హైదరాబాద్ నగరంలో భూముల ధరలు మళ్లీ చర్చకు తెరలేపాయి. హెచ్ఎండీఏ తాజాగా ఆన్లైన్ వేలానికి నోటిఫికేషన్ జారీ చేస్తూ కనీస ధరలను భారీగా పెంచింది. ముఖ్యంగా కోకాపేట నియోపొలిస్ ప్రాంతంలో చ.గజం రూ.1.75 లక్షలుగా ధర నిర్ణయించడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో షాక్ ఇచ్చింది. గతంలో ఇదే ధర రూ.65 వేలుగా ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా రెండింతలు కంటే ఎక్కువ పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
కోకాపేటలో ప్రభుత్వ భూములు ఎప్పటినుంచో హాట్టాపిక్ గా నిలుస్తున్నాయి. సర్వే నెంబర్ 144లో ఉన్న 8,591 చ.గజాల భూమి ప్రస్తుతం వేలం కోసం సిద్ధంగా ఉంది. కొత్త కనీస ధర ప్రకారం ఈ భూమి విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుంది. అయితే వాస్తవ వేలంలో ధర ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. గతంలో ఇదే ప్రాంతంలో ఓ ఎకరా భూమి రూ.100 కోట్లకు అమ్ముడైన సంఘటన ఇంకా గుర్తుండగానే ఉంది.
ఇక బాచుపల్లి, బైరాగిగూడ, చందానగర్, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో కూడా కనీస ధరలు పెరిగాయి. బాచుపల్లిలో చ.గజానికి రూ.70 వేలుగా, బైరాగిగూడలో రూ.75 వేలుగా ధర నిర్ణయించారు. ఈ ధరలు గతం కంటే రెండింతలు పెరగడం గమనార్హం. రియల్ ఎస్టేట్ డిమాండ్, ఐటీ కారిడార్ విస్తరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కారణంగా ధరలు ఇంతకంతకూ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గతంలో మోకిలలో జరిగిన వేలం అనుభవం అధికారులు మరిచిపోలేదు. అప్పుడు చాలామంది ఎక్కువ ధరలు చెప్పి తరువాత డబ్బులు చెల్లించక వెనక్కు తగ్గారు. తమ భూముల ధరలు పెరగడానికే అలాంటి ప్రయత్నాలు జరిగాయని అధికారులు గుర్తించారు. అందుకే ఈసారి భారీ డిపాజిట్ తప్పనిసరి చేశారు. కోకాపేటలో 8,591 చ.గజాల భూమి వేలంలో పాల్గొనాలంటే రూ.5 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే. మొత్తంగా, కోకాపేటతో పాటు ఇతర ప్రాంతాల్లో కనీస ధరలు పెరగడం రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త చర్చను తెచ్చింది.
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…