Political News

రాజధాని గ్రామాలకు సౌరభం: కూటమి కీలక నిర్ణయం

ఏపీ రాజధాని అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు పండగ చేసుకునే వాతావరణం ఇది. ఇప్పటి వరకు ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించినా, వాటిని వారికి అప్పగించే విషయంలో తాత్సారం జరుగుతూనే ఉంది. అదేవిధంగా వారికి కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల కల్పన కూడా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. తాజాగా ఈ గ్రామాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మొత్తం 29 గ్రామాల్లో రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లను సాధ్యమైనంత వేగంగా వారికి అప్పగించాలని నిర్ణయించింది. అంతేకాదు, ఆయా గ్రామాల్లో రహదారులు, కాలువలు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం సహా ప్రత్యేకంగా రెండు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో భేటీ అయిన మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ప్రతిపాదించిన 904 కోట్ల రూపాయలను కేటాయించేందుకు ఓకే చెప్పింది.

ఈ నిధులతో పైన పేర్కొన్న పనులను వచ్చే ఆరు నెలల్లో చేపట్టనున్నారు. మార్చి 31 నాటికి వాటిని పూర్తి చేసి, అనంతరం రైతులకు ప్లాట్లను అప్పగించనున్నారు. నిజానికి 2018లోనే రైతులకు భూములు కేటాయించినప్పటికీ వాటిని వారికి అప్పగించలేదు. ఇటీవల ఈ వ్యవహారం జఠిలంగా మారింది. పైగా రైతుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అనుకూల మీడియాలోనూ వ్యతిరేక కథనాలు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు మరింత భూసమీકરણ సాకారం కావాలంటే ప్రస్తుతం ఉన్న రైతులను సంతృప్తి పరచాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే తాజా మంత్రివర్గ సమావేశంలో 904 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు ఓకే చెప్పారు. తద్వారా వచ్చే ఆరు నెలల్లో వడివడిగా పనులు ముందుకు సాగి, రాజధాని గ్రామాల్లో అభివృద్ధి సౌరభాలు నింపనున్నారు. ఇది అమరావతికి సాధారణ ప్రజలను కూడా ఆకర్షించేలా చేస్తుందన్న భావన మంత్రివర్గంలో వెల్లడైంది.

This post was last modified on August 21, 2025 9:47 pm

Share

Recent Posts

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

47 minutes ago

రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…

2 hours ago

ఇరుముడి ఇన్నింగ్స్ ఇంకా ఉన్నాయా

మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…

2 hours ago

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

4 hours ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

4 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

6 hours ago