రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికలకు ముందు అయితే ఈ వ్యూహాలకు మరింత పదును కూడా పెడతారు. ఇప్పుడు తమిళనాడులోనూ ఇదే తరహా పాలిటిక్స్ సాగుతున్నాయి.
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న అతి పెద్ద అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక ఏపీలో 175, తెలంగాణలో 117, కర్ణాటకలో 224, కేరళలో 140 ఉన్నాయి.
అంటే దక్షిణాదిలో ఎక్కువ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ పాగా వేయాలన్నది బీజేపీ రెండు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నం. గతంలో జయలలితపై ఒత్తిడి కూడా తెచ్చారు. ఆ తర్వాత అన్నాడీఎంకేను చీల్చి లాభం పొందాలనే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
గత రెండేళ్ల కిందట తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ద్వారా కొత్త పార్టీ పెట్టించి దానిని తమకు మద్దతుగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో రజనీ ముందు మొగ్గు చూపినా తర్వాత రాజకీయాలకు గుడ్బై చెప్పారు.
ఇప్పుడు మరో రూపంలో బీజేపీ తమిళ ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే హీరో విజయ్ కొత్త పార్టీతో తెరమీదికి వచ్చారు. వాస్తవానికి పైకి ఆయన బీజేపీని తిట్టిపోస్తున్నా అంతర్గతంగా మాత్రం కమలనాథుల కనుసన్నల్లోనే మెలుగుతున్నారన్న చర్చ జోరుగా ఉంది.
స్థానికంగా ఉన్న ద్రవిడుల బలమైన ఓటు బ్యాంకును విజయ్ దక్కించుకుంటే దీనిని ఆసరాగా చేసుకుని బీజేపీ చెలిమి చేసే అవకాశం ఉంది. అందుకే విజయ్ వ్యూహాత్మకంగా తాను ఏ పార్టీకి చెందిన నాయకుడిని కాదని, సొంత నేతనేనని పదే పదే ప్రకటించే పరిస్థితి వచ్చింది.
తాజాగా కూడా విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కగళం (టీవీకే) బీజేపీ, డీఎంకేలకు అతీతంగా ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ముందు ముందు పొత్తును నిర్ధారిస్తున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.
తాను బీజేపీ భావజాలంతో మాత్రమే విభేదిస్తానని చెప్పారు. కానీ డీఎంకేతో (అధికార పార్టీ) మాత్రం అన్ని విషయాల్లోనూ పోరాటం చేస్తానన్నారు. సో భావజాలం ప్రాతిపదిక రేపు మారే అవకాశం ఉంటుంది.
అంశాల వారీ మద్దతు కూడా ఉండొచ్చు. కాబట్టి విజయ్ అడుగులు చూస్తే మోడీ కనుసన్నల్లో, బీజేపీ బాటపైనే పడుతున్నాయన్నది తమిళ మీడియా చెబుతున్న మాట. మరి ఈ పోరులో డీఎంకే నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి ఏమేరకు తట్టుకుని నిలబడుతుందో చూడాలి.
This post was last modified on August 22, 2025 10:53 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…