దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలు పెరిగిపోయాయని.. వీటిని 8 వారాల్లో ఖాళీ చేయించి.. నగరానికి దూరంగా ఎక్కడైనా వదిలేయాలని పేర్కొంటూ.. ఈ నెల 11న ఇచ్చిన సుప్రీంకోర్టు సంచలనం రేపింది. అంతే కాదు.. ఒక్క కుక్క కనిపించినా.. అధికారులపై భారీ జరిమానాలు విధిస్తామని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక అక్కడితోనూ అప్పట్లో శాంతించలేదు. తాము ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయడానికి వీల్లేదని కూడా స్పష్టం చేసింది. అలా ఎవరైనా సవాల్ చేస్తే.. భారీ జరిమానాలకు సిద్ధమై కోర్టుకు రావాలని తేల్చి చెప్పింది.
అయితే.. సుప్రీంకోర్టు ఎన్ని చెప్పినా.. బాలీవుడ్ నుంచి దేశవ్యాప్తంగా.. అన్ని రాష్ట్రాల్లోనూ జంతు ప్రేమికులు కదం తొక్కారు. కుక్కలకు రక్షణగా నిలిచారు. సుప్రీంకోర్టు తీర్పును రివైజ్ చేయాలని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కూడా అనేక మంది లేఖలు రాశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తాజాగా గత 11వ తేదీన ఇచ్చిన తీర్పును రివైజ్ చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం ఢిల్లీలో కుక్కలు ఉండేందుకు అనుమతి ఇచ్చింది.
అయితే.. కేవలం రెబీస్ వ్యాధి సోకిన కుక్కలను మాత్రం నగరానికి కడుదూరంగా పంపించేయాలని ఆదేశించింది. అదేసమయంలో నగరంలో ఉండే కుక్కలకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలని, వ్యాక్సిన్ ఇవ్వాలని, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని కూడా ఆదేశించింది. వీధుల్లో తిరిగే కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఆహారం పెట్టడానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆహారం పెట్టేందుకు స్థానిక కార్పొరేషన్ అధికారులు వేరే షెల్టర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.
ఇవీ ముఖ్యాంశాలు
This post was last modified on August 22, 2025 9:58 pm
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…