హైదరాబాద్ నగరంలో భూముల ధరలు మళ్లీ చర్చకు తెరలేపాయి. హెచ్ఎండీఏ తాజాగా ఆన్లైన్ వేలానికి నోటిఫికేషన్ జారీ చేస్తూ కనీస ధరలను భారీగా పెంచింది. ముఖ్యంగా కోకాపేట నియోపొలిస్ ప్రాంతంలో చ.గజం రూ.1.75 లక్షలుగా ధర నిర్ణయించడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో షాక్ ఇచ్చింది. గతంలో ఇదే ధర రూ.65 వేలుగా ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా రెండింతలు కంటే ఎక్కువ పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
కోకాపేటలో ప్రభుత్వ భూములు ఎప్పటినుంచో హాట్టాపిక్ గా నిలుస్తున్నాయి. సర్వే నెంబర్ 144లో ఉన్న 8,591 చ.గజాల భూమి ప్రస్తుతం వేలం కోసం సిద్ధంగా ఉంది. కొత్త కనీస ధర ప్రకారం ఈ భూమి విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుంది. అయితే వాస్తవ వేలంలో ధర ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. గతంలో ఇదే ప్రాంతంలో ఓ ఎకరా భూమి రూ.100 కోట్లకు అమ్ముడైన సంఘటన ఇంకా గుర్తుండగానే ఉంది.
ఇక బాచుపల్లి, బైరాగిగూడ, చందానగర్, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో కూడా కనీస ధరలు పెరిగాయి. బాచుపల్లిలో చ.గజానికి రూ.70 వేలుగా, బైరాగిగూడలో రూ.75 వేలుగా ధర నిర్ణయించారు. ఈ ధరలు గతం కంటే రెండింతలు పెరగడం గమనార్హం. రియల్ ఎస్టేట్ డిమాండ్, ఐటీ కారిడార్ విస్తరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కారణంగా ధరలు ఇంతకంతకూ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గతంలో మోకిలలో జరిగిన వేలం అనుభవం అధికారులు మరిచిపోలేదు. అప్పుడు చాలామంది ఎక్కువ ధరలు చెప్పి తరువాత డబ్బులు చెల్లించక వెనక్కు తగ్గారు. తమ భూముల ధరలు పెరగడానికే అలాంటి ప్రయత్నాలు జరిగాయని అధికారులు గుర్తించారు. అందుకే ఈసారి భారీ డిపాజిట్ తప్పనిసరి చేశారు. కోకాపేటలో 8,591 చ.గజాల భూమి వేలంలో పాల్గొనాలంటే రూ.5 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే. మొత్తంగా, కోకాపేటతో పాటు ఇతర ప్రాంతాల్లో కనీస ధరలు పెరగడం రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త చర్చను తెచ్చింది.
This post was last modified on August 21, 2025 10:23 am
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…