Political News

‘శ్రీవారి ప్రసాదాలు తిని మాట్లాడండి జగన్, భారతి’

తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత తగ్గిపోయిందని, అన్న ప్రసాదాల్లో అసలు నాణ్యత కొరవడిందని వైసీపీ అధినేత జగన్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదు. భక్తులు శ్రీవారి ప్రసాదాలను ఎంతో భక్తి ప్రపత్తులతో స్వీకరిస్తున్నారు. నాణ్యత బాగుందని కూడా చెబుతున్నారు. మీరు ఏనాడైనా తిరుమలకు వచ్చారా? నిత్యాన్నదాన సత్రంలో కూర్చుని తిరుమల శ్రీవారి ప్రసాదాలు తీసుకున్నారా? చెప్పండి. ఇప్పుడు చెబుతున్నా, జగన్, భారతి లు స్వయంగా తిరుమలకు రండి. ఇక్కడి ప్రసాదాలు రుచి చూడండి. అప్పుడు మాట్లాడండి. అని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు సవాల్ విసిరారు.

అంతేకాదు, సాక్షి పత్రిక, టీవీ ఛానెల్‌లో తనపై వ్యక్తిగా కుట్ర కథనాలను ప్రసారం చేస్తున్నారని, ప్రచురిస్తున్నారని నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10, 14 తేదీల్లో ప్రచురించిన, ప్రసారం చేసిన వాటిపై లీగల్ నోటీసులు పంపించనున్నట్టు చెప్పారు. తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించినందుకు 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని నాయుడు తెలిపారు.

మరోవైపు, తిరుమల కొండ పవిత్రతను కాలరాస్తున్నారని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.

నిజానికి తిరుమల ఇప్పుడు పవిత్రంగానే ఉంది. వైసీపీ హయాంలో ఉన్నట్టుగానే ఉందని వారు భ్రమలో ఉన్నారు. అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. అని నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్ని విషయాల్లోనూ తిరుమలను వైసీపీ నేతలు భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. తిరుమలలో హోటళ్లను తమ వారికి కట్టబెట్టారని, ఫలితంగా శ్రీవారి హుండీకి రావాల్సిన ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని నాయుడు చెప్పారు.

తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పైనా నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అవినీతి చిట్టా తన వద్ద ఉందని తెలిపారు. లేనిపోని విమర్శలు చేసి టీటీడీ పరువు తీయాలని భావిస్తున్నారని, ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.

మాజీ మంత్రి రోజా కూడా తిరుమల టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై కూడా కూపీ లాగుతున్నట్టు నాయుడు తెలిపారు. “వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నెన్ని టికెట్లు ఎవరికిచ్చారో నాకు తెలుసు. రోజా టూరిజం ముసుగులో ఒక్కో దర్శన టికెట్‌ను రూ.5 వేలకు అమ్ముకున్నారు. తిరుమలలో ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా?’’ అని నాయుడు సవాల్ విసిరారు.

This post was last modified on August 21, 2025 4:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లీకులు సరే… నెక్స్ట్ ఏంటి నాయకా

జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…

2 hours ago

అదేంటో… మోడీ స‌ర్‌కి ఎన్నిక‌ల‌ప్పుడే అన్నీ గుర్తుకొస్తాయి!

అదేంటో కానీ.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీకి ప‌లు కీల‌క విష‌యాలు సాధార‌ణ రోజుల్లో ఎక్క‌డా గుర్తుకు ఉండ‌వు... రావు. ఎన్నిక‌ల…

3 hours ago

మృణాల్ పాటించాల్సిన సలహానే ఇది

సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…

5 hours ago

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

7 hours ago

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

8 hours ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

9 hours ago