హైదరాబాద్ నగరంలో భూముల ధరలు మళ్లీ చర్చకు తెరలేపాయి. హెచ్ఎండీఏ తాజాగా ఆన్లైన్ వేలానికి నోటిఫికేషన్ జారీ చేస్తూ కనీస ధరలను భారీగా పెంచింది. ముఖ్యంగా కోకాపేట నియోపొలిస్ ప్రాంతంలో చ.గజం రూ.1.75 లక్షలుగా ధర నిర్ణయించడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో షాక్ ఇచ్చింది. గతంలో ఇదే ధర రూ.65 వేలుగా ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా రెండింతలు కంటే ఎక్కువ పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
కోకాపేటలో ప్రభుత్వ భూములు ఎప్పటినుంచో హాట్టాపిక్ గా నిలుస్తున్నాయి. సర్వే నెంబర్ 144లో ఉన్న 8,591 చ.గజాల భూమి ప్రస్తుతం వేలం కోసం సిద్ధంగా ఉంది. కొత్త కనీస ధర ప్రకారం ఈ భూమి విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుంది. అయితే వాస్తవ వేలంలో ధర ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. గతంలో ఇదే ప్రాంతంలో ఓ ఎకరా భూమి రూ.100 కోట్లకు అమ్ముడైన సంఘటన ఇంకా గుర్తుండగానే ఉంది.
ఇక బాచుపల్లి, బైరాగిగూడ, చందానగర్, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో కూడా కనీస ధరలు పెరిగాయి. బాచుపల్లిలో చ.గజానికి రూ.70 వేలుగా, బైరాగిగూడలో రూ.75 వేలుగా ధర నిర్ణయించారు. ఈ ధరలు గతం కంటే రెండింతలు పెరగడం గమనార్హం. రియల్ ఎస్టేట్ డిమాండ్, ఐటీ కారిడార్ విస్తరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కారణంగా ధరలు ఇంతకంతకూ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గతంలో మోకిలలో జరిగిన వేలం అనుభవం అధికారులు మరిచిపోలేదు. అప్పుడు చాలామంది ఎక్కువ ధరలు చెప్పి తరువాత డబ్బులు చెల్లించక వెనక్కు తగ్గారు. తమ భూముల ధరలు పెరగడానికే అలాంటి ప్రయత్నాలు జరిగాయని అధికారులు గుర్తించారు. అందుకే ఈసారి భారీ డిపాజిట్ తప్పనిసరి చేశారు. కోకాపేటలో 8,591 చ.గజాల భూమి వేలంలో పాల్గొనాలంటే రూ.5 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే. మొత్తంగా, కోకాపేటతో పాటు ఇతర ప్రాంతాల్లో కనీస ధరలు పెరగడం రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త చర్చను తెచ్చింది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…