దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలు పెరిగిపోయాయని.. వీటిని 8 వారాల్లో ఖాళీ చేయించి.. నగరానికి దూరంగా ఎక్కడైనా వదిలేయాలని పేర్కొంటూ.. ఈ నెల 11న ఇచ్చిన సుప్రీంకోర్టు సంచలనం రేపింది. అంతే కాదు.. ఒక్క కుక్క కనిపించినా.. అధికారులపై భారీ జరిమానాలు విధిస్తామని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక అక్కడితోనూ అప్పట్లో శాంతించలేదు. తాము ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయడానికి వీల్లేదని కూడా స్పష్టం చేసింది. అలా ఎవరైనా సవాల్ చేస్తే.. భారీ జరిమానాలకు సిద్ధమై కోర్టుకు రావాలని తేల్చి చెప్పింది.
అయితే.. సుప్రీంకోర్టు ఎన్ని చెప్పినా.. బాలీవుడ్ నుంచి దేశవ్యాప్తంగా.. అన్ని రాష్ట్రాల్లోనూ జంతు ప్రేమికులు కదం తొక్కారు. కుక్కలకు రక్షణగా నిలిచారు. సుప్రీంకోర్టు తీర్పును రివైజ్ చేయాలని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కూడా అనేక మంది లేఖలు రాశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తాజాగా గత 11వ తేదీన ఇచ్చిన తీర్పును రివైజ్ చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం ఢిల్లీలో కుక్కలు ఉండేందుకు అనుమతి ఇచ్చింది.
అయితే.. కేవలం రెబీస్ వ్యాధి సోకిన కుక్కలను మాత్రం నగరానికి కడుదూరంగా పంపించేయాలని ఆదేశించింది. అదేసమయంలో నగరంలో ఉండే కుక్కలకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలని, వ్యాక్సిన్ ఇవ్వాలని, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని కూడా ఆదేశించింది. వీధుల్లో తిరిగే కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఆహారం పెట్టడానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆహారం పెట్టేందుకు స్థానిక కార్పొరేషన్ అధికారులు వేరే షెల్టర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.
ఇవీ ముఖ్యాంశాలు
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అడ్డంకులు రావడం సహజం. ఒక్కోసారి నెలలు సంవత్సరాల తరబడి రిలీజులు ఆగిపోతాయి. కానీ ఓటిటిలో…
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…