Political News

రేవంత్ డేరింగ్!… ఒక్క పోలీసు లేకుండా ఓయూకొస్తా!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్య చేశారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసిన అనంతరం రేవంత్… తిరిగి తాను మరోమారు ఓయూకు వస్తానని, ఈ దఫా ఒక్క పోలీసు కూడా వర్సిటీ ప్రాంగణంలో ఉండరని ఆయన ప్రకటించారు. ఈ మేరకు డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్ లకు ఇప్పుడే ఆదేశాలు జారీ చేస్తున్నానని ఆయన తెలిపారు. రేవంత్ నోట నుంచి ఈ వ్యాఖ్య వినిపించగానే… ఓయూ విద్యార్థుల నుంచి పెద్ద పెట్టున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఉస్మానియా వర్సిటీ ఉద్యమ ప్రస్థానంతో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి… తెలంగాణ ఉద్యమానికి ఆది ఓయూనేనని తెలిపారు. సమాజంలో ఏ సమస్య ఉత్పన్నమైనా ఓయూ విద్యార్థులే తొలుత స్పందిస్తున్న తీరును కూడా ఆయన గుర్తు చేశారు. ఓయూ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సాకారం అయ్యిందన్నారు. అలాంటి వర్సిటీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మరోమారు బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వస్తే… ఉస్మానియా వర్సిటీ అడ్రెస్సే గల్లంతవుతుందని ఆయన సంచలన ఆరోపణ చేశారు.

ఈ సందర్భంగా తన ఓయూ టూర్ పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేసిన కామెంట్లను రేవంత్ స్పందించారు. రేవంత్ పర్యటన సందర్భంగా ఓయూలోని విద్యార్థులను మూడు రోజులుగా అరెస్టు చేస్తున్నారని, అడుగుకో పోలీసును పెట్టి భద్రతను పటిష్టం చేస్తున్నారని, ఇంత భద్రత మధ్య ఏం చేయడానికి వెళుతున్నారు రేవంత్ గారూ అంటూ హరీశ్ ప్రశ్నించారు. పోలీసు కబంధ హస్తాల్లో విద్యార్థులను బంధించి చేసే సీఎం పర్యటనకు అర్థం ఉంటుందా అని కూడా ఆయన ఎద్దేవా చేశారు.

హరీశ్ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారో, లేదంటే ఉద్యమ స్ఫూర్తితో ఆ మాటలే గుర్తుకు వచ్చాయో తెలియదు గానీ.. తాను మరోమారు ఓయూకు వస్తానని, ఈ దఫా మీకున్న సమస్యలన్నీ చెప్పండి… ఎన్ని నిధులు అవసరమైనా అక్కడికక్కడే ఇస్తానని ఆయన ప్రకటించారు. తన మలి పర్యటన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కేంద్రం ప్రకటించిన డిసెంబర్ లోనే తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆ పర్యటనలో ఓయూలో ఒక్క పోలీసు కూడా వర్సిటీ ప్రాంగణంలో ఉండకుండా చూడాలన్నారు. ఈ మేరకు డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేస్తున్నానని తెలిపారు.

This post was last modified on August 25, 2025 5:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

1 hour ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago