయడం వద్దంటూ నిర్మాతని ఒప్పించారట. శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాతో శ్రీలీల హీరోయిన్ గా కోలీవుడ్ కు పరిచయమవుతోంది. రవి మోహన్, అథర్వా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం రోజుల నాటి పరిణామాలను సుధా కొంగర బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నారు. వివాదం అవుతుందనే ఉద్దేశంతో సూర్య దీన్ని వదులుకున్న సంగతి తెలిసిందే. అందుకే పరాశక్తి మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇలా ఇన్నేసి సినిమాలు తలపడటం వల్ల చాలా రిస్కులున్నాయి. ముఖ్యంగా రాజా సాబ్ కు తమిళనాడులో కావాల్సినన్ని థియేటర్లు దొరకడం కష్టమవుతుంది. ఇంకోవైపు జననాయగన్, పరాశక్తికి ఏపీ తెలంగాణలో స్క్రీన్లు దక్కించుకోవడం అంత సులభంగా ఉండదు. మిగిలినవి ప్యాన్ ఇండియా సినిమాలు కాదు కాబట్టి ఇబ్బంది లేదు కానీ ఓపెనింగ్స్ పరస్పరం ప్రభావితం చేసుకునే ఇలాంటి క్లాషులు ఎంత మాత్రం సేఫ్ కాదు. గరిష్టంగా మూడు సినిమాలు మంచి రెవిన్యూ చేసుకునే స్కోప్ ఉన్న సంక్రాంతికి ఇలా నాలుగు స్ట్రెయిట్, రెండు డబ్బింగులు వస్తే బిసి సెంటర్లలో థియేటర్ల సర్దుబాటుకి బయ్యర్లకు చుక్కలు కనిపించడం ఖాయం.
This post was last modified on August 26, 2025 12:36 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…