Political News

మరోసారి కవిత సంచలన ఆరోపణలు

సొంత పార్టీలోని కొందరు నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొద్ది రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు తాను రాసిన లేఖ లీక్ కావడంపై కవిత అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఇక ఆ లేఖలో కవిత పేర్కొన్న విషయాలు పార్టీలోని అంతర్గత కలహాలకు అద్దంలా మారాయి. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించేలా ఉన్న ఆ లేఖ బీఆర్ఎస్ వర్గాల్లో దుమారం రేపింది. ఆ లేఖ తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కవితతో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీలోని కొందరు కుట్రదారులు తనను రకరకాలుగా వేధిస్తున్నారని కవిత షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ కుట్రదారులను బయటపెట్టాలని కోరితే తనపై కక్షగట్టారని వాపోయారు. ఆ కుట్రదారులే ఆ లేఖను తాను అమెరికా వెళ్లిన సమయంలో లీక్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసని అన్నారు. తాను అమెరికాలో ఉన్నప్పుడే గౌరవ అధ్యక్ష ఎన్నిక జరిగిందని, చట్టవిరుద్ధంగా బీవీజేకేఎస్ సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారని కవిత ఆరోపించారు. కార్మికుల చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారని ఆరోపించారు.

సింగరేణి కార్మికుల కోసం తాను పోరాడుతుంటే తనపై కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ ప్రకారం సింగరేణి గని కార్మికులకు కవిత బహిరంగ లేఖ రాశారు. టీవీజేకేఎస్ గౌరవాధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ కు శుభాకాంక్షలు తెలిపారు. మరి కవిత కామెంట్లపై బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

12 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

18 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

32 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago