వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్న ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి ఉరఫ్ రాజ్ కసిరెడ్డి ఆస్తులను జప్తు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే లిక్కర్ కుంభకోణం ద్వారా ఆయన అక్రమ మార్గంలో కోట్ల రూపాయలు పోగేసుకున్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ సొమ్మును వైట్ చేసుకునేందుకు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్టు మద్యం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు. సినిమాలు సహా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ కసిరెడ్డి పెట్టుబడులు పెట్టినట్టు తెలుసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా 13 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడా రాజ్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఆయా వివరాలను ప్రభుత్వానికి అందించారు. దీంతో రాజ్ కసిరెడ్డి ఆస్తులను సీజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు ఆస్తులను సీజ్ చేసిన ఘటన ఇదే కావడం గమనార్హం. అదే విధంగా కీలక నేతలు, ఉన్నతాధికారులను కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేసినా వారి ఆస్తులపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవలి శంషాబాద్ శివారులో గుర్తించిన 11 కోట్ల రూపాయలను కోర్టు ఆదేశాల మేరకు బ్యాంకులో జమ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు నిందితుల్లో నంబర్ వన్గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
This post was last modified on August 21, 2025 4:06 pm
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…