Political News

‘శ్రీవారి ప్రసాదాలు తిని మాట్లాడండి జగన్, భారతి’

తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత తగ్గిపోయిందని, అన్న ప్రసాదాల్లో అసలు నాణ్యత కొరవడిందని వైసీపీ అధినేత జగన్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదు. భక్తులు శ్రీవారి ప్రసాదాలను ఎంతో భక్తి ప్రపత్తులతో స్వీకరిస్తున్నారు. నాణ్యత బాగుందని కూడా చెబుతున్నారు. మీరు ఏనాడైనా తిరుమలకు వచ్చారా? నిత్యాన్నదాన సత్రంలో కూర్చుని తిరుమల శ్రీవారి ప్రసాదాలు తీసుకున్నారా? చెప్పండి. ఇప్పుడు చెబుతున్నా, జగన్, భారతి లు స్వయంగా తిరుమలకు రండి. ఇక్కడి ప్రసాదాలు రుచి చూడండి. అప్పుడు మాట్లాడండి. అని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు సవాల్ విసిరారు.

అంతేకాదు, సాక్షి పత్రిక, టీవీ ఛానెల్‌లో తనపై వ్యక్తిగా కుట్ర కథనాలను ప్రసారం చేస్తున్నారని, ప్రచురిస్తున్నారని నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10, 14 తేదీల్లో ప్రచురించిన, ప్రసారం చేసిన వాటిపై లీగల్ నోటీసులు పంపించనున్నట్టు చెప్పారు. తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించినందుకు 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని నాయుడు తెలిపారు.

మరోవైపు, తిరుమల కొండ పవిత్రతను కాలరాస్తున్నారని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.

నిజానికి తిరుమల ఇప్పుడు పవిత్రంగానే ఉంది. వైసీపీ హయాంలో ఉన్నట్టుగానే ఉందని వారు భ్రమలో ఉన్నారు. అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. అని నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్ని విషయాల్లోనూ తిరుమలను వైసీపీ నేతలు భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. తిరుమలలో హోటళ్లను తమ వారికి కట్టబెట్టారని, ఫలితంగా శ్రీవారి హుండీకి రావాల్సిన ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని నాయుడు చెప్పారు.

తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పైనా నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అవినీతి చిట్టా తన వద్ద ఉందని తెలిపారు. లేనిపోని విమర్శలు చేసి టీటీడీ పరువు తీయాలని భావిస్తున్నారని, ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.

మాజీ మంత్రి రోజా కూడా తిరుమల టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై కూడా కూపీ లాగుతున్నట్టు నాయుడు తెలిపారు. “వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నెన్ని టికెట్లు ఎవరికిచ్చారో నాకు తెలుసు. రోజా టూరిజం ముసుగులో ఒక్కో దర్శన టికెట్‌ను రూ.5 వేలకు అమ్ముకున్నారు. తిరుమలలో ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా?’’ అని నాయుడు సవాల్ విసిరారు.

This post was last modified on August 21, 2025 4:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

56 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago