హైదరాబాద్ నగరంలో భూముల ధరలు మళ్లీ చర్చకు తెరలేపాయి. హెచ్ఎండీఏ తాజాగా ఆన్లైన్ వేలానికి నోటిఫికేషన్ జారీ చేస్తూ కనీస ధరలను భారీగా పెంచింది. ముఖ్యంగా కోకాపేట నియోపొలిస్ ప్రాంతంలో చ.గజం రూ.1.75 లక్షలుగా ధర నిర్ణయించడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో షాక్ ఇచ్చింది. గతంలో ఇదే ధర రూ.65 వేలుగా ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా రెండింతలు కంటే ఎక్కువ పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
కోకాపేటలో ప్రభుత్వ భూములు ఎప్పటినుంచో హాట్టాపిక్ గా నిలుస్తున్నాయి. సర్వే నెంబర్ 144లో ఉన్న 8,591 చ.గజాల భూమి ప్రస్తుతం వేలం కోసం సిద్ధంగా ఉంది. కొత్త కనీస ధర ప్రకారం ఈ భూమి విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుంది. అయితే వాస్తవ వేలంలో ధర ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. గతంలో ఇదే ప్రాంతంలో ఓ ఎకరా భూమి రూ.100 కోట్లకు అమ్ముడైన సంఘటన ఇంకా గుర్తుండగానే ఉంది.
ఇక బాచుపల్లి, బైరాగిగూడ, చందానగర్, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో కూడా కనీస ధరలు పెరిగాయి. బాచుపల్లిలో చ.గజానికి రూ.70 వేలుగా, బైరాగిగూడలో రూ.75 వేలుగా ధర నిర్ణయించారు. ఈ ధరలు గతం కంటే రెండింతలు పెరగడం గమనార్హం. రియల్ ఎస్టేట్ డిమాండ్, ఐటీ కారిడార్ విస్తరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కారణంగా ధరలు ఇంతకంతకూ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గతంలో మోకిలలో జరిగిన వేలం అనుభవం అధికారులు మరిచిపోలేదు. అప్పుడు చాలామంది ఎక్కువ ధరలు చెప్పి తరువాత డబ్బులు చెల్లించక వెనక్కు తగ్గారు. తమ భూముల ధరలు పెరగడానికే అలాంటి ప్రయత్నాలు జరిగాయని అధికారులు గుర్తించారు. అందుకే ఈసారి భారీ డిపాజిట్ తప్పనిసరి చేశారు. కోకాపేటలో 8,591 చ.గజాల భూమి వేలంలో పాల్గొనాలంటే రూ.5 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే. మొత్తంగా, కోకాపేటతో పాటు ఇతర ప్రాంతాల్లో కనీస ధరలు పెరగడం రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త చర్చను తెచ్చింది.
This post was last modified on August 21, 2025 10:23 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…