దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలు పెరిగిపోయాయని.. వీటిని 8 వారాల్లో ఖాళీ చేయించి.. నగరానికి దూరంగా ఎక్కడైనా వదిలేయాలని పేర్కొంటూ.. ఈ నెల 11న ఇచ్చిన సుప్రీంకోర్టు సంచలనం రేపింది. అంతే కాదు.. ఒక్క కుక్క కనిపించినా.. అధికారులపై భారీ జరిమానాలు విధిస్తామని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక అక్కడితోనూ అప్పట్లో శాంతించలేదు. తాము ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయడానికి వీల్లేదని కూడా స్పష్టం చేసింది. అలా ఎవరైనా సవాల్ చేస్తే.. భారీ జరిమానాలకు సిద్ధమై కోర్టుకు రావాలని తేల్చి చెప్పింది.
అయితే.. సుప్రీంకోర్టు ఎన్ని చెప్పినా.. బాలీవుడ్ నుంచి దేశవ్యాప్తంగా.. అన్ని రాష్ట్రాల్లోనూ జంతు ప్రేమికులు కదం తొక్కారు. కుక్కలకు రక్షణగా నిలిచారు. సుప్రీంకోర్టు తీర్పును రివైజ్ చేయాలని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కూడా అనేక మంది లేఖలు రాశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తాజాగా గత 11వ తేదీన ఇచ్చిన తీర్పును రివైజ్ చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం ఢిల్లీలో కుక్కలు ఉండేందుకు అనుమతి ఇచ్చింది.
అయితే.. కేవలం రెబీస్ వ్యాధి సోకిన కుక్కలను మాత్రం నగరానికి కడుదూరంగా పంపించేయాలని ఆదేశించింది. అదేసమయంలో నగరంలో ఉండే కుక్కలకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలని, వ్యాక్సిన్ ఇవ్వాలని, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని కూడా ఆదేశించింది. వీధుల్లో తిరిగే కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఆహారం పెట్టడానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆహారం పెట్టేందుకు స్థానిక కార్పొరేషన్ అధికారులు వేరే షెల్టర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.
ఇవీ ముఖ్యాంశాలు
This post was last modified on August 22, 2025 9:58 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…