Political News

మరోసారి కవిత సంచలన ఆరోపణలు

సొంత పార్టీలోని కొందరు నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొద్ది రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు తాను రాసిన లేఖ లీక్ కావడంపై కవిత అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఇక ఆ లేఖలో కవిత పేర్కొన్న విషయాలు పార్టీలోని అంతర్గత కలహాలకు అద్దంలా మారాయి. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించేలా ఉన్న ఆ లేఖ బీఆర్ఎస్ వర్గాల్లో దుమారం రేపింది. ఆ లేఖ తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కవితతో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీలోని కొందరు కుట్రదారులు తనను రకరకాలుగా వేధిస్తున్నారని కవిత షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ కుట్రదారులను బయటపెట్టాలని కోరితే తనపై కక్షగట్టారని వాపోయారు. ఆ కుట్రదారులే ఆ లేఖను తాను అమెరికా వెళ్లిన సమయంలో లీక్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసని అన్నారు. తాను అమెరికాలో ఉన్నప్పుడే గౌరవ అధ్యక్ష ఎన్నిక జరిగిందని, చట్టవిరుద్ధంగా బీవీజేకేఎస్ సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారని కవిత ఆరోపించారు. కార్మికుల చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారని ఆరోపించారు.

సింగరేణి కార్మికుల కోసం తాను పోరాడుతుంటే తనపై కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ ప్రకారం సింగరేణి గని కార్మికులకు కవిత బహిరంగ లేఖ రాశారు. టీవీజేకేఎస్ గౌరవాధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ కు శుభాకాంక్షలు తెలిపారు. మరి కవిత కామెంట్లపై బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on August 21, 2025 4:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

28 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

3 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

3 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago