రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికలకు ముందు అయితే ఈ వ్యూహాలకు మరింత పదును కూడా పెడతారు. ఇప్పుడు తమిళనాడులోనూ ఇదే తరహా పాలిటిక్స్ సాగుతున్నాయి.
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న అతి పెద్ద అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక ఏపీలో 175, తెలంగాణలో 117, కర్ణాటకలో 224, కేరళలో 140 ఉన్నాయి.
అంటే దక్షిణాదిలో ఎక్కువ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ పాగా వేయాలన్నది బీజేపీ రెండు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నం. గతంలో జయలలితపై ఒత్తిడి కూడా తెచ్చారు. ఆ తర్వాత అన్నాడీఎంకేను చీల్చి లాభం పొందాలనే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
గత రెండేళ్ల కిందట తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ద్వారా కొత్త పార్టీ పెట్టించి దానిని తమకు మద్దతుగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో రజనీ ముందు మొగ్గు చూపినా తర్వాత రాజకీయాలకు గుడ్బై చెప్పారు.
ఇప్పుడు మరో రూపంలో బీజేపీ తమిళ ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే హీరో విజయ్ కొత్త పార్టీతో తెరమీదికి వచ్చారు. వాస్తవానికి పైకి ఆయన బీజేపీని తిట్టిపోస్తున్నా అంతర్గతంగా మాత్రం కమలనాథుల కనుసన్నల్లోనే మెలుగుతున్నారన్న చర్చ జోరుగా ఉంది.
స్థానికంగా ఉన్న ద్రవిడుల బలమైన ఓటు బ్యాంకును విజయ్ దక్కించుకుంటే దీనిని ఆసరాగా చేసుకుని బీజేపీ చెలిమి చేసే అవకాశం ఉంది. అందుకే విజయ్ వ్యూహాత్మకంగా తాను ఏ పార్టీకి చెందిన నాయకుడిని కాదని, సొంత నేతనేనని పదే పదే ప్రకటించే పరిస్థితి వచ్చింది.
తాజాగా కూడా విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కగళం (టీవీకే) బీజేపీ, డీఎంకేలకు అతీతంగా ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ముందు ముందు పొత్తును నిర్ధారిస్తున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.
తాను బీజేపీ భావజాలంతో మాత్రమే విభేదిస్తానని చెప్పారు. కానీ డీఎంకేతో (అధికార పార్టీ) మాత్రం అన్ని విషయాల్లోనూ పోరాటం చేస్తానన్నారు. సో భావజాలం ప్రాతిపదిక రేపు మారే అవకాశం ఉంటుంది.
అంశాల వారీ మద్దతు కూడా ఉండొచ్చు. కాబట్టి విజయ్ అడుగులు చూస్తే మోడీ కనుసన్నల్లో, బీజేపీ బాటపైనే పడుతున్నాయన్నది తమిళ మీడియా చెబుతున్న మాట. మరి ఈ పోరులో డీఎంకే నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి ఏమేరకు తట్టుకుని నిలబడుతుందో చూడాలి.
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…