మలయాళ నటి, జర్నలిస్ట్గా కూడా పనిచేసిన రినీ ఆన్ జార్జ్ సంచలన ఆరోపణలు చేసి కేరళ రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. ఒక ప్రముఖ పార్టీకి చెందిన యువ నేత తనకు అసభ్యకరమైన సందేశాలు పంపాడని, హోటల్కు రావాలని ఆహ్వానించాడని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి చెప్పినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అంతేకాక ఆ నేతకు మరిన్ని అవకాశాలు ఇచ్చారని రినీ వాపోయారు.
రినీ మాట్లాడుతూ, “తమ కుటుంబంలోని మహిళలను కాపాడుకోలేని రాజకీయ నాయకులు, ఇతర మహిళలను ఎలా రక్షిస్తారు?” అని ప్రశ్నించారు. తన అనుభవాలను బహిర్గతం చేయడానికి కారణం ఇటీవలే సోషల్ మీడియాలో పలువురు మహిళలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఎవరూ బయటకు రాకపోవడమేనని ఆమె వివరించారు. “నేను మాట్లాడకపోతే, ఇంకా చాలా మంది మౌనంగా ఇలాగే బాధపడతారు అనిపించింది” అని రినీ స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, ఈ ఆరోపణలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే, యూత్ కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు రాహుల్ మంఖూటతిల్ పేరు బయటకు రావడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. బీజేపీ కార్యకర్తలు రాహుల్ మంఖూటతిల్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనికి తోడు రచయిత హనీ భాస్కరన్ కూడా ఫేస్బుక్ ద్వారా రాహుల్పై తన అనుభవాన్ని బహిర్గతం చేశారు.
హనీ మాట్లాడుతూ, రాహుల్ తనకు పలుమార్లు సోషల్ మీడియాలో సందేశాలు పంపాడని, మొదట్లో ప్రయాణానికి సంబంధించిన మాటలతో ప్రారంభమైనా తర్వాత అసభ్యంగా మారాడని పేర్కొన్నారు. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా తన గురించి చెడుగా మాట్లాడాడని, తనే మొదలుపెట్టినట్లు తప్పుడు ప్రచారం చేశాడని హనీ ఆరోపించారు. ఇప్పటికే పలువురు మహిళలు యూత్ కాంగ్రెస్లో నుంచి కూడా రాహుల్పై ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని హనీ భాస్కరన్ ఆరోపించడం మరింత చర్చనీయాంశమైంది.
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…