తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ఆ రాష్ట్రంలో ఏ మేర ప్రకంపనలు సృష్టించనుందన్న దానిపై పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి. తమిళ వెట్రిగ కజగం (టీవీకే) పేరిట రెండేళ్ల క్రితం రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్.. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చాక సినిమాలు చేయనని సంచలన ప్రకటన చేశారు. తాజాగా గురువారం తమిళనాడులోని మధురైలో జరిగిన టీవీకే ద్వితీయ వార్షికోత్సవ సభలో ఆయన తన రాజకీయ ప్రస్థానంపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చేశారు. తమ పార్టీ ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోదని ప్రకటించిన విజయ్… ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించారు.
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే విజయ్ రాజకీయాల్లోకి దూకేశారు. ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చి హడావిడితో బొక్కబోర్లా పడటం ఎందుకన్న భావనతోనే విజయ్… దాదాపుగా ఎన్నికలకు రెండున్నరేళ్లకు పైగా సమయం ఉండగానే… రాజకీయ పార్టీని ప్రకటించారు. అంతేకాకుండా ఈ రెండేళ్లలోనే పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన విజయ్.. పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా నేతల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ కారణంగానే మధురై టీవీకే సభకు అశేష జనవాహిని తరలివచ్చింది.
ఈ సందర్భంగా ఒకింత ఉద్వేగంగా మాట్లాడిన విజయ్… వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీతోనూ టీవీకే పొత్తు పెట్టుకోదని ప్రకటించారు. ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని కూడా ఆయన సంచలన ప్రకటన చేశారు. అంతటితో ఆగని విజయ్… వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని ప్రకటించిన ఆయన…. ఆ రెండు పార్టీల్లో ఒకటి టీవీకే అయితే రెండోది ప్రస్తుతం అదికారంలో ఉన్న డీఎంకే అని చెప్పుకొచ్చారు. మొత్తంగా అన్నాడీఎంకేను అసలు లెక్కలోకే తీసుకోని విజయ్… డీఎంకేతోనే తన పోటీ అంటూ ప్రకటించిన తీరు చూస్తుంటే…రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేగుతోంది.
This post was last modified on August 21, 2025 9:50 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…